ప్రమాదవశాత్తూ మంటలంటుకొని రైతు సజీవ దహనం
ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
సుబ్బారెడ్డి (పాతచిత్రం)
తాళ్లూరు, న్యూస్టుడే: ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. స్థానిక వెంకటరెడ్డిపాలేనికి చెందిన కోట సుబ్బారెడ్డి (67), తన పొలంలోని మొక్కజొన్న చేనులో ఉన్న చెత్తను తగులబెట్టేందుకు నిప్పుపెట్టారు. ఆ పంట కాలిపోయిన తర్వాత పక్కనున్న సుబాబుల్ తోటకు మంటలు అంటుకున్నాయి. వాటిని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తుండగా మంటలు అంటుకొని మృతి చెందారు. అతడు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలం వద్దకు వెళ్లి చూశారు. అతడు తీసుకెళ్లిన ద్విచక్ర వాహనం పొలం పక్కనే ఉంది. ఆచూకీ కోసం వెతకగా సుబాబుల్ తోటలో కాలిపోయి మృతి చెంది ఉన్నాడు. విగతజీవిగా పడిఉన్న అతడిని చూసి కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
ట్రాక్టర్ బోల్తాపడి విద్యార్థి మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
కంభం (రాచర్ల), న్యూస్టుడే : ట్రాక్టర్ బోల్తా పడి విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాచర్ల మండలం చిన్నగానిపల్లి సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అర్థవీడుకు చెందిన పోలిశెట్టి ఆంజనేయులు తన అత్తవారి ఊరైన చినగానిపల్లికి భార్య అల్లూరమ్మ, పిల్లలతో వచ్చి అక్కడే నివాసముంటున్నారు. బుధవారం స్థానికుడు షేక్ ఖాసిం సాహెబ్ ట్రాక్టర్కు నీటి ట్యాంకర్ తగిలించుకొని పొలంలోని బోరు వద్ద నీటిని పట్టుకునేందుకు వెళ్తుండగా, ఆంజనేయులు కుమారుడు పోలిశెట్టి రంగ చరణ్ (13), మరో బాలుడు పెనమలూరి శ్రీహరి ట్రాక్టర్ ఎక్కారు. పొలంలో ట్యాంకర్కు నీటిని పట్టుకుని బయలుదేరారు. బాలురిద్దరూ ట్రాక్టర్ ఇంజిన్, ట్యాంకర్కు నడుమ ఉండే ఇనుప రాడ్పై నిలుచుని వస్తుండగా వాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో రంగ చరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడు శ్రీహరి, చోదకుడు ఖాసింసాహెబ్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో గిద్దలూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మృతుడి సోదరి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. సంఘటన తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న కళ్లలో ఆనందం.. పొద్దంతా ఏడిపింఛను కుతంత్రం
[ 30-04-2024]
మీ బిడ్డనంటూ జగన్ నటిస్తూ కపట మాటలు చెబుతారు. చేతల్లో అబద్ధాలని జనానికి తెలియగానే అస్మదీయ అధికార గణం రంగంలోకి దిగుతుంది. మరో జగన్నాటకానికి తెర లేపుతుంది. అన్న కళ్లలో ఆనందం కోసం పరితపిస్తుంది. -
అబద్ధాల అన్నొస్తున్నాహో!
[ 30-04-2024]
జగన్నాటకం మళ్లీ మొదలైంది. ఎన్నికలకు పక్షం రోజులే ఉండటంతో ఓటర్ల కళ్లకు గంతలు కట్టేందుకు ఆయన జనం చెంతకు వస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీలు గుప్పించి అధికార పీఠమెక్కి..ఆ తర్వాత ఒక్కటీ నెరవేర్చలేదు. -
‘మహిళా భేరి’ మోగిద్దాం.. అరాచక పాలన తరుముదాం
[ 30-04-2024]
‘పాలకులను నిర్ణయించేది మహిళలే.. వారి చేతుల్లోనే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఉంది. అభివృద్ధికి ఓటేసి.. అరాచకాన్ని తరమాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెదేపా కొండపి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు. -
హవ్వ.. భావి పౌరుల భుజాలపై జెండాలా!
[ 30-04-2024]
అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మానవత్వం మరణించింది !
[ 30-04-2024]
వందలాది మంది సాక్షిగా మానవత్వం మరణించింది. రక్తమోడుతున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడి మృతి
[ 30-04-2024]
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. -
సార్వత్రిక రణం.. హోరెత్తనున్న ప్రచార పర్వం
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలై ఈ నెల 25 వరకు కొనసాగింది. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి 32 మంది 61 సెట్లు దాఖలు చేశారు. -
ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 30-04-2024]
రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. -
తనిఖీల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు
[ 30-04-2024]
ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల ప్రత్యేక సాధారణ పరిశీలకుడు శ్రీరామ్ మోహన్ మిశ్రా సూచించారు. -
చెల్లని చెక్కు కేసులో నిందితుడికి జైలు
[ 30-04-2024]
చెల్లని చెక్కు కేసులో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. సీఎస్పురం మండలం అరివేముల గ్రామానికి చెందిన అన్నపురెడ్డి పరమేశ్వరరెడ్డి వెలిగండ్ల మండలం