అన్నొస్తే.. ఇబ్బందులే
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘సిద్ధం’ సభ జరుగుతోందంటే ప్రజలకు ప్రయాణానికి పాట్లు తప్పడం లేదు.
ఉదయం 8:30 గంటల ప్రాంతంలో బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఒక్క బస్సు లేని వైనం
బొబ్బిలి, రామభద్రపురం, చీపురుపల్లి, గంట్యాడ గ్రామీణం, గజపతినగరం, రాజాం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘సిద్ధం’ సభ జరుగుతోందంటే ప్రజలకు ప్రయాణానికి పాట్లు తప్పడం లేదు. మంగళవారం విజయనగరంలోని చెల్లూరులో జరిగిన వైకాపా సిద్ధం సభకు జనాల్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను మళ్లించడంతో ఇక్కట్లు ఎదురయ్యాయి. ఉదయం 6 గంటల నుంచే బస్సులను రద్దు చేయడంతో చాలామంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఉన్న బస్సుల కోసం ప్రజలు గంటల కొద్దీ నిరీక్షించారు.
బొబ్బిలి ఆర్టీసీ డిపో నుంచి సుమారు 20కి పైగా సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు నివ్వెరపోయారు. గంటకు ఒక బస్సు కూడా లేకపోవడంతో విసిగిపోయారు. కొన్ని కారణాలతో బస్సులు రద్దు చేసినట్లు ఆర్టీసీ ఉద్యోగులు వెల్లడించారు. రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సుకు వచ్చిన ప్రయాణికులు బస్సులు లేక ఆటోలు, జీపులు, వ్యాన్లులను ఆశ్రయించారు. గజపతినగరంలో విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు. మరికొందరు ఇళ్లకు వెనుదిరిగారు. చీపురుపల్లి ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి రాజాం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు పూర్తిస్థాయిలో రాకపోకలు చేయకపోవడంతో ప్రయాణికులు వేచి ఉండాల్సి వచ్చింది. చివరికి ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయించారు. మూడు జిల్లాలకు ప్రధాన కూడలిగా ఉన్న రాజాం ఆర్టీసీ కాంప్లెక్సుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు బస్సుల్లేక ఇబ్బందులు పడ్డారు. సామాన్యులకు ఇబ్బందులు
మాది తెర్లాం. వేరే పనిమీద పక్కి గ్రామం వెళ్లేందుకు ఉదయం 7 గంటలకు వచ్చాను. 8:30 గంటలు అయినా బస్సు రాకపోవడంతో అనుమానం వచ్చి ఉద్యోగులను అడిగితే బస్సు రద్దు అయినట్లు చెప్పారు. అక్కడ వేలాడ దీసిన బోర్డును చూసి, ఆశ్చర్యపోయాను. ఆ గ్రామానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు కూడా ఉండవు. సామాన్యుల్ని ఇబ్బందిపెడుతున్నారు.
- ఎన్. రమణ, తెర్లాం
విశాఖ నుంచి వచ్చి ఆగిపోయా..
మక్కువ వెళ్లేందుకు విశాఖ నుంచి బొబ్బిలికి వచ్చాను. ఉదయం 8:30 గంటల బస్సుకు వెళ్లాలి. వైకాపా సభల పేరుతో బస్సులు రద్దు చేయడం అన్యాయం. మారుమూల ప్రాంతాలకు ప్రైవేటు వాహనాలు ఉండవు. ఇప్పుడెలా చేరుకోవాలో తెలియడం లేదు.
- ఆర్కే నారాయణ, విశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూచోడి సర్వే మాయ
[ 06-05-2024]
అన్నదాతలకు మేలు చేకూర్చేదిగా జగన్ చెబుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాయ వెనుక అసలు కథకు మూలం.. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఉద్దేశించిందన్న రీసర్వే. ఉమ్మడి జిల్లాలో 2020 డిసెంబరులో ఈ పన్నాగానికి తెరలేపారు. -
కర్కశ పాలనలో రక్కసి రోడ్లు
[ 06-05-2024]
ఎన్నికలకు ముందు దారులేస్తామని మాటిచ్చిన పాలకులు.. అధికారంలోకి రాగానే వారి జగనన్న పాలనను చూసి.. అన్నీ వదిలేశారు.. అభివృద్ధి మాటే మరిచారు. ప్రజాందోళనలతో కొన్నిచోట్ల పనులు ప్రారంభించేందుకు అధికారులు ముందుకు రాగా.. -
పునరావాసంలో జగన్మోసం
[ 06-05-2024]
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల బాగోగులు పాలకులకు పట్టడం లేదు. పుట్టినగడ్డ నుంచి పునరావాస కాలనీలకు తరలించినా.. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. -
ఆశలు అడియాసలు చేశావ్ జగనన్న
[ 06-05-2024]
ఆశా కార్యకర్తల్లో వివిధ కారణాలతో చనిపోయిన వారంతా 30 నుంచి 50 ఏళ్ల లోపు వాళ్లే. వీరిలో కొంతమందికి భర్తలు లేరు. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు, ఇంకా చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. -
పాలవలస కుటుంబానికి చుక్కెదురు!
[ 06-05-2024]
వీరఘట్టం మండలంలోని పనసనందివాడలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబానికి చుక్కెదురైంది. గత కొన్నేళ్లుగా ఆ కుటుంబానికి, వైకాపాకు ఈ గ్రామం పట్టుకొమ్మగా ఉండేది. -
ఓటెత్తిన ఉద్యోగులు
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. నాలుగు నియోజకవర్గాల్లో వివిధ హోదాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 6,818 మంది ఉద్యోగులు బ్యాలెట్లు పొందారు. -
ప్రైవేటు ఉద్యోగులకు ఎన్నికల విధులు
[ 06-05-2024]
ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నారు. పార్వతీపురం పట్టణంలో వివిధ ప్రైవేటు కళాశాలలు, ఐటీఐల్లో పనిచేస్తున్న వారు విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చారు. -
రాక్షస పాలన వారంలో ముగుస్తుంది
[ 06-05-2024]
రానున్న మరో వారం రోజుల్లో రాక్షస పాలన ముగుస్తుందని, ప్రజలంతా ఓటు అనే బలమైన ఆయుధంతో గద్దె దింపుతారని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎన్డీయే కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. -
చేనేత కార్మికులకు తెదేపాతోనే భవిత
[ 06-05-2024]
చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి అండగా ఉంటుందని రాజాం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. పట్టణానికి చెందిన చేనేత కార్మికుల నాయకుడు నల్లశ్రీను ఆధ్వర్యంలో లచ్చయ్యపేట, -
ఇండియా కూటమితోనే గిరిజనులకు న్యాయం
[ 06-05-2024]
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎంకు గిరిజన సమస్యలు తెలుసునని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారట్ పేర్కొన్నారు. -
ప్రజల ఆస్తులు కొల్లగొట్టేందుకు టైటిలింగ్ చట్టం
[ 06-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ చట్టం ముసుగులో పట్టపగలు దోపిడీకి జగన్మోహన్రెడ్డి తెరలేపారని మాజీ ఎంపీ, అరకు కూటమి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు