దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు.
బార్ల నుంచి వైకాపా నేతలకు భారీగా మద్యం
దాడుల్లో పట్టుబడినా చర్యలు చేపట్టని యంత్రాంగం
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. అక్కడ 133 మద్యం సీసాలు అక్రమంగా ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదరు బార్ను సీజ్ చేశారు.
మార్కాపురం నేర విభాగం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థులు, నేతలు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. తమ అండదండలతో నడుస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ల పేరుతో డిపోల నుంచి పెద్ద ఎత్తున సరకును ఇప్పటికే దిగుమతి చేసుకుని నిల్వ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పటిష్ఠ తనిఖీలు చేపట్టి మద్యానికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు స్వామిభక్తి చాటుకుంటున్నారు. తమకేం తెలియనట్లు నిద్ర నటిస్తున్నారు. మార్కాపురం ఉదంతమే ఇందుకు నిదర్శనం. పట్టణంలోని ఓ బార్ నుంచే పెద్ద ఎత్తున మద్యం తరలివెళ్తోందనే విమర్శలున్నాయి. ఇక్కడ అధికారులు మద్యం సీసాలు పట్టుకున్న విషయం తెలుసుకున్న వైకాపా నేత నేరుగా రంగంలోకి దిగారు. ఎలాంటి చర్యలు లేకుండా వారిపై ఒత్తిడి తెచ్చారు. అధికారులు కూడా వైకాపా నేతల ఆగడాలకు వంతపాడుతున్నారు. విచారణ పేరుతో సదరు బార్పై అధికారులు చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాకిలెక్కలతో చర్యల నుంచి బయట పడేసేందుకు చూస్తున్నారు.
ఒప్పంద ఉద్యోగే సూత్రధారి...: జిల్లాలో ఒంగోలు, మార్కాపురం కేంద్రంగా ఉన్న మద్యం డిపోల నుంచి బార్ అండ్ రెస్లారెంట్లు, ప్రభుత్వ దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. మార్కాపురం డిపో కింద మార్కాపురం, గిద్దలూరు, వై.పాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో తొమ్మిది బార్లు, అత్యధికంగా 101 మద్యం దుకాణలున్నాయి. వీటన్నిటికీ మార్కాపురం కేంద్రంగా ఉన్న డిపో నుంచి సరకు చేరవేస్తుంటారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత గతేడాది ఏ తేదీన ఎంత సరకు బార్లకు అందించారో.. అంతే సరకును ఇప్పుడు కూడా విక్రయించాలన్నది ఈసీ నిబంధన. అయితే వీటిని కొందరు తుంగలో తొక్కుతున్నారు. ఒక్కో కేసుపై రూ.500 అదనంగా తీసుకుని ఇప్పటికే పెద్ద ఎత్తున మద్యం నిల్వలను డిపో సిబ్బందే అందించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో డిపోలో పని చేసే ఓ ఒప్పంద ఉద్యోగి కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. మార్కాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు మూడు వేల కేసుల వరకు మద్యం చేరవేసినట్లు తెలిసింది.
ఈ నెల 22న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నా రాంబాబు నామపత్రం దాఖలు చేశారు. అంతకుముందు రోజు రాత్రి కళాశాల రహదారిలో ఉన్న అజంతా బార్ నుంచి 48 మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఎస్సైకి అప్పగించగా నిందితులపై కేసు నమోదు చేశారు. బార్ నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో సీజ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్ హిట్.. తెదేపా శ్రేణుల్లో జోష్
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పొదిలి, గిద్దలూరులో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. -
జనం చూస్తే నాకేంటి!
[ 04-05-2024]
పరదాల మధ్య ఇంతకాలం తిరిగిన జగన్కు.. సామాన్యుల బాధలు, వారి ఆవేదన ఇంతకాలం ఏమాత్రం పట్టలేదు. వాస్తవ పరిస్థితులను గుర్తించలేదు. -
జగన్కు జిల్లా ‘రివర్స్’ షాక్
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ.. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి జిల్లాలో జనం ‘రివర్స్’ షాక్లిస్తున్నారు. ఇటీవల టంగుటూరులో మంత్రి ఆదిమూలపు సురేష్ గెలుపు కోరుతూ జగన్ ప్రచారం చేశారు. -
ఏలికా.. మా ఉసురు తగలదా!
[ 04-05-2024]
ఎన్నికల వేళ లబ్ధికి జగన్ తెర లేపిన వికృత రాజకీయ క్రీడకు పండుటాకులు విలవిల్లాడుతున్నారు. ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే అవ్వాతాతలను బ్యాంక్లకు రప్పించారు. -
నిత్యం పరేషాన్
[ 04-05-2024]
ఇంటింటికీ ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల ద్వారా నిత్యావసరాల సరకులు అందజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఆర్భాటం చేయడం తప్ప ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు. ఏ ప్రాంతంలో ఎప్పుడు సరకులిస్తారో తెలియదు.. సమయ పాలన ఉండదు. -
సేవకుడిని కాదని స్మగ్లర్కు వైకాపా సీటు
[ 04-05-2024]
సైకో జగన్ మాగుంట శ్రీనివాసులురెడ్డిని కాదని తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చి సీటిచ్చారు. తాతల నాటి ఆస్తులను కొట్టేసేందుకు భూరక్షణ చట్టం తెచ్చారు. -
వైకాపాను ఓడించకపోతే.. యువతకు ఉపాధి కష్టమే
[ 04-05-2024]
వైకాపా ఆరాచక పాలనకు అంతం పలకాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గిద్దలూరులో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. -
తపాలా ఓట్లకు ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 04-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఫ్లోరైడ్ ఊసెత్తక.. నిమ్జ్ మాటెత్తక..
[ 04-05-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార సభ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. కనిగిరి ప్రాంత సమస్యలపై గట్టి హామీలిస్తారని..తమ ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. -
తెదేపాలోకి ఇద్దరు కార్పొరేటర్లు
[ 04-05-2024]
ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన వైకాపా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు కార్పొరేటర్లు పార్టీలోకి చేరగా, శుక్రవారం మరో ఇద్దరు కార్పొరేటర్లు తెదేపా కండువా కప్పుకున్నారు. -
పశ్చిమ ప్రకాశానికి వరాల జల్లు
[ 04-05-2024]
మండు వేసవిలో చంద్రన్న కురిపించిన వరాల జల్లుతో పొదిలివాసులు పులకరించారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తానంటూ ఇచ్చిన ఒక్కో హామీకి చప్పట్లు చరిచి వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. -
నీళ్లో.. జగనన్నా!
[ 04-05-2024]
గిద్దలూరు నగరపంచాయతీవాసులు గత పదిహేను రోజులుగా తాగునీటికి అల్లాడుతున్నారు. నగరపంచాయతీ పరిధిలో ఉన్న డీప్బోర్లలో రోజుకో ప్రాంతంలో నీరు అడుగంటడంతో సమస్య తీవ్రతరమవుతోంది. -
కారు ఢీకొని వాహన చోదకుడి మృతి
[ 04-05-2024]
కారు ఢీకొని ద్విచక్ర వాహన చోదకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కంచర్లవారిపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?