కూ..చుక్చుక్..కూత వినపడేనా!
రైలు బస్సు.. ఇటు విజయనగరం, అటు పార్వతీపురం మన్యం జిల్లాల మధ్య సాధారణ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రైలు.
నిలిచిన ‘రైలుబస్సు’ సేవలు
బొబ్బిలి- సాలూరు పాసింజర్ రైలుకు ప్రతిపాదనలు
సాలూరుకు వెళ్లే ట్రాకుపై మరో రైలు నిలిపివేత
బొబ్బిలి, న్యూస్టుడే: రైలు బస్సు.. ఇటు విజయనగరం, అటు పార్వతీపురం మన్యం జిల్లాల మధ్య సాధారణ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రైలు. బొబ్బిలి- సాలూరు మధ్య నడిచే ఈ రైలు బస్సు సేవలు మూడేళ్లుగా నిలిచిపోయాయి. పదేళ్ల పాటు నడిచిన దీని ద్వారా ఈ మార్గంలో అనుకున్న మేర ఆదాయం రావడంలేదని, కొవిడ్ కారణంగా ఉన్నతాధికారులు దీని సేవలు పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు దీన్ని పునరుద్ధరించాలంటూ ఈ ప్రాంత ప్రజలు రైల్వే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు వినతులు అందజేస్తున్నారు. ఫలితంగా ప్రత్యామ్నాయంగా పాసింజరు రైలు నడిపేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది. కొత్త ప్రతిపాదనపై ప్రయాణికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ట్రాకు మెరుగు పనులు చేపట్టాల్సిందే
ఈ మార్గంలో రైల్వే ట్రాకు మెరుగు పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. మూడేళ్లుగా నిర్వహణ లేక బలహీనంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విద్యుద్ధీకరణ పనులు కూడా చేపట్టారు. ట్రాకు అభివృద్ధి చేపట్టనున్నారు. రైలు పునరుద్ధరించే నాటికి ఇవి పూర్తికావాలి. కరోనా సమయంలో కొన్ని రైళ్లను ఉంచేందుకు ఈ ట్రాకును వినియోగించారు. లైన్ల నిర్వహణ, ఇతర మరమ్మతులకు సంబంధించిన వాహనాలు, గూడ్సు రైళ్లు ఉంచేందుకు ఈ లైను ఉపయోగపడుతోంది. బొబ్బిలి నుంచి రామభద్రపురం మీదుగా సాలూరు వెళ్లాలంటే గంట సమయం పడుతుంది. అదే రైలు సేవలు ప్రారంభిస్తే ప్రయాణికులకు రూ.20 ఆర్థికభారం ఉండదు. 30 నిమిషాలు సమయం ఆదా అవుతుంది.
త్వరలో ఏర్పాటు చేస్తాం..
బొబ్బిలి- సాలూరు మధ్య రైలు బస్సును నడపలేం. ట్రాకు నాణ్యతగా లేదు. త్వరలోనే నిర్వహణ చేపట్టి పాసింజరు రైలు నడిపేందుకు ప్రతిపాదన చేస్తున్నామని ఇటీవల బొబ్బిలి రైల్వే స్టేషన్ను సందర్శించిన డీఆర్ఎం అనూప్ కుమార్ శత్పథి వెల్లడించారు. రైలు నడపాలని ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండు మేరకు పరిశీలిస్తున్నామని ఆయన ప్రకటించారు. బొబ్బిలిలో సదుపాయాలు కూడా మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.
పాసింజరు రైలుతో కష్టాలకు తెర...
గతంలో బొబ్బిలి- సాలూరు మధ్య మాత్రమే రైలు బస్సు నడిచేది. రోజుకు నాలుగు ట్రిప్పులు నడిపేవారు. సాలూరు, మక్కువ, పాచిపెంట, రామభద్రపురం, బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాల్లోని పదుల సంఖ్యలో ఆయా గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేది. ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ప్రయాణించేవారు. దూర ప్రాంతానికి వెళ్లే వారు మాత్రం ఏజెన్సీ నుంచి బొబ్బిలి వచ్చి మరో రైలును ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు సాలూరు నుంచి నేరుగా విజయనగరం మీదుగా విశాఖకు రైలు నడిపేందుకు రైల్వేశాఖ ఆలోచన చేస్తోంది. ఇది సాకారమైతే పైగ్రామాల ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుంది. వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి. సాలూరులో రైల్వే సముదాయాలు కూడా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. రైల్వేశాఖకు మరింత ఆదాయం సమకూరుతుంది. 50 ఏళ్ల కిందట నుంచి సాలూరు-బొబ్బిలి- రాజాం మధ్య రైలు సదుపాయం కల్పించాలని ఈ ప్రాంత వాసులు డిమాండు చేస్తున్నారు. ప్రతిపాదనలూ ఉన్నాయి. కొత్త ట్రాకుల పునరుద్ధరణ సాధ్యపడదని రైల్వే ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. దీంతో పాసింజరు రైలు నడిపేందుకు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూచోడి సర్వే మాయ
[ 06-05-2024]
అన్నదాతలకు మేలు చేకూర్చేదిగా జగన్ చెబుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాయ వెనుక అసలు కథకు మూలం.. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఉద్దేశించిందన్న రీసర్వే. ఉమ్మడి జిల్లాలో 2020 డిసెంబరులో ఈ పన్నాగానికి తెరలేపారు. -
కర్కశ పాలనలో రక్కసి రోడ్లు
[ 06-05-2024]
ఎన్నికలకు ముందు దారులేస్తామని మాటిచ్చిన పాలకులు.. అధికారంలోకి రాగానే వారి జగనన్న పాలనను చూసి.. అన్నీ వదిలేశారు.. అభివృద్ధి మాటే మరిచారు. ప్రజాందోళనలతో కొన్నిచోట్ల పనులు ప్రారంభించేందుకు అధికారులు ముందుకు రాగా.. -
పునరావాసంలో జగన్మోసం
[ 06-05-2024]
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల బాగోగులు పాలకులకు పట్టడం లేదు. పుట్టినగడ్డ నుంచి పునరావాస కాలనీలకు తరలించినా.. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. -
ఆశలు అడియాసలు చేశావ్ జగనన్న
[ 06-05-2024]
ఆశా కార్యకర్తల్లో వివిధ కారణాలతో చనిపోయిన వారంతా 30 నుంచి 50 ఏళ్ల లోపు వాళ్లే. వీరిలో కొంతమందికి భర్తలు లేరు. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు, ఇంకా చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. -
పాలవలస కుటుంబానికి చుక్కెదురు!
[ 06-05-2024]
వీరఘట్టం మండలంలోని పనసనందివాడలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబానికి చుక్కెదురైంది. గత కొన్నేళ్లుగా ఆ కుటుంబానికి, వైకాపాకు ఈ గ్రామం పట్టుకొమ్మగా ఉండేది. -
ఓటెత్తిన ఉద్యోగులు
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. నాలుగు నియోజకవర్గాల్లో వివిధ హోదాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 6,818 మంది ఉద్యోగులు బ్యాలెట్లు పొందారు. -
ప్రైవేటు ఉద్యోగులకు ఎన్నికల విధులు
[ 06-05-2024]
ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నారు. పార్వతీపురం పట్టణంలో వివిధ ప్రైవేటు కళాశాలలు, ఐటీఐల్లో పనిచేస్తున్న వారు విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చారు. -
రాక్షస పాలన వారంలో ముగుస్తుంది
[ 06-05-2024]
రానున్న మరో వారం రోజుల్లో రాక్షస పాలన ముగుస్తుందని, ప్రజలంతా ఓటు అనే బలమైన ఆయుధంతో గద్దె దింపుతారని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎన్డీయే కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. -
చేనేత కార్మికులకు తెదేపాతోనే భవిత
[ 06-05-2024]
చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి అండగా ఉంటుందని రాజాం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. పట్టణానికి చెందిన చేనేత కార్మికుల నాయకుడు నల్లశ్రీను ఆధ్వర్యంలో లచ్చయ్యపేట, -
ఇండియా కూటమితోనే గిరిజనులకు న్యాయం
[ 06-05-2024]
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎంకు గిరిజన సమస్యలు తెలుసునని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారట్ పేర్కొన్నారు. -
ప్రజల ఆస్తులు కొల్లగొట్టేందుకు టైటిలింగ్ చట్టం
[ 06-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ చట్టం ముసుగులో పట్టపగలు దోపిడీకి జగన్మోహన్రెడ్డి తెరలేపారని మాజీ ఎంపీ, అరకు కూటమి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!