ప్రాథమిక స్థాయి నుంచి శ్రమిస్తే భవిత
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచే శ్రమిస్తే బంగారు భవిత సొంతమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ హితవు పలికారు.
కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, తదితరులు
జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచే శ్రమిస్తే బంగారు భవిత సొంతమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ హితవు పలికారు. నగరంలోని శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో శక్తి సామర్థ్యాలుంటాయని, వాటిని వెలికితీయడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. ‘ఈనాడు’ సంస్థ పాఠశాల స్థాయి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. పుస్తకాలు చదవడం వ్యాపకంగా పెట్టుకోవాలని సూచించారు. హర్షిణి కళాశాల ఛైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ పాఠశాల, రీజనల్, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం వల్ల ఎంతోమంది విద్యార్థులకు మేలు జరిగిందన్నారు. ‘ఈనాడు’ యూనిట్ ఇన్ఛార్జి ఎంఏ ఖాన్ మాట్లాడుతూ కేవలం వార్తలకే పరిమితం కాకుండా ఇలా అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించడానికి సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
నాలుగు నెలల్లో ...20,519 మంది
నాలుగు నెలలుగా వివిధ స్థాయిల్లో ‘ఈనాడు’ ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. మొత్తం 20,519 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రెండో దశ రీజినల్ స్థాయిలో 560 మంది, మూడో దశ జిల్లాస్థాయిలో 72 మందికిగాను 59 మంది పాల్గొన్నారు. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, దర్శి, సింగరాయకొండ, మార్కాపురంలో రీజినల్ స్థాయి పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, కథల సమర్పణ, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు జరిపారు. త్వరలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో బహుమతులు సాధించిన వారు రాష్ట్రస్థాయికి అర్హత పొందారు. పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. న్యాయ నిర్ణేతలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, తదితరులు
పోటీల్లో విజేతలు వీరే...
డ్రాయింగ్: కనిగిరి మండలం కంచవారిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి జి.శ్రీవాణి ప్రథమ, సింగరాయకొండ శ్రీవిద్యానికేతన్ పదో తరగతి విద్యార్థి సీహెచ్ ఆర్తిశ్రీ ద్వితీయ, ఒంగోలు జ్యూపిటర్ స్కూలు 9వ తరగతి విద్యార్థి వి.భువనేశ్వరి తృతీయ స్థానాలు సాధించారు.
వ్యాసరచన: దర్శి శ్రీచైతన్య స్కూలు 9వ తరగతి విద్యార్థి ఎం.బేబి నివేదిత ప్రథమ, కంభం వాసవి స్కూలు 9వ తరగతి విద్యార్థి ఎం.ప్రవీణ ద్వితీయ, దర్శి మండలం పొతకమూరు జడ్పీ స్కూలు 9వ తరగతి విద్యార్థి జి.సుకన్య తృతీయ బహుమతిని గెల్చుకున్నారు.
కథన సమర్పణ: స్టోరీ టెల్లింగ్ విభాగంలో మార్కాపురం జడ్పీ స్కూలు ఎనిమిదో తరగతి విద్యార్థి వైవీటీ చంద్రిక ప్రథమ, ఒంగోలు కేరళ హైస్కూలు పదో తరగతి విద్యార్థి పి.శ్రావ్య ద్వితీయ, సింగరాయకొండ సెయింట్ జాన్స్ హైస్కూలు పదో తరగతి విద్యార్థి డి.దివ్యవాణి తృతీయ స్థానాల్లో నిలిచారు.
క్విజ్: సింగరాయకొండ శ్రీవిద్యానికేతన్ 8వ తరగతి విద్యార్థి ఎం.దత్తసాయి ప్రథమ, సింగరాయకొండ గీతం హైస్కూలు పదో తరగతి విద్యార్థి ఎస్కే హష్మి ద్వితీయ, నగరంలోని ఒంగోలు పబ్లిక్ స్కూలు 8వ తరగతి విద్యార్థి ఎం.జ్యోస్యశ్రీ తృతీయ బహుమతి గెలుచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!