పెళ్లి సందడికి వేళాయె!
మాఘ మాసం రాకతో జిల్లాలో పెళ్లి సందడి ఆరంభమైంది. ఈనెల 26 నుంచి మార్చి 17 వరకు ముహూర్తాలు ఉన్నాయని పండితులు పేర్కొనడంతో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రేపటి నుంచి మార్చి 17 వరకు ముహూర్తాలు
జిల్లాలో రెండు వేల వివాహాలకు ఏర్పాట్లు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే:
మాఘ మాసం రాకతో జిల్లాలో పెళ్లి సందడి ఆరంభమైంది. ఈనెల 26 నుంచి మార్చి 17 వరకు ముహూర్తాలు ఉన్నాయని పండితులు పేర్కొనడంతో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 2 వేల వరకు వివాహాలు జరగనున్నట్లు అంచనా. వాటితోపాటు, గృహా ప్రవేశాలు, భూమి పూజ, నిశ్చయ తాంబులాలు వంటి శుభకార్యాలు జరగనున్నాయి. నెలన్నరపాటు ఎటుచూసినా పందిళ్లు...సందళ్లు... కల్యాణ మండపాలు మొదలు వివిధ రంగాలకు డిమాండ్ ఏర్పడింది. తద్వారా బడ్జెట్ 30 నుంచి 50 శాతం వరకు పెరగనుంది.
అనుబంధ రంగాలకు ఉపాధి
పెళ్లంటే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి. పురోహితులు, వంటల తయారీదారులు, షామియానా సమకూర్చేవారు, ఫొటోగ్రాఫర్లు, లైటింగ్, పూల అలంకరణ చేసేవారు, మంగళ వాయిద్యాలు, దర్జీలు, ఆభరణాల తయారీదారులు, ఐస్క్రీం పార్లర్లు, కూరగాయల సరఫరాదారులకు ప్రస్తుత సీజన్లో డిమాండ్ పెరిగింది. గతంతో పోలిస్తే అన్ని ధరలూ పెరిగిపోయాయి. జిల్లాలో సుమారు 150 కల్యాణ మండపాలు ఉండగా; ఒంగోలులోనే 36 కనిపిస్తాయి. ఎక్కువమంది లీజుదారులు కావడంతో కొవిడ్ సమయంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునే క్రమంలో నిర్వాహకులు ఒక్కటై ఛార్జీలు పెంచారు. శుభకార్యం చేసేవారి ఆర్థిక స్థోమతను బట్టి మండపాన్ని పూల అలంకరణ చేయిస్తారు. తద్వారా ఒక్కో పెళ్లి నిర్వహణకు కల్యాణ మండపానికే రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతోంది.
ఏయే తేదీల్లో అంటే..
గత ఏడాది డిసెంబర్ 2 నుంచి 18వ తేదీ వరకు పరిమిత ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు తక్కువగానే జరిగాయి.... డిసెంబర్ 24 నుంచి ఇప్పటివరకు ఎక్కడా కార్యక్రమాలు జరగలేదు. ఈ నెల 26, 27, 28 తేదీలు.. ఫిబ్రవరి 1, 8, 9, 10, 11, 12, 15, 16, 23, 24.. మార్చి 1, 5, 8, 9, 10, 11, 13, 15, 17 తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో అంతటా సందడి కనిపిస్తుంది. ఒక్క ఒంగోలు నగరంలోనే సుమారు 1,000 పెళ్లిళ్లు జరగనున్నాయి. కొన్ని తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కల్యాణ మండపాలు ఖాళీ లేకపోవడంతో బంధువర్గం ప్రత్యామ్నాయ ప్రాంతాలు లేదా స్వగ్రామాల్లోనే ఏర్పాటు చేసుకునేలా ప్రణాళిక చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్