Andhra News: ‘వాలంటీర్లు... దుస్తులూ ఉతికించుకుంటున్నారు’
‘ప్రభుత్వ పథకాలు, సేవల కోసం వచ్చిన వారితో కొందరు వాలంటీర్లు తమ ఇళ్లలో పనులు చేయించుకుంటున్నారు. చివరికి దుస్తులు కూడా ఉతికించుకుంటున్నారు’ అని వైకాపా కొండపి నియోజకవర్గ కన్వీనర్ వరికూటి అశోక్బాబు అన్నారు. గడప గడపకు మన
సమావేశంలో మాట్లాడుతున్న వైకాపా కొండపి నియోజకవర్గ కన్వీనర్ అశోక్బాబు.. వేదికపై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస విశ్వనాథ్, నాయకులు
టంగుటూరు(ప్రకాశం), న్యూస్టుడే: ‘ప్రభుత్వ పథకాలు, సేవల కోసం వచ్చిన వారితో కొందరు వాలంటీర్లు తమ ఇళ్లలో పనులు చేయించుకుంటున్నారు. చివరికి దుస్తులు కూడా ఉతికించుకుంటున్నారు’ అని వైకాపా కొండపి నియోజకవర్గ కన్వీనర్ వరికూటి అశోక్బాబు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో టంగుటూరు మండల పరిషత్తు కార్యాలయంలో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్బాబు హాజరై మాట్లాడారు. ప్రజలు తమకు అవసరమైన ప్రభుత్వ పనులు చేయించుకునేందుకు నాయకుల ఇళ్లకు వెళ్లడం మాని వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కొందరు వాలంటీర్లు తమ ఇళ్లలోని దుస్తులను కూడా ప్రజలతో ఉతికించుకుంటున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. గడప గడపకు కార్యక్రమానికి నాయకులు కేవలం వారధులు మాత్రమేనని.. ప్రజలు అడిగిన ప్రశ్నలకు వాలంటీర్లే సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని చెప్పారు. సమీక్షా సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి పర్యవేక్షణ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ టి.శ్రీనివాస విశ్వనాథ్, వైకాపా మండల కన్వీనర్ సూదనగుంట హరిబాబు, కొండపి ఏఎంసీ ఉపాధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, పలు మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
[ 05-05-2024]
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్ యాక్ట్-2022)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
కూటమిదే పక్కా విజయం
[ 05-05-2024]
‘సభకు వచ్చిన జనం చూపుతున్న ఉత్సాహం.. యువత, మహిళల కేరింతలు చూస్తుంటే దర్శిలో మన విజయం పక్కా అని తేలిపోయింది. ఈ సారి కచ్చితంగా తెదేపా జెండా ఎగరేస్తాం. -
పోలింగ్కు ఇదేం సన్నద్ధత!
[ 05-05-2024]
తపాలా ఓటింగ్ మొదటి రోజైన శనివారం జిల్లాలో పలు చోట్ల అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించారు. ఒంగోలు డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలోని సగం కేంద్రాల్లో గెజిటెడ్ అధికారులు అందుబాటులో లేరు. -
జగన్ రాసిన మరణ శాసనం
[ 05-05-2024]
అయిదేళ్ల క్రితం వచ్చిన ఆ పాద యాత్రికుడు అక్కడి వారిపై అమృతం కురిపించారు..జీవచ్ఛవాల్లా ఉన్న కనిగిరివాసులకు ఊరడించారు..ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొడతానన్నారు. -
11న ఒంగోలుకు చంద్రబాబు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు రానున్నారు. -
తెదేపా గూటికి వైకాపా సర్పంచి
[ 05-05-2024]
పొన్నలూరు మండలంలో సైకిల్ జోరు మీదుంది. మండలంలోని కె.అగ్రహారం గ్రామ సర్పంచి షేక్ చిన్న మస్తాన్ శుక్రవారం రాత్రి దామచర్ల సత్య సమక్షంలో తెదేపాలో చేరారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
కొత్తపట్నంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొత్తపట్నం మండలం రెడ్డిపాలెం, కె.పల్లెపాలెం, ఈతముక్కలలోని పోలింగ్ కేంద్రాలను శనివారం జిల్లా పోలీసు పరిశీలకులు హసిబ్ ఉర్ రెహమాన్ పరిశీలించారు. -
చట్టం ముసుగులో దోపిడీకి జగన్ కుట్ర
[ 05-05-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంతో పాటు జిల్లాలోని మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో రైతులకు చెందిన భూములు, పట్టా భూములను పట్టపగలే ఆక్రమణ చేసుకోని కబ్జా చేస్తున్న, చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్