చీపురుపల్లికి కొత్త కళా
తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. చీపురుపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావుకు అవకాశం దక్కింది.
ఈనాడు-విజయనగరం, రాజాం, గరివిడి, న్యూస్టుడే: తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. చీపురుపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావుకు అవకాశం దక్కింది.
చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి సమర్థుడైన నేతను ఎన్నికల సమరంలోకి దించాలని చంద్రబాబు తొలి నుంచి యోచిస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును తీసుకురావాలని నిర్ణయించారు. ఆయన భీమిలి టికెట్ ఆశించడం.. అక్కడ సైతం సమర్థుడైన నేత కనిపించకపోవడంతో ఈ రెండు స్థానాల్లో ధీటైన నేతలను బరిలో నిలపాలని చంద్రబాబు కసరత్తు చేశారు. చివరకు భీమిలిలో గంటాను, చీపురుపల్లిలో కళా వెంకటరావుల పేర్లు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసిన జాబితాలో ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది.
జిల్లాతో అనుబంధం
విజయనగరంతో ఎంతో అనుబంధం ఉంది. మహరాజా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. జిల్లాల విభజన తర్వాత ఆయన స్వగ్రామం విజయనగరంలో చేరింది. చీపురుపల్లి తెదేపా ఇన్ఛార్జి, విజయనగరం పార్లమెంట్ జిల్లా తెదేపా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు కళావెంకటరావు పెదనాన్న. మాజీ ఎమ్మెల్యే గణపతిరావు సోదరుడు. మరదలు డాక్టర్ కిమిడి మృణాళిని 2014లో ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణపై గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. వైకాపాలో కాపు నాయకుడిగా ఎదిగి అధికార పార్టీలో చక్రం తిప్పుతున్న బొత్సకు రాజకీయంగా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో తెదేపా అధినేత కళావెంకటరావును ఎంపిక చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇదీ రాజకీయ ప్రస్థానం
1983, 1985, 1989, 2004 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో అప్పటి ఉణుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డైరెక్టర్గా, ఏపీ టూరిజం డైరెక్టర్గా పనిచేశారు. 1984లో తితిదే పాలక మండలి సభ్యుడు. 1985లో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో రెండున్నర సంవత్సరాలు పురపాలక శాఖ మంత్రిగా, తర్వాత వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా సేవలు అందించారు. 1988లో హోం మంత్రి పదవి చేపట్టారు. 1989లో తితిదే పాలక మండలి ఛైర్మన్గా పనిచేశారు. 1998 రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎచ్చెర్ల స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. తర్వాత 2014లో ఎచ్చెర్ల నుంచి తెదేపా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ ఎన్నికల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2015-21 తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించారు. ప్రస్తుతం తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడిగా, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
[ 28-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పరిశ్రమలను సైతం మూసేసి చెరకు రైతుల నోట్లో మట్టికొట్టారు. పనిచేస్తున్న కార్మికులను పస్తుల్లో ఉంచారు. చెరకు పంట సాగు ప్రశ్నార్థకంగా మారేలా చేశారు. -
అందలంపై నీవు.. అంధకారంలో మేము
[ 28-04-2024]
గతంలో చీకటి రాజ్యాలుండేవి.. జగనన్న రాజ్యంలో మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. గత ఐదేళ్లలో వీధుల్లో గాఢాంధకారమే నెలకొంది.. వెలుగులిస్తామని చెప్పిన ఈ పరదాల వీరుడు ప్రతి వీధిలోనూ చీకట్లనే నింపారు.. -
రూపాయి రుణమివ్వని జగన్
[ 28-04-2024]
బీసీల్లో వివిధ వర్గాలకు చెందిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు గత ప్రభుత్వం కాపు, కుమ్మరి, రజక, నాయీ బ్రాహ్మణ, వాల్మీకి, బోయి తదితర కులాలతో పాటు ఈబీసీ, ఎంబీసీ(సంచార జాతులు), వైశ్య తదితర కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. -
కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్
[ 28-04-2024]
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని తెదేపా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. -
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు
[ 28-04-2024]
స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. -
వైకాపాను ఛీకొట్టి.. ఓటుకు జైకొట్టి
[ 28-04-2024]
ఇళ్ల వద్ద ఓటు వినియోగించే వృద్ధులు, దివ్యాంగులను మాయ చేయాలని చూసిన వైకాపా నాయకుల వికృత ఆలోచనకు ఎదురు దెబ్బ తగిలింది. -
జిల్లా ఓటర్లు 7,83,440
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. -
టోల్ తీస్తారు
[ 28-04-2024]
విజయనగరం జిల్లాలో మూడు ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు త్వరలో ప్రారంభించనున్నారు. -
కోలగట్ల ఎమ్మెల్యే అయితే భూములు మాయం
[ 28-04-2024]
విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రభుత్వ భూములతో పాటు నగరవాసుల భూములు కూడా మాయమవుతాయని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు. -
ఇది జగనన్న చీకటి రాజ్యం..!!
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలకు అంధకారమే మిగిలింది. ఎక్కడ చూసినా వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది. -
సర్కార్ తెచ్చిన నీటి కరవు
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల లోపం.. ప్రజల పాలిట శాపంగా మారింది. నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా చేయడంతో బొబ్బిలి పట్టణ వాసుల గొంతులు ఎండిపోతున్నాయి. -
పెద్దపల్లికి పెద్దగెడ్డ నీరు తెస్తా
[ 28-04-2024]
పెద్దపల్లిలో చెరువుకు వెళ్లే దారిలో వంతెన నిర్మిస్తామని, పెద్దగెడ్డ నీరు తీసుకువచ్చి రైతుల కాళ్లు కడుగుతానని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!