నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది.
అయిదేళ్లలో తల్లకిందులైన చిత్రం
ఉపాధి లేక ఊళ్లొదిలిన అభాగ్యులు
నీటి మూటల్లా జగన్ హామీలు
న్యూస్టుడే, కనిగిరి : ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. తదనంతరం జగన్ అధికార పీఠమెక్కాక రాయితీలకు మంగళం పాడటం.. గిట్టుబాటు ధరలు కన్పించకపోవడంతో రైతన్నలు కాస్తా కూలీల్లా మారారు. ఊళ్లో ఉండలేక ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు ప్రధానంగా కనిగిరి, దర్శి ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యాయి. పిల్లలు, వృద్ధులను ఇళ్ల వద్ద పెట్టి వలసపోయారు. బిడ్డలు వదిలేయడంతో మాతృమూర్తులు దీనంగా రోదిస్తున్నారు.
మాచవరంలో కొడుకులు, కోడళ్లు ఊరొదిలి వెళ్లడంతో ఒంటరిగా వృద్ధులు
ముందుకు కదలని నిమ్జ్...: గత అయిదేళ్లుగా ప్రభుత్వ విధానాలతో రైతన్నకు దిక్కుతోచడం లేదు. గత్యంతరం లేక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ముంబయి, పుణె, ఢిల్లీ, మధ్యప్రదేశ్, చివరకు అండమాన్కు సైతం వెళ్లి బేల్దారి పనులు చేసుకుని పొట్ట పోషించుకుంటున్నారు. గ్రామంలో హుందాగా బతికిన వీరంతా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ..హోటళ్లలో సర్వర్లు, టీ బడ్డీలు నిర్వహిస్తూ దయనీయంగా బతుకులీడిస్తున్నారు. ఇలా పశ్చిమ ప్రకాశంలో లక్ష కుటుంబాలు వలస బాట పట్టాయి. గత అయిదేళ్లలో లక్షలాదిమందికి ఉపాధి కల్పించే నిమ్జ్ వైపు పాలకులు కన్నెత్తి చూడలేదు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. బత్తాయి రసం ఫ్యాక్టరీ, చిన్న తరహా పరిశ్రమల స్థాపన విస్మరించారు. దీంతో స్థానికంగా పనులు లేక ఇతర ప్రాంతాలకు వారు వెళ్లిపోతున్నారు. గత పాదయాత్ర సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో జగన్ పీసీ పల్లి, పామూరు మండలాలకు విచ్చేసి నిమ్జ్ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. 5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. అయిదేళ్లలో ఒక్క అడుగు పడలేదు.
ప్రకటనలకే పరిమితమైన కారిడార్: దర్శి నియోజకవర్గంలోని దొనకొండ మండలంలో పరిశ్రమల కారిడార్ కోసం గతంలో 25 వేల ఎకరాలు సేకరించారు. అయిదేళ్ల కాలంలో వైకాపా ప్రభుత్వం అక్కడ ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో స్థానిక యువకులు ఉపాధి కోసం మహా నగరాలకు వలసపోతున్నారు. స్థానికంగా పనులు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఊళ్లో మిగిలిన నానమ్మ.. మనుమరాలు
ఈ చిత్రం వాగుపల్లి గ్రామంలోనిది. మనుమరాలు మేఘనను చదివిస్తున్న నానమ్మ వేటగిరి రాములమ్మ! కుమారుడు మల్లికార్జున తన మూడెకరాల్లో సాగు చేసేందుకు వేసిన బోరు ఎండిపోయింది. పంటలు పంటక అప్పుల పాలయ్యారు. గత్యంతరం లేక తెలంగాణలోని నిజామాబాద్ వెళ్లిపోయారు. చిన్నారి మనమరాలిని తల్లిని ఊళ్లో వదిలి వెళ్లిపోయారు.
తాళం వేసి.. తెలంగాణ బాట పట్టి..
కనిగిరి శివారు కొత్తూరులోని నాగేశ్వరరావు కుటుంబం పరిస్థితి మరీ దయనీయం స్థానికంగా పనులు లేకపోవడంతో ఊరొదిలి..తెలంగాణలోని బోధన్కు వెళ్లిపోయారు.
గతం ఘనం.. ఎండిపోయింది నిజం
ఈ తోట కనిగిరి మండలంలో పేరంగుడిపల్లిలోనిది. నీళ్లు లేక నిలువెల్లా ఎండి పోయింది. గతంలో ఉద్యాన పంటలకు చిరునామాగా ఉన్న కనిగిరిలో ప్రస్తుత పరిస్థితి ఇదీ! నీరు పెట్టలేక పండ్ల తోటలను వదిలేసి ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టారు.
జగనన్నా.. ఇక్కడేనా లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది ?
ఈ చిత్రం పామూరు మండలం బోడవాడు సమీపంలో నిమ్జ్కు సంబంధించిన బోర్డు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో కనిగిరి ప్రాంతంలో పాదయాత్ర చేశారు. నిమ్జ్ పూర్తిచేసి వలసలకు చరమగీతం పాడతానని, స్థానికంగా ఉన్న 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తానన్నారు. ఇప్పటికి కనీసం భూ సేకరణే జరగలేదు.
ఒంటరిగా మిగిలిన మాతృమూర్తి
ఈ చిత్రంలో వృద్ధురాలి పేరు బత్తుల లక్ష్మమ్మ. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తూరు బీసీ కాలనీ. కుమారుడు కొండలరావుకు రెండెకరాల పొలం ఉన్నా, వర్షాధారం కావడంతో ఊళ్లో ఉపాధి లేక భార్య నాగలక్ష్మి, ఇద్దరు పిల్లలను తీసుకుని భాగ్యనగరానికి వెళ్లి బేల్దారి పనులు చేసుకుంటున్నారు. తల్లి లక్ష్మమ్మ దీనంగా ఇంటి వద్ద మిగిలారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్ హిట్.. తెదేపా శ్రేణుల్లో జోష్
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పొదిలి, గిద్దలూరులో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. -
జనం చూస్తే నాకేంటి!
[ 04-05-2024]
పరదాల మధ్య ఇంతకాలం తిరిగిన జగన్కు.. సామాన్యుల బాధలు, వారి ఆవేదన ఇంతకాలం ఏమాత్రం పట్టలేదు. వాస్తవ పరిస్థితులను గుర్తించలేదు. -
జగన్కు జిల్లా ‘రివర్స్’ షాక్
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ.. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి జిల్లాలో జనం ‘రివర్స్’ షాక్లిస్తున్నారు. ఇటీవల టంగుటూరులో మంత్రి ఆదిమూలపు సురేష్ గెలుపు కోరుతూ జగన్ ప్రచారం చేశారు. -
ఏలికా.. మా ఉసురు తగలదా!
[ 04-05-2024]
ఎన్నికల వేళ లబ్ధికి జగన్ తెర లేపిన వికృత రాజకీయ క్రీడకు పండుటాకులు విలవిల్లాడుతున్నారు. ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే అవ్వాతాతలను బ్యాంక్లకు రప్పించారు. -
నిత్యం పరేషాన్
[ 04-05-2024]
ఇంటింటికీ ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల ద్వారా నిత్యావసరాల సరకులు అందజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఆర్భాటం చేయడం తప్ప ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు. ఏ ప్రాంతంలో ఎప్పుడు సరకులిస్తారో తెలియదు.. సమయ పాలన ఉండదు. -
సేవకుడిని కాదని స్మగ్లర్కు వైకాపా సీటు
[ 04-05-2024]
సైకో జగన్ మాగుంట శ్రీనివాసులురెడ్డిని కాదని తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చి సీటిచ్చారు. తాతల నాటి ఆస్తులను కొట్టేసేందుకు భూరక్షణ చట్టం తెచ్చారు. -
వైకాపాను ఓడించకపోతే.. యువతకు ఉపాధి కష్టమే
[ 04-05-2024]
వైకాపా ఆరాచక పాలనకు అంతం పలకాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గిద్దలూరులో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. -
తపాలా ఓట్లకు ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 04-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఫ్లోరైడ్ ఊసెత్తక.. నిమ్జ్ మాటెత్తక..
[ 04-05-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార సభ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. కనిగిరి ప్రాంత సమస్యలపై గట్టి హామీలిస్తారని..తమ ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. -
తెదేపాలోకి ఇద్దరు కార్పొరేటర్లు
[ 04-05-2024]
ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన వైకాపా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు కార్పొరేటర్లు పార్టీలోకి చేరగా, శుక్రవారం మరో ఇద్దరు కార్పొరేటర్లు తెదేపా కండువా కప్పుకున్నారు. -
పశ్చిమ ప్రకాశానికి వరాల జల్లు
[ 04-05-2024]
మండు వేసవిలో చంద్రన్న కురిపించిన వరాల జల్లుతో పొదిలివాసులు పులకరించారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తానంటూ ఇచ్చిన ఒక్కో హామీకి చప్పట్లు చరిచి వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. -
నీళ్లో.. జగనన్నా!
[ 04-05-2024]
గిద్దలూరు నగరపంచాయతీవాసులు గత పదిహేను రోజులుగా తాగునీటికి అల్లాడుతున్నారు. నగరపంచాయతీ పరిధిలో ఉన్న డీప్బోర్లలో రోజుకో ప్రాంతంలో నీరు అడుగంటడంతో సమస్య తీవ్రతరమవుతోంది. -
కారు ఢీకొని వాహన చోదకుడి మృతి
[ 04-05-2024]
కారు ఢీకొని ద్విచక్ర వాహన చోదకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కంచర్లవారిపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!