నిలిచిన సాయం... ప్రాణాలకు గండం
రాష్ట్రంలో కిడ్నీ వ్యాధి బాధితులు అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రకాశం ఒకటి. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్ సాయంతో వందల మంది బాధితులు జిల్లాలోని వివిధ వైద్యశాలల్లోని డయాలసిస్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం కొంతమందికి పింఛన్లు నిలిచిపోవడంతో ప్రాణాలు కాపాడుకొనేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. రవాణా,
డయాలసిస్ రోగులకు అందని పింఛన్లు
కనిగిరి కేంద్రంలో రోగులు
కనిగిరి, న్యూస్టుడే: రాష్ట్రంలో కిడ్నీ వ్యాధి బాధితులు అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రకాశం ఒకటి. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్ సాయంతో వందల మంది బాధితులు జిల్లాలోని వివిధ వైద్యశాలల్లోని డయాలసిస్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం కొంతమందికి పింఛన్లు నిలిచిపోవడంతో ప్రాణాలు కాపాడుకొనేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. రవాణా, ఆహార పదార్థాల ధరలు సైతం పెరిగిపోవడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
10 శాతం మందికి...
జిల్లాలో డయాలసిస్ పేషెంట్లు మొత్తం 475 మంది ఉన్నారు. చీరాల కేంద్రంలో 70, కనిగిరిలో 120, కందుకూరులో 90, మార్కాపురంలో 65, ఒంగోలు రిమ్స్లో 110, సంఘమిత్ర ఆసుపత్రిలో 20 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒక్క కనిగిరి ప్రాంతంలోనే 15 మందికి పింఛను నిలిచిపోయి అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో కలిపి సుమారు 50 మంది వరకు పింఛను నగదు కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో కొందరు వారానికి రెండుసార్లు, మరి కొందరు వ΄డుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్న వారు ఉన్నారు.
పల్లెల్లోనే బాధితులు అధికం...
కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న రోగులు గ్రామాల్లోనే అధికంగా ఉన్నారు. వీరంతా వారానికి రెండు, వ΄డు సార్లు సమీపంలోని కేంద్రాలకు వచ్చి చికిత్సలు చేయించుకోవాలి. ప్రభుత్వం రూ.10 వేలు నగదును పింఛనుగా అందిస్తున్నప్పటికీ మందులు, వైద్యం, ఆహార పదార్థాలు ఇలా అన్ని రకాల ఖర్చులు పెరిగిపోవడంతో ఆ నగదు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. కనిగిరి, కందుకూరు డయాలసిస్ కేంద్రాలకు చుట్టు పక్కల ప్రాంతాల రోగులే కాకుండా నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు, పెదరాజుపాలెం, కొండాపురం, ఉదయగిరి, వింజమూరు, కలిగిరి, మర్రిపాడు తదితర మండలాల నుంచి కూడా రోగులు వస్తున్నారు. బస్సు సౌకర్యం లేక చాలా మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి రెట్టింపు సొమ్ము చెల్లించి ప్రయాణిస్తున్నారు.
పది నెలలుగా ఎదురుచూస్తున్నా
మాది వెలిగండ్ల మండలం రంగన్నపల్లి. నేను వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాలి. మాది నిరుపేద కుటుంబం. నేను పింఛను కోసం 10 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా. ఇంతవరకు మంజూరు కాలేదు. ఆసుపత్రికి, కార్యాలయానికి తిరగడానికి ప్రతిసారి రవాణా ఖర్చులు రూ.500 అవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. - ఎం.కుమారి, రంగనపల్లి
రవాణా ఖర్చులూ భరించలేకున్నా
మాది కనిగిరి మండలం వాగుపల్లి. గత ఏడాది జూన్లో దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికీ మంజూరు కాలేదు. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాలి. రవాణా ఖర్చులూ భరించలేని పరిస్థితి మాది. దీనికితోడు ఉన్న డబ్బులన్నీ బలవర్థకమైన తిండి, మందుల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. అధికారులు స్పందించి మా బాధలు తీర్చాలి. - ముప్పూరి వెంకటేశ్వర్లు, వాగుపల్లి
మంజూరుకు కృషి చేస్తా
కనిగిరి డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ రోగులకు పింఛను రావడం లేదని ఇప్పుడే తెలుసుకున్నాను. కనిగిరితో పాటు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వారికి ఎక్కడెక్కడ పింఛన్లు మంజూరు కాలేదో తెలుసుకుని వారికి అందేలా చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాస్, డయాలసిస్ కేంద్రాల జిల్లా మేనేజర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.