logo

వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత

వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్‌ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 25 Apr 2024 02:35 IST

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్‌ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎనికపాడుకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం వైకాపా అభ్యర్థి నామినేషన్‌ దాఖలు సందర్భంగా భారీ జన సమీకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి ఎనికపాడుకు చెందిన వైకాపా నేతలు దుంపా శివారెడ్డి, దుంపా బాపిరెడ్డి కారులో మద్యం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు మాటువేసి గ్రామ శివార్లలో  దాడులు చేసి 180 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, అందులోని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దేవకుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు