అప్పుడు రూ.250.. ఇప్పుడు రూ.10,000
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ధరావత్తు చెల్లించాలి. శాసనభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ధరావత్తుగా రూ.10 వేలు ఎన్నికల సంఘానికి చెల్లించాలి.
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ధరావత్తు చెల్లించాలి. శాసనభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ధరావత్తుగా రూ.10 వేలు ఎన్నికల సంఘానికి చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.5 వేలు చెల్లిస్తే సరిపోతుంది. లోక్సభ ఎన్నికల్లో సాధారణ అభ్యర్థులు రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 చెల్లించాలి. 1996 వరకూ ధరావత్తు మొత్తం శాసనసభ ఎన్నికలకు రూ.250, లోక్సభకు రూ.500గా సాధారణ అభ్యర్థులకు ఉండేది. ఎస్సీ, ఎస్టీలయితే ఇందులో సగం చెల్లిస్తే చాలు. గెలిచే ఉద్దేశం లేకున్నా.. పోటీకి దిగేవారు ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఓటర్లను పక్కదారి పట్టించి, ప్రత్యర్థి ఓట్లు తగ్గించడానికి మరికొందరి చేత నామినేషన్లు వేయించడం సాధారణంగా జరుగుతోంది. అయితే పోలైన ఓట్లలో కనీసం ఆరోవంతు సాధించకపోతే అభ్యర్థులకు ఆ డిపాజిట్ మొత్తం తిరిగి రాదు.
న్యూస్టుడే, రాజాం, విజయనగరం అర్బన్
ఇవీ నిబంధనలు..
- పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను నలుగురు, స్వతంత్రంగా పోటీ చేసే వారిని పది మంది నియోజకవర్గానికి చెందిన ఓటర్లు బలపర్చాలి.
- నామినేషన్కు 48 గంటల ముందు గుర్తింపు పొందిన బ్యాంకులో ఖాతా తెరవాలి. దాని ద్వారానే ఎన్నికల ప్రచారం, ఇతర అవసరాలకు వెచ్చించిన సొమ్ముకు సంబంధించి లావాదేవీలు నిర్వహించాలి.
- ఫారం-2ఎ (పార్లమెంట్కు), 2బి (అసెంబ్లీకి) ప్రతాలు దాఖలు చేయాలి. దీంతో పాటు ఫారం-26 (అఫిడవిట్) సమర్పించాలి. అభ్యర్థి, అతని కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు, కేసుల వివరాలు, క్రైం నంబరు పొందుపర్చాలి. స్వయంగా ఇస్తే ఆర్వో ఎదురుగా ప్రతిజ్ఞ చేయాలి. ఇతరులతో పంపిస్తే ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ నోటరీ చేసి ఉండాలి. అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు, అఫిడవిట్లు ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. పారదర్శకంగా ఉండేందుకు వీడియో తీస్తారు.
- ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగి రాజీనామా చేయాలి. ఆమోద ధ్రువపత్రాన్ని నామినేషన్తో జతచేయాలి.
- పార్టీ తరఫున అభ్యర్థులు ఒరిజినల్ బి-ఫారం అందజేయాలి. నామినేషన్ గడువు ముగిసేరోజు 3 గంటల్లోపు అందజేయవచ్చు. రెండు ఫొటోలు, ఓటరు కార్డు, బలపరిచే వారి గుర్తింపు పత్రాలివ్వాలి.
నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు
విజయనగరం తహసీల్దారు కార్యాలయం వద్ద 100 మీటర్ల పరిధిలో బారికేడ్లు కడుతున్న వీఆర్ఏలు
విజయనగరం గ్రామీణం, న్యూస్టుడే: జిల్లా కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో గురువారం నుంచి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామపత్రాలు స్వీకరించేందుకు రిటర్నింగ్ అధికారి, సంయుక్త కలెక్టరు కె.కార్తీక్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం నామపత్రాలు స్వీకరిస్తారు. అభ్యర్థితో సహా అయిదుగురిని మాత్రమే 100 మీటర్ల పరిధిలో లోపలికి అనుమతిస్తారు. ఉదయం 11 నుంచి 3 వరకు నామపత్రాలను ఆర్వో స్వీకరిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకు ఖాతాల తనిఖీ
[ 30-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అందజేసిన సామాజిక పింఛన్ల భృతిని మే, జూన్ నెలల్లో బ్యాంకు ఖాతాలలో జమ చేసి నగదును బట్వాడా చేసేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. -
తెదేపాతోనే గిరిజన సమస్యల పరిష్కారం
[ 30-04-2024]
తెదేపా అధికారంలోకి వస్తేనే గిరిజనుల కష్టాలు తీరుతాయని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. -
ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
[ 30-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు యంత్రాంగానికి సహకరించాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడు ప్రమోద్కుమార్ మెహర్ద అన్నారు. -
అందరూ నన్ను తిట్టుకుంటే.. మీరు ఓట్లు దండుకుంటారా..
[ 30-04-2024]
ఒకటా.. రెండా.. 26 నెలలుగా నన్ను ఏ ఒక్క నాయకుడూ నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. నాపై రాళ్లు తేలి.. గుంతలుగా మారడంతో ఎందరో ప్రయాణికులు అదుపుతప్పి నన్నే తిట్టుకున్నారు. -
వైకాపా నుంచి భారీగా వలసలు
[ 30-04-2024]
మండలంలోని చెముడు వైకాపా ఎంపీటీసీ సభ్యుడు చింతల గోపాలకృష్ణ సోమవారం తెదేపాలో చేరారు. సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో మండల అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాలనాయుడు కండువా వేసి ఆహ్వానించారు. -
పైసాచికత్వం
[ 30-04-2024]
మే నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒకటో తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అనుబంధమన్నావు అనాధలా వదిలేశావు!
[ 30-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన సాలూరులో వేల కుటుంబాలకు జీవనాధారం ఆటోనగర్. పద్నాలుగేళ్ల కిందట దీనికి బీజం పడింది. ఇది అభివృద్ధి చేస్తే పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరడంతో పాటు కార్మికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. -
నీకు చేతులెలా వచ్చాయమ్మా?
[ 30-04-2024]
మానవత్వం మంటగలిసిపోతోంది.. కళ్లు తెరవని పసిగుడ్డును దారుణంగా చెత్తలో పడేసిన ఘటన మెంటాడ మండలంలో చోటుచేసుకుంది. ఆండ్ర గ్రామానికి వెళ్లే వంతెన కింద చెత్తలో పసికందు మృతదేహం కనిపించింది. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
[ 30-04-2024]
మండలంలోని రాజాపులోవ గ్రామానికి చెందిన వివాహిత చందక పుష్ప బలవన్మరణానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. -
రాజీనామాకు ఒక్కరోజే గడువట!
[ 30-04-2024]
వాలంటీర్లంతా మే 1 లోగా రాజీనామా సమర్పించాలని అధికార పార్టీ ఒత్తిడి చేస్తోంది. ఈమేరకు స్థానిక నాయకులు వారిని కలిసి..
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు