ఏదీ! మునుపటి కళ
గ్రానైట్ పరిశ్రమ నుంచి అధిక మొత్తంలో ఖజానాకు ఆదాయం తీసుకురావాలన్న ధ్యాస తప్ప వ్యాపారాన్ని పెంచే మార్గాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నానాటికీ పడిపోతున్న గ్రానైట్ ఎగుమతులు
క్వారీల్లో పేరుకుపోతున్న ముడిరాళ్లు
ఈనాడు డిజిటల్, ఒంగోలు: గ్రానైట్ పరిశ్రమ నుంచి అధిక మొత్తంలో ఖజానాకు ఆదాయం తీసుకురావాలన్న ధ్యాస తప్ప వ్యాపారాన్ని పెంచే మార్గాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో క్వారీయింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు విదేశాలకు ఎగుమతులు పెరుగుతూ వచ్చాయి. 2020 వరకు ఇక్కడ ఉత్పత్తయ్యే రాయిలో 75 శాతం ఎగుమతి అవుతూ వచ్చింది. కొవిడ్, అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతులు తగ్గుతూ వచ్చాయి. ప్రత్యామ్నాయం చూడాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోగా అదనపు ఆదాయం కోసం పాకులాడటం, అధికారపార్టీ నాయకుల పెత్తనం ఎక్కువ కావడంతో వ్యాపారులు సతమతమవుతున్నారు.
రూ.245 కోట్ల వ్యాపారమే..
కొవిడ్కు ముందునాటి స్థాయికి చేరుకోవడానికి గ్రానైట్ పరిశ్రమ ఆపసోపాలు పడుతోంది. క్వారీల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ చైనాకు ఎగుమతులు నిలిచిపోవడం, ప్రత్యామ్నాయం లేకపోవడం, కంటైనర్ల కొరత, సముద్ర రవాణా ఛార్జీల పెంపు వంటివి ప్రభావం చూపుతున్నాయి. 2022-23లో రూ.450 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినా జనవరి వరకు రూ.245 కోట్లు మాత్రమే వచ్చింది. మార్చి చివరిలోపు మిగిలిన ఆదాయం రావాల్సి ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేవు.
ఉమ్మడి జిల్లాలో 500 లీజులు
చీమకుర్తి ప్రాంతంలో గెలాక్సీ గ్రానైట్.. కనిగిరి, గురిజేపల్లి ప్రాంతాల్లోని బ్లాక్పెరల్, బల్లికురవ వద్ద స్టీల్గ్రే గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. వీటి పరిధిలో 105 క్వారీలు, అందులో 500 వరకు లీజులు ఉన్నాయి. వెలికితీసిన ముడిరాయిలో దాదాపు 75 శాతం విదేశాలకు వెళుతుంది. అందులో సింహభాగం చైనాకే. మిగిలిన 25 శాతం స్థానికంగా ఉన్న కటింగ్, పాలీషింగ్ యూనిట్లకు వెళ్లేది. గత రెండేళ్లుగా కొవిడ్తో స్థానిక పరిశ్రమలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఇదే సమయంలో గోరుచుట్టుపై రోకలిపోటులా చైనాకు ఎగుమతులు నిలిచాయి. సముద్ర రవాణా ఛార్జీలు పెరగడం, ఆశించిన మేరకు విదేశీ ఆర్డర్లు రాకపోవడంతో క్వారీలో పెద్దమొత్తంలో రాయి నిలిచిపోయింది. సాధారణంగా వ్యాపారం బాగుంటే ప్రభుత్వానికి రాయల్టీతోపాటు ఇంధన, విద్యుత్తు, జీఎస్టీ, ఆదాయపన్ను తదితర రూపాల్లో సొమ్ము సమకూరుతుంది. ప్రస్తుతం విదేశాల నుంచి ఆశించిన మేర ఆర్డర్లు రాకపోయినా దేశీయంగా, యూనిట్లు, పరిశ్రమలు వచ్చి రాయి తీసుకెళుతుండటంతో కొంతమేరకు వ్యాపారం జరుగుతోంది.
కలవరపెడుతున్న చైనా పరిస్థితులు
2020 తర్వాత కొవిడ్ పరిస్థితులతో చైనాలో గ్రానైట్ వ్యాపారం దెబ్బతింది. దీంతో జిల్లాలో ఆర్డర్లు ఇచ్చిన విదేశీ కొనుగోలుదారులు యికి మార్కింగ్ చేస్తున్నప్పటికీ చెల్లింపులు చేయడంలేదు. పైగా చైనా నుంచి కంటైనర్లు మునుపటిలా రావడం లేదు. కనీసం జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, మలేషియా, అమెరికా వంటి దేశాలకు నేరుగా వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు చేయకపోవడంతో జిల్లాలోని క్వారీల్లో ముడిరాయి పేరుకుపోయిందని యజమానులు వాపోతున్నారు. ఇలా దాదాపు 20 వేల క్యూబిక్ మీటర్ల వరకు నిల్వ ఉన్నట్లు అంచనా. జిల్లా గనులశాఖకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ గ్రానైట్ వ్యాపారం సగానికి సగం తగ్గినమాట వాస్తవమేనన్నారు. మార్చిలో విదేశీ ఎగుమతులు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!