మహానాడుపై మనదైన ముద్ర
ఒంగోలు సమీప మండువవారిపాలెంలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడుపై గురువారం జిల్లా తెదేపా కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లకు సంబంధించి ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులతో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల
సమీక్షలో దామచర్ల
సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఒంగోలు సమీప మండువవారిపాలెంలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడుపై గురువారం జిల్లా తెదేపా కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లకు సంబంధించి ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులతో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మాట్లాడారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఒంగోలులో మహానాడు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. నగర అలంకరణపై ప్రత్యేక సూచనలు చేశారు. భోజన వసతి, ఇతర సదుపాయాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలన్నారు. నిర్వహణలో మనదైన ముద్ర వేద్దామన్నారు. మహానాడు కార్యక్రమానికి ఇప్పటికే వివిధ కమిటీలను నియమించారు. సజావుగా నిర్వహించేలా నియోజకవర్గ ముఖ్య నాయకులను అనుబంధ కమిటీలో చేర్చారు. సమావేశంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు వైవీ.సుబ్బారావు, బండారు మదన్, కొఠారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
* మండువవారిపాలెం వద్ద మహానాడుకు భూమి పూజ చేసిన స్థలంలో ప్రస్తుతం చదును చేసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. తొమ్మిది డ్రోజర్లతో గురువారం పనులు ఆరంభించారు. వేదిక, గ్యాలరీ ఏర్పాటుకు శుక్రవారం కొలతలు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
ఒంగోలులో గదుల్లేవు
ఒంగోలు ట్రంకురోడ్డు, ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: మహానాడు నేపథ్యంలో ఈనెల 27, 28 తేదీల్లో లాడ్జిలు, హోటళ్లతో పాటు ప్రైవేటు అతిథిగృహాలకు డిమాండ్ పెరిగింది. కార్యక్రమానికి హాజరయ్యే పలువురు తెదేపా నాయకులు గదుల కోసం ఆరా తీశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి గిరాకీ ఏర్పడింది. పరిస్థితిని ముందే ఊహించిన హోటళ్ల నిర్వాహకులు భారీగా ధరలు పెంచేశారు. పార్టీ నాయకులకు వసతి కల్పన నిమిత్తం పలు ప్రాంతాల్లోని లాడ్జిలు, కల్యాణ మండపాలను స్థానిక నాయకులు రిజర్వు చేశారు.
ఇతర ప్రాంతాల్లోనూ బసకు ఏర్పాట్లు
27న ప్రతినిధుల సభ జరగనుంది. ఆ రోజు హాజరైనవారు తర్వాతి రోజు మహానాడుకు వచ్చేందుకు వీలుగా లాడ్జీలలో గదులను కేటాయించేలా ప్రతిపాదించారు. కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వచ్చే వారితోపాటు.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, కీలక నాయకులు 27వ తేదీ రాత్రి ఒంగోలులోనే ఉంటారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మహానాడు వేదిక పక్కనే ఉన్న బృందావన కల్యాణ మండపంలో బస చేసేందుకు వీలుగా ప్రణాళిక చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లా ప్రతినిధులకు గుంటూరులో.... తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు విజయవాడలో... కడప, చిత్తూరు ప్రాంత వాసులకు నెల్లూరులో గదులు కేటాయించేందుకు ఏర్పాట్లుచేసినట్లు నేతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం