తెలుగు జాతికి వెలుగు సందేశం
తెలుగు వాణికి వెలుగులద్దిన మహనీయుడు, నటసార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం శివారున తెదేపా మహానాడు వైభవంగా జరుగుతోంది.
ఈనాడు, రాజమహేంద్రవరం
పూల వాన : ఎన్టీఆర్ విగ్రహం వద్ద..
తెలుగు వాణికి వెలుగులద్దిన మహనీయుడు, నటసార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం శివారున తెదేపా మహానాడు వైభవంగా జరుగుతోంది. తొలిరోజు శనివారం ఉభయ తెలుగురాష్ట్రాల ప్రతినిధుల సభ నిర్వహించారు. అంచనాలకు మించి హాజరుకావడంతో వేదికలు, ప్రాంగణాలు కిక్కిరిశాయి. పార్టీ శ్రేణులు, వాలంటీర్లు, ఆయా విభాగాల సమన్వయకర్తలు తక్షణ ఏర్పాట్లతో సౌకర్యాలు కల్పించారు. ఆటంకాలను అధిగమించి..
వేలాదిగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలుచల్లి ఘన నివాళి అర్పించారు. అనంతరం చంద్రబాబునాయుడు ప్రసంగిస్తూ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల సంక్షేమం, ఎన్నికలకు సమాయత్తం తదితరాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. సభా ప్రాంగణం, వేదికపై లోకేశ్ అందరికీ నమస్కరిస్తూ పలకరించారు. పలువురితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చిన ముఖ్య నాయకులూ వేదికపై ప్రసంగించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడారు. తెలంగాణ నుంచి వచ్చిన మహిళలు బతుకమ్మలతో సందడి చేశారు. కార్యకర్తలు, అభిమానులు వేషధారణలతో అలరించారు. మహానాడు వేడుకలతో కళల కాణాచి రాజమహేంద్రవరం పరిసరాలు సందడిగా మారాయి. పసుపు పారాణితో అలంకరించినట్లు ఎక్కడ చూసినా జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలు శోభ తెచ్చాయి. అధినేత చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం తెలుగు జాతికి వెలుగు తెచ్చేలా సాగింది.
యువగళం : తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దరహాసం
సేవకులు మూడు వేలు..
* మహానాడుకు తరలివచ్చినవారికి మూడు వేలమంది వాలంటీర్లు సేవలందించారు.
* చంద్ర దండు, ఐటీడీపీ, యువగళం, తెలుగుయువతకు సంబంధించి ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి వచ్చిన వాలంటీర్లు భోజనాలు, మంచినీళ్ల బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, వాహనాల నియంత్రణ వంటి సేవలందించారు.
* సభావేదిక వద్ద చంద్ర దండు వాలంటీర్లు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
* ఆదివారం బహిరంగ సభకు లక్షలాదిగా కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్న నేపథ్యంలో మరింతమంది వాలంటీర్లను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విజయ పతాక: తెదేపా జెండా ఎగురవేస్తున్న చంద్రబాబు, చిత్రంలో అచ్చెన్నాయుడు
అభిమాన సంద్రం: తెదేపా శ్రేణుల హుషారు
దున్నేద్దాం: నాగలితో కార్యకర్త
వేదికపైకి వస్తున్న తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
తెలంగాణ నాయకుడు నర్సిరెడ్డితో గంటా శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముచ్చట్లు
తెలుగు మహిళలు: తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న, గౌతు శిరీష తదితరులు
బతుకమ్మ.. దీవించమ్మా: తెలంగాణ నుంచి వచ్చిన కాట్రగడ్డ ప్రసూన, షకీలారెడ్డి
పలకరింపు: రామ్మోహన్నాయుడుతో అశోక్
కానుక: అధినేతకు బహూకరిస్తున్న కార్యకర్త
కుర్రోళ్లు: యువగళం పాటకు నృత్యం
ప్రాణదాత పుస్తకావిష్కరణలో అధినేతతో గోరంట్ల తదితరులు
మయూర మాలతో సత్కరించిన బుద్ధా వెంకన్న, కటకంశెట్టి ప్రభాకర్ తదితరులు
కేరింతలతో యువత జోష్
చంద్రన్న.. మళ్లీ నువ్వే రావాలన్నా.. సీడీ ఆవిష్కరణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!