వెంచర్ కోసం అధికారిక విధ్వంసం
ఒంగోలు నగరం వెంగముక్కపాలెంలో అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడు వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్కు లక్షలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్ను అక్రమంగా తరలించారని తెదేపా నాయకులు ధ్వజమెత్తారు.
బాధ్యులపై చర్యలు కోరుతూ ఆందోళన
కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న తెదేపా నాయకులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఒంగోలు నగరం వెంగముక్కపాలెంలో అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడు వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్కు లక్షలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్ను అక్రమంగా తరలించారని తెదేపా నాయకులు ధ్వజమెత్తారు. ఇందుకోసం ఒంగోలు మండలం యరజర్ల, సర్వేరెడ్డిపాలెం; టంగుటూరు మండలం కందులూరు, మర్లపాడు, కొణిజేడు గ్రామాల మధ్య ఉన్న కొండను పిండి చేశారని విమర్శించారు. వెంటనే వెంచర్ నిర్వాహకులతో పాటు, వారికి సహకరించిన గనుల, రెవెన్యూ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. కోట్లాది రూపాయల విలువ చేసే గ్రావెల్ తోలుకుని... కేవలం రూ.12 లక్షలు మాత్రమే ప్రభుత్వానికి చెల్లించారని ఆరోపించారు.
అడ్డగోలుగా బోర్లు, పైపులైన్లు...
యరజర్ల చెరువు దగ్గరలో భూములు కొనుగోలు చేసి, ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ బోర్లు వేశారని... అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా వెంచర్లో నిర్మాణాలకు నీటిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లోకి చొరబడి పైపులైన్లు వేశారన్నారు. దీనివల్ల యరజర్ల, పరిసర ప్రాంతాల్లో తాగు, సాగు నీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ఆ బోర్లను ఆపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ‘ఈనాడు’లో వచ్చిన కథనాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ... స్పందనలో డీఆర్వో శ్రీలతకు వినతిపత్రం అందజేశారు. తెదేపా నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నాయకులు నలమోతు గంగాధర్, చుండి శ్యామ్, బండారు మదన్, పోలవరపు వెంకటరామయ్య, గుండపనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం