logo

అపహరించి...ఆపై హత్య..!

అదృశ్యమైన మహిళ హత్యకు గురైన ఘటన త్రిపురాంతకం మండలంలోని డీవీఎన్‌ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలియజేసిన సమాచారం మేరకు డీవీఎన్‌ కాలనీకి చెందిన అంకమ్మ(50) భర్త చనిపోవడంతో

Published : 09 Aug 2022 01:43 IST

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: అదృశ్యమైన మహిళ హత్యకు గురైన ఘటన త్రిపురాంతకం మండలంలోని డీవీఎన్‌ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలియజేసిన సమాచారం మేరకు డీవీఎన్‌ కాలనీకి చెందిన అంకమ్మ(50) భర్త చనిపోవడంతో అప్పటి నుంచి అదే గ్రామంలో ఒంటరిగా నివసిస్తోంది.  40 రోజుల క్రితం నుంచి కనిపించకపోవడంతో ఆమె బంధువులు త్రిపురాంతకం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత నెల 11న కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఆమెను అపహరించి హత్య చేసినట్టు నిర్ధారించుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు హత్య చేసిన ప్రాంతాన్ని కనుగొన్నారు. సోమవారం తెల్లవారుజామున  డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి సిబ్బంది తో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీఐ రాంబాబు, ఎస్సై వెంకట సైదులు, తహసీల్దారు కిరణ్‌ సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. నిందితులు విలాసాలకు అలవాటు పడి డబ్బు కోసం బంధువైన అంకమ్మను హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంఘటన స్థలంలో ఉన్న గ్రామస్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని