సందర్శకులూ.. సౌకర్యాలు అడగొద్దు
సువిశాల తీర ప్రాంతం.. చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయాలు, కట్టడాలు.. అద్భుతమైన ప్రకృతి వనరులు జిల్లా సొంతం. కానీ పర్యాటకంగా అభివృద్ధి ఎక్కడా కానరావడంలేదు. ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు, సందర్శకులకు వసతులు కల్పించేందుకు ప్రతిపాదనలైతే వెళ్తున్నాయి తప్ప నిధులు రావడంలేదు. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు పరిశీలిస్తే..
కాగితాల్లోనే పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
- న్యూస్టుడే, ఒంగోలు గ్రామీణం
కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతం
సువిశాల తీర ప్రాంతం.. చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయాలు, కట్టడాలు.. అద్భుతమైన ప్రకృతి వనరులు జిల్లా సొంతం. కానీ పర్యాటకంగా అభివృద్ధి ఎక్కడా కానరావడంలేదు. ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు, సందర్శకులకు వసతులు కల్పించేందుకు ప్రతిపాదనలైతే వెళ్తున్నాయి తప్ప నిధులు రావడంలేదు. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు పరిశీలిస్తే..
పునర్విభజనలో 50 కి.మీ తీర ప్రాంతం బాపట్ల, నెల్లూరు జిల్లాలకు వెళ్లింది. ప్రస్తుత ప్రకాశంలో కొత్తపట్నం, సింగరాయకొండ మండలం పాకల బీచ్లు మిగిలాయి. ఆదివారం వస్తే ఈ రెండుచోట్ల కోలాహలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా విశ్రాంత గదులు, వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేవు. సముద్ర స్నానం అనంతరం దుస్తులు మార్చుకోవాలన్నా సమస్యగా మారింది. వారాంతాల్లో ఒంగోలు నగరానికి చెందిన ఉద్యోగులు, వ్యాపారస్తులు కుటుంబాలతో కలిసి కొత్తపట్నం బీచ్కు అధిక సంఖ్యలో వస్తుంటారు. కనిగిరి, కొండపి, కందుకూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలవారు పాకల తీరానికి వెళ్తుంటారు. పాకలలో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు రూ.4 కోట్ల మేర నిధులు మంజూరు చేయగా, తొలివిడత రూ.2 కోట్లతో పనులు చేపట్టారు. బీచ్కు వాహనాలతో చేరుకునేందుకు సిమెంట్లు రోడ్లు వేశారు. తీరం సమీపంలో వసతి కోసం భవనం నిర్మించారు. స్లాబ్ వేశారు తప్ప గదులు కట్టలేదు. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది. మిగతా నిధులు ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేయలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉండేందుకు ఎటువంటి కాటేజీలు లేక ఆదరాబాదరాగా తిరుగుముఖం పట్టాల్సి వస్తోంది.
బైరవకోన..పదే పదే ప్రతిపాదనలు
సీఎస్పురం మండలం బైరవకోనలో త్రిముఖ దుర్గాంబదేవి కొలువై ఉన్నారు. చోళుల కాలంలోనే ఒకే రాయిపై అమ్మవారి విగ్రహం చుట్టూ 8 గుళ్లు నిర్మించారు. పక్కనే జలపాతం ఉంది. శేషాచలం కొండలపై నుంచి వర్షాకాలంలో నిరంతరం నీళ్లు పడుతూనే ఉంటాయి. కార్తీక మాసంలో వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇతర సమయాల్లోనూ సందర్శకుల సంఖ్య అధికమే. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ ఉన్నా నెరవేరడం లేదు. పార్కులు, సందర్శకులకు విశ్రాంతి గదులు, అతిథిగృహం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు వెళ్లాయి. గతంలో కొన్నింటికి నిధులు మంజూరైనా ప్రారంభించకపోవడంతో రద్దు చేశారు. మరికొన్ని నిర్మాణాలు మధ్యలోనే ఆగాయి. తాజాగా కలెక్టరేట్ నుంచి మరోసారి ప్రతిపాదనలు పంపారు.
సీఎస్పురం మండలం బైరవకోనలోని జలపాతం వద్ద సందడి
గుండ్లకమ్మ.. పురోగతి లేక
ఒంగోలు నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో గుండ్లకమ్మ జలాశయం ఉంది. ఆదివారంతోపాటు, ఇతర సెలవు దినాల్లో కుటుంబాలతో సహా అనేకమంది వెళ్తుంటారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2009లో బోటింగ్ ఏర్పాటు చేశారు. మరింత అభివృద్ధి చేసేందుకు అక్కడ రోప్ వే, రిసార్టుల నిర్మాణం నిమిత్తం పూర్వ కలెక్టర్ పోలా భాస్కర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇంతవరకు పురోగతి లేదు. నిధులు మంజూరు చేసి పనులు పూర్తిచేస్తే ఈ ప్రాజెక్ట్ పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ్ర పాత సింగరాయకొండ, మాలకొండ లక్ష్మీనరసింహాస్వామి; త్రిపురాంతకం అమ్మవారి దేవస్థానం, దొనకొండ బౌద్ధారామాలు పర్యాటకపరంగా కూడా ఆకట్టుకుంటాయి. వీటి వద్ద అభివృద్ధి పనుల గురించి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!