ఏదీ ఆ పర్యవేక్షణ
ఉమ్మడి జిల్లాలో క్షయ విజృంభిస్తోంది. గత మూడేళ్లలో ఏడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది విజయనగరం జిల్లాలో మూడు నెలల వ్యవధిలో 600 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు.
జిల్లాలో క్షయ విజృంభణ
మూడేళ్లలో 7 వేలకు పైగా కేసులు
రోగుల పర్యవేక్షణ కోసం నియమించిన సూపర్వైజర్లకు కేటాయించిన ద్విచక్ర వాహనాలివీ. ప్రస్తుతం విజయనగరంలోని టీబీ వార్డు వద్ద ఇలా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి
విజయనగరం వైద్యవిభాగం, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో క్షయ విజృంభిస్తోంది. గత మూడేళ్లలో ఏడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది విజయనగరం జిల్లాలో మూడు నెలల వ్యవధిలో 600 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. దీనిని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి 2025 నాటికి నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. రోగుల సంఖ్యగా పెరుగుతోంది.
వ్యాధిగ్రస్థుల్లో పురుషులే అధికంగా ఉంటున్నారు. గత నాలుగేళ్లుగా చికిత్స పొందిన వారిలో బాలలూ ఉన్నారు. మద్యం, ధూమపానం, పని ఒత్తిడి, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం తదితర కారణాలతో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. చరవాణులు, కంప్యూటర్ల అధిక వినియోగంతో నిద్ర లేక, సరైన తిండి లేక విద్యార్థులను సైతం వ్యాధి వెంటాడుతోందని పేర్కొంటున్నారు.
పీహెచ్సీల పరిధిలోని ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశాలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలి. వీరు రోగుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలి. బాధితులకు నెలకు రూ.500 చొప్పున పింఛను సౌకర్యం కూడా ఉంది. ఆ నగదు అందుతుందో లేదో చూడాలి. నియంత్రణ, పర్యవేక్షణ కోసం గతంలో సూపర్వైజర్లను నియమించారు. వీరు కానరావడం లేదు. వారికి కేటాయించిన ద్విచక్ర వాహనాలు విజయనగరంలోని టీబీ వార్డు వద్దే మూలుగుతున్నాయి. ఈ భవనం సైతం శిథిలావస్థకు చేరింది. సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆదేశాలు జారీ చేస్తాం
విజయనగరం జిల్లావ్యాప్తంగా 10 టీబీ యూనిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా పీహెచ్సీల్లో మైక్రో ల్యాబ్లు పెట్టాం. రెండు సీబీ నాట్ యంత్రాలు పనిచేస్తున్నాయి. రెండు గంటల్లోనే ఫలితాలు పొందవచ్చు. సక్రమంగా మందులు వాడితే ఇబ్బంది ఉండదు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొందరికి తీవ్రమవుతోంది. ఈ మేరకు అవగాహన కల్పిస్తున్నాం. క్షేత్రస్థాయి సిబ్బంది పక్కాగా పనిచేసేలా ఆదేశాలు జారీ చేస్తాం.
ఎస్.భాస్కరరావు, డీఎంహెచ్వో, విజయనగరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
[ 28-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పరిశ్రమలను సైతం మూసేసి చెరకు రైతుల నోట్లో మట్టికొట్టారు. పనిచేస్తున్న కార్మికులను పస్తుల్లో ఉంచారు. చెరకు పంట సాగు ప్రశ్నార్థకంగా మారేలా చేశారు. -
అందలంపై నీవు.. అంధకారంలో మేము
[ 28-04-2024]
గతంలో చీకటి రాజ్యాలుండేవి.. జగనన్న రాజ్యంలో మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. గత ఐదేళ్లలో వీధుల్లో గాఢాంధకారమే నెలకొంది.. వెలుగులిస్తామని చెప్పిన ఈ పరదాల వీరుడు ప్రతి వీధిలోనూ చీకట్లనే నింపారు.. -
రూపాయి రుణమివ్వని జగన్
[ 28-04-2024]
బీసీల్లో వివిధ వర్గాలకు చెందిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు గత ప్రభుత్వం కాపు, కుమ్మరి, రజక, నాయీ బ్రాహ్మణ, వాల్మీకి, బోయి తదితర కులాలతో పాటు ఈబీసీ, ఎంబీసీ(సంచార జాతులు), వైశ్య తదితర కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. -
కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్
[ 28-04-2024]
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని తెదేపా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. -
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు
[ 28-04-2024]
స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. -
వైకాపాను ఛీకొట్టి.. ఓటుకు జైకొట్టి
[ 28-04-2024]
ఇళ్ల వద్ద ఓటు వినియోగించే వృద్ధులు, దివ్యాంగులను మాయ చేయాలని చూసిన వైకాపా నాయకుల వికృత ఆలోచనకు ఎదురు దెబ్బ తగిలింది. -
జిల్లా ఓటర్లు 7,83,440
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. -
టోల్ తీస్తారు
[ 28-04-2024]
విజయనగరం జిల్లాలో మూడు ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు త్వరలో ప్రారంభించనున్నారు. -
కోలగట్ల ఎమ్మెల్యే అయితే భూములు మాయం
[ 28-04-2024]
విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రభుత్వ భూములతో పాటు నగరవాసుల భూములు కూడా మాయమవుతాయని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు. -
ఇది జగనన్న చీకటి రాజ్యం..!!
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలకు అంధకారమే మిగిలింది. ఎక్కడ చూసినా వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది. -
సర్కార్ తెచ్చిన నీటి కరవు
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల లోపం.. ప్రజల పాలిట శాపంగా మారింది. నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా చేయడంతో బొబ్బిలి పట్టణ వాసుల గొంతులు ఎండిపోతున్నాయి. -
పెద్దపల్లికి పెద్దగెడ్డ నీరు తెస్తా
[ 28-04-2024]
పెద్దపల్లిలో చెరువుకు వెళ్లే దారిలో వంతెన నిర్మిస్తామని, పెద్దగెడ్డ నీరు తీసుకువచ్చి రైతుల కాళ్లు కడుగుతానని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు.