మన్యానికి ప్రభుత్వ వైద్య కళాశాల
పార్వతీపురంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు సర్కారు పచ్చజెండా ఊపింది.
రూ.600 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు
పార్వతీపురం జిల్లా ఆసుపత్రి ఎదుట సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి గుర్తించిన స్థలమిది. ఇక్కడ రూ.50 కోట్లతో నిర్మించేందుకు రెండేళ్ల కిందట ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. నేటికీ పనులు మొదలు కాలేదు.
పార్వతీపురం, పార్వతీపురం పట్టణం, న్యూస్టుడే: పార్వతీపురంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు సర్కారు పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో కళాశాల లేని పార్వతీపురం మన్యం జిల్లాలోనూ ఏర్పాటు చేస్తామని ఆగస్టు 27న ముఖ్యమంత్రి ప్రకటించారు. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ రూ.600 కోట్లతో వైద్య కళాశాల, బోధనాసుపత్రి, వసతి, నివాస గృహాలు, అనుబంధ నిర్మాణాలు, నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తారా.. లేదా వేరే చోట నిర్మాణం చేపడతారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కళాశాల ఏర్పాటుకు కనీసం 30 ఎకరాల భూమి అందుబాటులో ఉండాలి. పార్వతీపురం పట్టణ సమీపంలో ఎక్కడా అంత భూమి లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆసుపత్రికి అనుబంధంగానే కళాశాల ఏర్పాటవుతుందని భావిస్తున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి.
ఆదేశాలు రావాల్సి ఉంది
వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.600 కోట్లతో ఉత్తర్వులు వచ్చాయి. దీనికి సంబంధించిన విధివిధానాలు, నిర్మించాల్సిన ప్రాంతం తదితర అంశాలు తేలాల్సి ఉంది. త్వరలో ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. అక్కడి నుంచి ఆదేశాలు వస్తే క్షేత్రస్థాయిలో పనులు చేపట్టేందుకు ఇంజినీరింగ్ యంత్రాంగం సిద్ధంగా ఉంది.
సత్యప్రభాకర్, కార్యనిర్వాహక ఇంజినీరు, ఏపీఎంఐడీసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్లు కట్టలేక పోయారు
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార పరివాహక ప్రాంత రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని సీఎం జగన్మోహనరెడ్డి నెరవేర్చలేదు. -
9న చీపురుపల్లికి చంద్రబాబు
[ 07-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా చీపురుపల్లిలో 9న ప్రజాగళం భారీ బహిరంగ సభకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కానున్నట్లు తెదేపా విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. -
మా ‘గడప’కొస్తే.. తరిమికొడతాం!!
[ 07-05-2024]
నమ్మి ఓట్లేశాం.. అభివృద్ధి చేస్తారని భావించాం.. మా పిల్లలకు భవిష్యత్తునిస్తారని కలలుగన్నాం.. కానీ ఈ ఐదేళ్లలో ఆక్రమణలపై పెట్టిన దృష్టి మా కష్టాలపై పెట్టలేదు..మా అవస్థలను చూడలేదు.. ఉద్యోగాల కోసం మా యువకులు పడుతున్న శ్రమను గుర్తించలేదు. -
నోట్లతో ఎర.. బెదిరింపులు జర
[ 07-05-2024]
పార్వతీపురం నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలను ఎన్నికల విధులకు తీసుకున్నారు. వారికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేశారు. -
ఊడిపోతున్నాయ్... పంకా రెక్కలు
[ 07-05-2024]
పంకా రెక్కలు ఊడిపోతున్నాయ్.. ఇంతకాలం వైకాపాను నమ్మి తామేం కోల్పోయామో ఆ పార్టీ నేతలు, శ్రేణులతో పాటు ప్రజలు గ్రహించారు. -
దేవుడికే ‘జగన్’ శఠగోపం
[ 07-05-2024]
శతాబ్దాల చరిత్ర సొంతం.. ఉట్టిపడే శిల్పకళా సౌందర్యం.. భక్తకోటికి దైవసాన్నిహిత్యం.. ఇలా ఎన్నో విశిష్టతల సమాహారం.. అందుకే ఉభయ జిల్లాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలది ప్రత్యేక స్థానం.. -
పోస్టల్ బ్యాలెట్లు.. ఉద్యోగుల ఇక్కట్లు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలెట్లో భాగంగా ఓట్లేసేందుకు ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జేఎన్టీయూ గురజాడ విద్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఈ పరిస్థితి కనిపిస్తోంది. -
రాజీనామా చేసిన వాలంటీర్లకు జీతాలు చెల్లింపు
[ 07-05-2024]
ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు పెద్ద ఎత్తున రాజీనామా చేస్తూ వస్తున్నారు. ఇలా ఉద్యోగాలు వదులుకున్న వారికి గౌరవవేతనం చెల్లించకూడదు. -
జగనన్న కాలనీల్లో బినామీలు!
[ 07-05-2024]
ఉభయ జిల్లాల్లోని జగనన్న కాలనీల్లో బినామీలు పాగా వేస్తున్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులోనే రాజకీయాలు, ఒత్తిళ్లు చోటు చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మా ఇంట్లో ఓట్లు.. అమ్మకానికి లేవు
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)