ఊహూనే కానీ..ఉ అనేవారు లేరు...
ఒకప్పుడు ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులంటే టెండర్లను దక్కించుకునేందుకు గుత్తేదారులు పోటీ పడేవారు. ఇప్పుడు బిల్లులు వస్తాయో రావో అనే భయంతో చాలా మంది ముందుకు రావడం లేదు. కొందరైతే చేసిన పనులకు సొమ్ము చెల్లించలేక
బిల్లులు రావని గుత్తేదారుల వెనకడుగు
జిల్లాలో రూ.212 కోట్ల మేర బకాయిలు
సంతనూతలపాడు మండలం ఎండ్లూరులో
అసంపూర్తిగా మిగిలిన గ్రామ సచివాలయ భవనం
కొత్తపట్నం, న్యూస్టుడే ఒకప్పుడు ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులంటే టెండర్లను దక్కించుకునేందుకు గుత్తేదారులు పోటీ పడేవారు. ఇప్పుడు బిల్లులు వస్తాయో రావో అనే భయంతో చాలా మంది ముందుకు రావడం లేదు. కొందరైతే చేసిన పనులకు సొమ్ము చెల్లించలేక కూలీలకు కూడా ముఖం చాటేస్తున్నారు. ఇటువంటి వారిలో ఎక్కువ మంది అధికార పార్టీ సానుభూతిపరులే ఉండటం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన గుత్తేదారుల్లోనూ చాలా మందికి బిల్లులు అందలేదు. కొత్తగా చేపట్టిన పనుల్లోనూ అదే పరిస్థితి.
టెంకాయలు కొట్టి ప్రారంభించినప్పటికీ...
గ్రామ సచివాలయాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధాన నిధులను రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించింది. వీటి పురోగతిపై రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్ఢి. జిల్లా స్థాయిలో కలెక్టర్ సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు కావడంతో రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల నుంచి జిల్లా, మండల అధికార యంత్రాంగంపై ఒత్తిడి ఉంటోంది. వీటిని త్వరితగతిన పూర్తిచేసేలా గతేడాది జూన్లో ‘భవన నిర్మాణ పక్షోత్సవాలు’ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. క్షేత్రస్థాయిలో టెంకాయ కొట్టి పనులు ప్రారంభించినప్పటికీ.. పురోగతి ఆశించిన మేర లేకపోయింది.
మొత్తం రూ. 289 కోట్ల మేర పనులు...
అన్ని భవన నిర్మాణ పనులను విడతల వారీగా 2020 జనవరి నెల నుంచే ప్రారంభించారు. బిల్లుల చెల్లింపులో నెలల తరబడి జాప్యం చోటుచేసుకోవడంతో గుత్తేదారులు పనులు ఆపేశారు. జూన్లో పక్షోత్సవాలు నిర్వహించి అప్పటి వరకు ఉన్న బకాయిల్లో కొంత చెల్లించారు. హెల్త్ క్లినిక్ భవనాలకు మాత్రం డిసెంబర్లో జమ చేయగా, మిగతా వాటికి ఇంతవరకు లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.289 కోట్ల మేర పనులు చేపట్టగా.. అందులో రూ.212 కోట్ల మేర బిల్లులు బకాయిలున్నాయి. సకాలంలో బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు కూడా త్వరగా పనులు పూర్తి చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పనులు నత్తనడకన సాగుతుండగా; మరికొన్ని చోట్ల పలు దశల్లో నిలిచిపోయాయి. ఇసుక అందుబాటులో లేక కూడా నిలిచిపోయినవి ఉన్నాయి.
సింగరాయకొండ గ్రామ పంచాయతీలో అసంపూర్తిగా
ఆగిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణం
మూడు కేటగిరీలుగా విభజించి...
జిల్లా వ్యాప్తంగా 1046 గ్రామ పంచాయతీలుండగా.. జనాభా ప్రాతిపదికన 879 గ్రామ సచివాలయాలుగా విభజించారు. వీటిలో సొంత భవనం లేని.. శిథిలావస్థకు చేరిన చోట్ల కొత్తగా నిర్మించేందుకు మొదటి కేటగిరీలో రూ.40 లక్షలు మంజూరు చేశారు. రెండో కేటగిరీ కింద ప్రస్తుత భవనం పైన మరొకటి నిర్మిస్తారు. అందుకు రూ.25 లక్షలు అంచనా వేశారు. మూడో కేటగిరీగా ప్రస్తుత భవనాన్ని విస్తరించేందుకు రూ.35 లక్షల నిధులు మంజూరు చేశారు. రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మించాలనీ నిర్ణయించారు. ఈ పనులన్నీ 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే శ్రీకారం చుట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!