అభివృద్ధి మరిచి.. పర్యాటకానికి పాతర
అయిదేళ్లూ పట్టించుకోని వైకాపా ప్రభుత్వం
నిర్లక్ష్యం నీడలో ప్రజాప్రతినిధులు
మార్కాపురం, గిద్దలూరు, పెద్దదోర్నాల, కంభం, త్రిపురాంతకం
కంభం చెరువు కట్ట
పర్యాటక రంగాన్ని వైకాపా ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అయిదేళ్లుగా ఈ రంగానికి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసింది. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధిచేసి పర్యాటకులను ఆకర్షించి ఆమేరకు ఆదాయాన్ని ఆర్జీంచే అవకాశాలను గాలికొదిలేసింది. గత ప్రభుత్వం హాయంలో ప్రతిపాదించిన కొన్ని ప్రాంతాల అభివృద్ధిని గాలికొదిలేసింది.నియోజకవర్గంలోని పలు పర్యాటక ప్రాంతాలు కనీస వసతులు, రవాణాసదుపాయలు లేకపోవడంతో వెలవెలబోతున్నాయి. త్రిపురాంతకం బాలత్రిపురసందురీదేవి, మార్కాపురం చెన్నకేశవస్వామి వంటి ప్రసిద్ధ ఆలయాలు, కంభం చెరువు లాంటి జలాశయాలున్నాయి. వీటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నా పాలకులు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.
జె.పి.చెరువు అటవీప్రాంతంలోని నెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానం
ప్రత్యేక దృష్టి అవసరం
త్రిపురాంతకంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. ఈ అయిదేళ్లలో దీనిపై దృష్టి పెట్టలేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి ఓ ప్రత్యేక గుర్తింపు వస్తుంది.
అలవాట చంద్రశేఖర్ రెడ్డి, గణపవరం, త్రిపురాంతకం మండలం.
పనుల అతీగతి లేదు
నెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వైకాపా నాయకులు గొప్పలు చెప్పుకున్నారు. ఆ పనుల అతీగతి లేదు. జలపాతం వద్ద బోటు సౌకర్యం ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆశలు రేకెత్తించారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఏడాది క్రితం గుత్తేదారు పనులు దక్కించుకున్నప్పటికీ ప్రారంభించని పరిస్థితి నెలకొంది. దీంతో యువత ఉపాధి అవకాశాలు కోల్పోయింది.
పుట్టా వినాయక్, జె.పి.చెరువు
ప్రగతి ఏదీ
కంభం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. బోటు షికారు, చెరువు మధ్యలో ఉండే చిన్నపాటి కొండలపై రిసార్టులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పాలకులు, అధికారులు హామీలు ఇచ్చినా, ప్రగతి మాత్రం కనిపించడం లేదు.
సుబ్బారావు, కంభం
ఆ ఊసే లేదు
శ్రీశైలానికి ముఖద్వారమైన పెద్దదోర్నాల పర్యాటకానికి అనువుగా ఉన్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. విభిన్న జాతులకు ఆవాసమైన నల్లమల విశిష్టతను తెలియజేస్తూ పెద్దదోర్నాలలో పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉండగా చేయలేదు. శ్రీశైలం రహదారిలో అడ్వెంచర్ పార్కు ఏర్పాటు పనులు రెండేళ్లుగా కొలిక్కిరాలేదు. నిధులు కేటాయించకపోవడమే కారణం.
చెంచయ్య, పెద్దదోర్నాల
కనీస సౌకర్యాలేవీ..
కంభం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని నాయకులు, అధికారులు అయిదేళ్లుగా పట్టించుకోనే లేదు. చారిత్రకమైన తటాకాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉంది. నిత్యం చెరువు అందాలను చూసేందుకు వచ్చే వారికి కనీస వసతులు లేవు. బోటు షికారు, రిసార్టులు ఏర్పాటు చేస్తే బాగుండేది.
యశ్వంత్, సాధుమియా వీధి, కంభం
ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాం
దిగువమెట్ట గ్రామంలోని అటవీప్రాంతంలో గత తెదేపా ప్రభుత్వం వనవిహారిని ఏర్పాటు చేసి గిరిజనలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వైకాపా ప్రభుత్వం దీనికి నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో స్థానిక యువతకు ఉపాధి కోల్పోయారు.
దేశావత్ శ్రీనునాయక్, దిగువమెట్ట తండా
ఇబ్బంది పడుతున్నారు
మార్కాపురం పట్టణంలోని ప్రముఖ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే పర్యాటకంగా వసతుల కల్పనలో వెనుకబడి ఉంది. ఆలయంలో మౌలిక వసతులు ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. భక్తులకు తాగునీరు, వెయిటింగ్ హాలు, టాయిలెట్స్, టాన్మినేటర్స్ వంటివి నూతనంగా ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది.
ఆర్కెజె.నరసింహం, మార్కాపురం పట్టణవాసి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రకాశం జిల్లాను ఫార్మాహబ్గా చేస్తాం: నారా లోకేశ్
[ 30-04-2024]
ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్గా చేసే బాధ్యత తీసుకుంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. -
అన్న కళ్లలో ఆనందం.. పొద్దంతా ఏడిపింఛను కుతంత్రం
[ 30-04-2024]
మీ బిడ్డనంటూ జగన్ నటిస్తూ కపట మాటలు చెబుతారు. చేతల్లో అబద్ధాలని జనానికి తెలియగానే అస్మదీయ అధికార గణం రంగంలోకి దిగుతుంది. మరో జగన్నాటకానికి తెర లేపుతుంది. అన్న కళ్లలో ఆనందం కోసం పరితపిస్తుంది. -
అబద్ధాల అన్నొస్తున్నాహో!
[ 30-04-2024]
జగన్నాటకం మళ్లీ మొదలైంది. ఎన్నికలకు పక్షం రోజులే ఉండటంతో ఓటర్ల కళ్లకు గంతలు కట్టేందుకు ఆయన జనం చెంతకు వస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీలు గుప్పించి అధికార పీఠమెక్కి..ఆ తర్వాత ఒక్కటీ నెరవేర్చలేదు. -
‘మహిళా భేరి’ మోగిద్దాం.. అరాచక పాలన తరుముదాం
[ 30-04-2024]
‘పాలకులను నిర్ణయించేది మహిళలే.. వారి చేతుల్లోనే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఉంది. అభివృద్ధికి ఓటేసి.. అరాచకాన్ని తరమాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెదేపా కొండపి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు. -
హవ్వ.. భావి పౌరుల భుజాలపై జెండాలా!
[ 30-04-2024]
అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మానవత్వం మరణించింది !
[ 30-04-2024]
వందలాది మంది సాక్షిగా మానవత్వం మరణించింది. రక్తమోడుతున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడి మృతి
[ 30-04-2024]
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. -
సార్వత్రిక రణం.. హోరెత్తనున్న ప్రచార పర్వం
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలై ఈ నెల 25 వరకు కొనసాగింది. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి 32 మంది 61 సెట్లు దాఖలు చేశారు. -
ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 30-04-2024]
రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. -
తనిఖీల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు
[ 30-04-2024]
ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల ప్రత్యేక సాధారణ పరిశీలకుడు శ్రీరామ్ మోహన్ మిశ్రా సూచించారు. -
చెల్లని చెక్కు కేసులో నిందితుడికి జైలు
[ 30-04-2024]
చెల్లని చెక్కు కేసులో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. సీఎస్పురం మండలం అరివేముల గ్రామానికి చెందిన అన్నపురెడ్డి పరమేశ్వరరెడ్డి వెలిగండ్ల మండలం
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్
-
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే