తలుపులు తెరిచినా.. పుస్తకాలేవీ!
వేసవి సెలవుల అనంతరం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ కళాశాలలు గురువారం నుంచి పునఃప్రారంభమయ్యాయి.
తొలిరోజు ఖాళీగా కళాశాలలు
టంగుటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల
ఈనాడు డిజిటల్, ఒంగోలు న్యూస్టుడే బృందం
వేసవి సెలవుల అనంతరం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ కళాశాలలు గురువారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. మొత్తం 28 ప్రభుత్వ జూనియర్, మూడు ఎయిడెడ్, 78 అన్ ఎయిడెడ్ ఇంటర్ కళాశాలల్లో 26 వేల మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీటిల్లోని అయిదు యాజమాన్యాల పరిధిలోని విద్యాలయాల్లో చదివే సుమారు పది వేల మందికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. విద్యాలయాల తలుపులు తెరుచుకున్నప్పటికీ ఈ ఏడాది కూడా వారికి భంగపాటు తప్పలేదు.
*పాఠాలు నేర్వని ప్రభుత్వం...: గడిచిన సంవత్సరం చివరి వరకు ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందలేదు. ఈ పరిస్థితి ఫలితాలపై ప్రభావం చూపింది. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో ఏడోస్థానంలో, సీనియర్ ఇంటర్లో 11వ స్థానంలో నిలవాల్సి వచ్చింది. అయినా ప్రభుత్వం గత ఏడాది అనుభవాల నుంచి గుణపాఠం నేర్వలేదు. గురువారం నుంచి తరగతులు పునఃప్రారంభమైనప్పటికీ కొన్ని కళాశాలలు ఒక్క విద్యార్థి కూడా కూడా లేక వెలవెలబోయాయి.
*విద్యాలయాలు వెలవెల...* మొదటిరోజు సంతనూతలపాడు మండలం మైనంపాడులో ఒక్క విద్యార్థి కూడా కళాశాలకు రాలేదు. ఆరుగురు ఉపాధ్యాయులు కొత్తగా ప్రవేశాల కోసం గ్రామాల్లో పర్యటిస్తూ కనిపించారు.*కనిగిరిలో దాదాపు 150 మంది విద్యార్థులున్నారు. వీరెవరూ తొలిరోజు హాజరుకాలేదు. అధ్యాపకులు సాయంత్రం వరకు ఉండి వెళ్లారు. *చీమకుర్తి జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదివే విద్యార్థులు 112 మంది ఉంటే తొలిరోజు అయిదారుగురు మాత్రమే వచ్చి వెళ్లారు. మొదటి సంవత్సరంలో ఇంకా ఎవరూ చేరలేదు. *సింగరాయకొండలో 221 మంది ఉన్నా ఎవరూ కనిపించ లేదు. *టంగుటూరులోనూ ఇదే పరిస్థితి. *కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరానికి సంబంధించి ఇంకా ఎవరూ చేరలేదు. *తాళ్లూరులోని వీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా వెలవెలబోతూ కనిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగులకు ‘జగనన్న ద్రోహం’
[ 07-05-2024]
ఏటా జాబ్ క్యాలెండర్..మెగా డీఎస్సీ..ఆపై ఏపీపీఎస్సీ..ఇంకా పోలీసు పోస్టులు..మీకిక ఉద్యోగాలే ఉద్యోగాలు. అయిదేళ్ల క్రితం జగన్ ఇలా తన వంచనాపూరిత హామీలతో జిల్లాను హోరెత్తించేశారు. -
‘భూ’చోళ్లు.. జగనన్నే వెన్నుదన్ను
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో భూ మాఫియా రెచ్చిపోయింది. కొండలు, గుట్టలు, కాలువ గట్లు, జల వనరులు, అసైన్డ్, పశువుల పోరంబోకు, దేవుని మాన్యం, శ్మశాన భూములు ఆక్రమించారు. -
ఓటేయకుంటే... గొంతులూ తడపం
[ 07-05-2024]
గొంతులెండుతున్నాయి. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వండని జనం వేడుకుంటుంటే.. ‘మీరు మా పార్టీ కాదు కదా’ అని ప్రశ్నిస్తూ అమానుషంగా ప్రవర్తిన్నారు వైకాపా నాయకులు. -
అంతర్జాతీయ రాగం.. బతుకులు ఆగమాగం..
[ 07-05-2024]
‘రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అందుకు విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నాం’ ఇవీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్న మాటలు. -
కొనసాగుతున్న తపాలా.. ఇంటి వద్దే ఓటు
[ 07-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
అరాచక పాలనను అంతమొందిద్దాం
[ 07-05-2024]
రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడానికి కాపులంతా జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని టీబీకే రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రాము కోరారు. -
అధికారం ఉన్నోడిదే భూమి!
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం అనే పట్టాదారు పుస్తకాలు జారీచేసి దానిపైన సీఎం జగన్ మోహన్రెడ్డి పుస్తకాలను జారీచేశారు. -
తెదేపా హయాంలోనే సంక్షేమానికి పెద్దపీట
[ 07-05-2024]
వైకాపా పాలనలో కంటే తెదేపా హయాంలోనే సంక్షేమానికి బడ్జెట్లో ఎక్కువ ఖర్చుచేసినట్లు ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సంజు శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్పై దిల్లీ విజయం
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM