నిధుల్లేక సాకులు.. వేతనజీవులతో ఆటలు
ఉద్యోగులకు వేతనమే దిక్కు. ప్రతి నెలా చేతికందే మొత్తంతోనే కుటుంబ అవసరాలు తీర్చుకుంటుంటారు. ఇంటి నిర్మాణం, వాహనం, పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు ప్రతి నెలా అయిదో తేదీలోపు ఈఎంఐ జమ చేయాల్సి ఉంటుంది.
రెండు నెలలుగా 1,200 మందికి అందని జీతాలు
ఇబ్బందుల్లో వైద్యశాఖ ఉద్యోగులు
ఒంగోలు నగరంలోని మాతా శిశు వైద్యశాల
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఉద్యోగులకు వేతనమే దిక్కు. ప్రతి నెలా చేతికందే మొత్తంతోనే కుటుంబ అవసరాలు తీర్చుకుంటుంటారు. ఇంటి నిర్మాణం, వాహనం, పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు ప్రతి నెలా అయిదో తేదీలోపు ఈఎంఐ జమ చేయాల్సి ఉంటుంది. ఆలస్యమైతే వడ్డీ పేరుతో మరింత భారం తప్పదు. వేతనం ఒక్క నెల ఆగిపోతే సదరు ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారుతుంది. కుటుంబ అవసరాలకు అప్పులు చేయక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటున్నారు. వారికి గత రెండు నెలలుగా, డీఎంహెచ్వో పరిధిలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు ఒక నెల వేతనాలు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 1,200 మంది ఉద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
ఆర్థిక పరిస్థితి అదుపు తప్పి...: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదుపు తప్పింది. గతంలో ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు అందేవి. ప్రస్తుతం ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. నెలలు తరబడి నిలిచిపోవడం సాధారణ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. వైద్యవిధాన పరిషత్ కింద ఉమ్మడి ప్రకాశంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, ఒంగోలు మాతా శిశువైద్యశాల, మార్కాపురం జిల్లా స్థాయి ఆసుపత్రులు పనిచేస్తున్నారు. వీటిలో పనిచేస్తున్న అటెండర్ నుంచి సూపరింటెండెంట్ వరకు ఫిబ్రవరి, మార్చి వేతనాలు నేటికీ అందలేదు.
ఏప్రిల్కూ అందే పరిస్థితి లేదు...
తమకు ఏప్రిల్లో కూడా జీతాలు వస్తాయనే నమ్మకం లేదని ఆయా శాఖల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీలోపు ఏప్రిల్ నెల బిల్లులు పంపించాలి. అందుకు మరో వారం రోజులే సమయం ఉంది. ఫిబ్రవరి, మార్చి నెలలు వేతనాలు ఇవ్వకుండా ఏప్రిల్ నెల వేతనాలు ఇచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే డీఎంహెచ్వో పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు 1,024 మందికి, ఆప్కాస్ పరిధిలో 18 మందికి కూడా మార్చి నెల వేతనాలు నిలిచిపోయాయి. అసలు ఫిబ్రవరి నెల వేతనం ఎందుకు నిలిచిపోయిందో ఇప్పటికీ స్పష్టత లేదని ఒక సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ ఆవేదన వ్యక్తం చేయగా.. సాంకేతిక కారణాల వల్ల సమస్య తలెత్తిందని, త్వరలో చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద వేతనాల చెల్లింపునకు నిధులు లేకనే సాకులు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారనే అభిప్రాయం వేతన జీవుల్లో వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న కళ్లలో ఆనందం.. పొద్దంతా ఏడిపింఛను కుతంత్రం
[ 30-04-2024]
మీ బిడ్డనంటూ జగన్ నటిస్తూ కపట మాటలు చెబుతారు. చేతల్లో అబద్ధాలని జనానికి తెలియగానే అస్మదీయ అధికార గణం రంగంలోకి దిగుతుంది. మరో జగన్నాటకానికి తెర లేపుతుంది. అన్న కళ్లలో ఆనందం కోసం పరితపిస్తుంది. -
అబద్ధాల అన్నొస్తున్నాహో!
[ 30-04-2024]
జగన్నాటకం మళ్లీ మొదలైంది. ఎన్నికలకు పక్షం రోజులే ఉండటంతో ఓటర్ల కళ్లకు గంతలు కట్టేందుకు ఆయన జనం చెంతకు వస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీలు గుప్పించి అధికార పీఠమెక్కి..ఆ తర్వాత ఒక్కటీ నెరవేర్చలేదు. -
‘మహిళా భేరి’ మోగిద్దాం.. అరాచక పాలన తరుముదాం
[ 30-04-2024]
‘పాలకులను నిర్ణయించేది మహిళలే.. వారి చేతుల్లోనే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఉంది. అభివృద్ధికి ఓటేసి.. అరాచకాన్ని తరమాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెదేపా కొండపి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు. -
హవ్వ.. భావి పౌరుల భుజాలపై జెండాలా!
[ 30-04-2024]
అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మానవత్వం మరణించింది !
[ 30-04-2024]
వందలాది మంది సాక్షిగా మానవత్వం మరణించింది. రక్తమోడుతున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడి మృతి
[ 30-04-2024]
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. -
సార్వత్రిక రణం.. హోరెత్తనున్న ప్రచార పర్వం
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలై ఈ నెల 25 వరకు కొనసాగింది. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి 32 మంది 61 సెట్లు దాఖలు చేశారు. -
ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 30-04-2024]
రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. -
తనిఖీల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు
[ 30-04-2024]
ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల ప్రత్యేక సాధారణ పరిశీలకుడు శ్రీరామ్ మోహన్ మిశ్రా సూచించారు. -
చెల్లని చెక్కు కేసులో నిందితుడికి జైలు
[ 30-04-2024]
చెల్లని చెక్కు కేసులో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. సీఎస్పురం మండలం అరివేముల గ్రామానికి చెందిన అన్నపురెడ్డి పరమేశ్వరరెడ్డి వెలిగండ్ల మండలం
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు