logo

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

కట్టుకున్న భార్యను హత్య చేసిన కేసులో నిందితుడైన భర్తకు యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువరించారు.

Published : 28 Mar 2023 02:09 IST

మార్కాపురం నేర విభాగం న్యూస్‌టుడే : కట్టుకున్న భార్యను హత్య చేసిన కేసులో నిందితుడైన భర్తకు యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువరించారు. త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అరబోలు బాలమ్మను అదే గ్రామానికి చెందిన అరబోలు కాశయ్యతో 2008లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లల ఉన్నారు. వివాహం అయిన కొద్ది రోజులకు మద్యానికి బానిసైన కాశయ్య భార్యతో తరచూ గొడవకు దిగేవాడు. 2016 ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి నిద్రిస్తున్న భార్య బాలమ్మ(30) పై కాశయ్య మంచం కోడుతో తలపై బలంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. దీనిపై గ్రామ రెవెన్యూ అధికారి యేసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రిపురాంతకం పోలీసులు కాశయ్యపై హత్య కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిపై న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా మార్కాపురం ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి టి రాజా వెంకటాద్రి సాక్షులను విచారించారు. నేరం రుజువు కావడంతో సోమవారం నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని