పర్యాటకాన్ని చిదిమేసిన పాలకుడు
రూపురేఖలు కోల్పోయిన సందర్శనీయ స్థలాలు
తెదేపా హయాంలో రూ.కోట్లతో అభివృద్ధి పనులు
జగన్ నిర్వాకంతో జిల్లా వాసులకు కరవైన ఆహ్లాదం
చంద్రబాబు రూ.95 కోట్లు కేటాయించినా..
ఈనాడు, ఒంగోలు న్యూస్టుడే, మద్దిపాడు, సంతనూతలపాడు
గుండ్లకమ్మ జలాశయం
ప్రకృతి రమణీయతతో విలసిల్లే ప్రాంతాలపై నిర్లక్ష్యం నీడలు కమ్ముకుంటున్నాయి. తెదేపా హయాంలో ప్రకృతి ప్రేమికులతో కళకళలాడినవి నేడు ఓ శిథిల చిత్రాలను తలపిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుండ్లకమ్మ జలాశయం సమీపంలో కాటేజీల ఏర్పాటుకు నాబార్డు నుంచి రూ.65 కోట్లు, ప్రభుత్వం నుంచి రూ.30 కోట్లు కేటాయించేలా చొరవ చూపారు. నాబార్డు నుంచి నిధులు సైతం మంజూరవ్వగా రూ.3 కోట్లతో పనులు చురుగ్గా సాగాయి. సుందరంగా నిర్మాణం సాగింది. తదనంతరం వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక దీన్ని పూర్తిగా విస్మరించింది.
ఈతకొలను ఇలా...
ఈత కొలను పాడైపోయి..: జలాశయం ప్రాంతంలో అత్యాధునిక వసతులతో ఏడు రూములు, ఓ విశాలమైన హాలును నిర్మించారు. ఈత కొలను సైతం ఏర్పాటు చేసినా నేటి పాలకుల నిర్లక్ష్యంతో వృథాగా మిగిలింది. కాటేజీల్లో సీలింగ్ దెబ్బతింది. తలుపులు, అద్దాలు పగిలిపోయాయి. ఫ్లోరింగ్ పాడైంది. అక్కడ విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయి. పర్యవేక్షణ లేక అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది.
జలాశయం వద్ద నిరుపయోగంగా కాటేజీలు
బోటింగ్కు మంగళం : సెలవు రోజు వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం కోలాహలంగా ఉండేది. నిర్వహణ సక్రమంగా ఉండటంతో పుష్కలంగా నీరుండి బోటింగ్ సాగేది. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక దీన్ని నిలిపివేసింది. జలాశయ గేట్లు కొట్టుకుపోయి ఒట్టిపోవడంతో బోట్లను ఒడ్డుకు చేర్చడంతో అవి శిథిలమైపోతున్నాయి.
నాడు ఎకో కళా కాంతులు
ప్రారంభంకాని వన విహారి పార్కు
గిద్దలూరు పట్టణం: గిద్దలూరు మండలం దిగువమెట్టలో తెదేపా పాలనలో ఎకో టూరిజం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 2018లో అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు సుమారు రూ.కోటికి పైగా నిధులు మంజూరు చేశారు. దీంతో దిగువమెట్ట వద్ద నిర్మాణాలు చేపట్టడం.. స్థానికులు 40 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం.. అభయారణ్యంపై అవగాహన కల్పించడం లక్ష్యంగా వడివడిగా అడుగులేశారు. అక్కడ 3.75 హెక్టార్లలో ఎకో టూరిజం పార్కు, కాటేజీలు, పిల్లల కోసం పార్కు, మ్యూజియం ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించారు. అయితే జగన్ ప్రభుత్వం కొలువుదీరాక దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కాటేజీల నిర్మాణం, పిల్లల కోసం పార్కు, డైనింగ్ హాలు, వంట గదుల నిర్మాణాలు చేపట్టారు. టైగర్ సఫారీ కోసం అటవీ ప్రాంతంలో వ్యూ పాయింట్లను గుర్తించి అక్కడకి వెళ్లేందుకు వాహనాలు సమకూర్చాల్సి ఉంది. వనవిహారి ప్రారంభించకపోవడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి.
తెలంగాణ లక్కవరం చెరువులా మారేదెన్నడో
అందాల కంభం చెరువు
కంభం: విశ్వవ్యాప్త ఖ్యాతి ఉన్న కంభం చెరువునూ పాలకులు విస్మరించారు. దీన్ని కేరళ, తమిళనాడుల్లో రిజర్వాయర్ బేస్ టూరిజంలా అభివృద్ధి చేసే అవకాశమున్నా వారిలో కదలిక కరవైంది. చెరువులో చిన్నపాటి కొండలు.. చుట్టూ పచ్చని పొలాలతో అలరారే ఈ చెరువును అభివృద్ధి చేస్తే భారీగా ఆదాయం సమకూరే అవకాశముంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని లక్కవరం చెరువును ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. ఆసియాలోనే రెండో అతి పెద్దదైన కంభం చెరువును ఆ మాదిరిగా తీర్చిదిద్దాల్సి ఉన్నా నేతలు, పాలకులు పట్టించుకోవడం లేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస మరమ్మతులకు నిధులివ్వడం లేదు. కట్టపై అతిథి గృహం ఉన్నా, దానికి తలుపులు, కిటికీలు ధ్వంసమై అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. అక్కడ వసతుల కల్పనకు గతంలో రూ. 60 లక్షలతో ప్రతిపాదనలు పంపించినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
వేల ఏళ్లనాటి చరిత్రకు బూజు
కనపర్తి తీరం
నాగులుప్పలపాడు : వేల సంవత్సరాల నాటి శిలా సంపదకు బూజు పడుతోంది. కనపర్తి పురావస్తు మ్యూజియంలో ఎన్నో విలువైన చారిత్రక వస్తువులను భద్రపరిచారు. ఇక్కడ జౌనులు, బౌద్ధులు, శైవ మతస్థుల జీవనానికి సంబంధించిన ఆనవాళ్లున్నాయి. మ్యూజియంలో సప్తమాత్రికలు, వారాహి, కౌమరిణి, ధారాలింగం, దిగంబేశ్వరుడు, వివిధ ఆకృతుల్లో శివలింగాలు, నందులున్నాయి. బ్రాహ్మీ, పాళీ, ప్రాకృత, ప్రాచీన తమిళ, చోళ శాసనాలు ఉన్నాయి. నాటి మట్టిపాత్రలు, వివిధ రాతి విగ్రహాలున్నాయి. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచి శాతవాహనులు, చోళులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. 11వ దశాబ్దం నాటి చౌళరాజుల కాలంలోని ఏలేశ్వర, చౌళమాంళ, సీతారామ స్వామి దేవస్థానాలు కనపర్తిలో ఉన్నాయి. ఇంత కీలకమైన మ్యూజియాన్ని జగన్ ప్రభుత్వం విస్మరించింది. ఇక్కడి ఆహ్లాదభరిత సముద్ర తీరం వద్ద పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టకపోవడంపై ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనపర్తి మ్యూజియంలో విభిన్న ప్రాచీన శివలింగాలు
రామా.. పర్యటక స్థలి ఎక్కడ..
రామతీర్థానికి వెళ్లేదారి ఇలా..
చీమకుర్తి,న్యూస్టుడే: జిల్లా వరప్రసాదినిగా ఉన్న రామతీర్థం జలాశయాన్ని పర్యటక ప్రదేశంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నా వైకాపా ప్రభుత్వం దాన్ని అçకెక్కించింది. రామతీర్థ జలాశయం సహజ సిద్ధంగా ఉన్న ఎర్ర, నల్ల కొండల మధ్య సుమారుగా 1100 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయవచ్చు. రిజర్వాయర్లో ఏడాది పొడవునా నీరు ఉంటున్న పరిస్థితుల్లో బోటింగ్కు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యానవనాలు ఏర్పాటు చేసేందుకు రెండు కట్టలకు సమీపంలోనే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. గతంలో కట్టలపై పనులు చేపట్టినా ప్రస్తుతం విద్యుత్తు వసతి లేకపోవడంతో గతంలో ఏర్పాటు చేసిన దీపాల ఆనవాళ్లే కనుమరుగవుతున్నాయి. గతంలో ఎంతో సుందరంగా ఉన్న పైలాన్ ప్రాంతం ప్రస్తుతం పిచ్చిమొక్కలకు నిలయంగా మారింది. సాగర్ కాలువపై సుమారుగా 40 సంవత్సరాల కిందట నిర్మాణం చేసిన రాతివంతెన తప్ప పూర్తిస్థాయిలో వంతెన నిర్మాణం చేపట్టలేదు. గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసినా జగన్ ప్రభుత్వం పనులు ప్రారంభించిన దాఖాలాలు లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న కళ్లలో ఆనందం.. పొద్దంతా ఏడిపింఛను కుతంత్రం
[ 30-04-2024]
మీ బిడ్డనంటూ జగన్ నటిస్తూ కపట మాటలు చెబుతారు. చేతల్లో అబద్ధాలని జనానికి తెలియగానే అస్మదీయ అధికార గణం రంగంలోకి దిగుతుంది. మరో జగన్నాటకానికి తెర లేపుతుంది. అన్న కళ్లలో ఆనందం కోసం పరితపిస్తుంది. -
అబద్ధాల అన్నొస్తున్నాహో!
[ 30-04-2024]
జగన్నాటకం మళ్లీ మొదలైంది. ఎన్నికలకు పక్షం రోజులే ఉండటంతో ఓటర్ల కళ్లకు గంతలు కట్టేందుకు ఆయన జనం చెంతకు వస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీలు గుప్పించి అధికార పీఠమెక్కి..ఆ తర్వాత ఒక్కటీ నెరవేర్చలేదు. -
‘మహిళా భేరి’ మోగిద్దాం.. అరాచక పాలన తరుముదాం
[ 30-04-2024]
‘పాలకులను నిర్ణయించేది మహిళలే.. వారి చేతుల్లోనే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఉంది. అభివృద్ధికి ఓటేసి.. అరాచకాన్ని తరమాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెదేపా కొండపి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు. -
హవ్వ.. భావి పౌరుల భుజాలపై జెండాలా!
[ 30-04-2024]
అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మానవత్వం మరణించింది !
[ 30-04-2024]
వందలాది మంది సాక్షిగా మానవత్వం మరణించింది. రక్తమోడుతున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడి మృతి
[ 30-04-2024]
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. -
సార్వత్రిక రణం.. హోరెత్తనున్న ప్రచార పర్వం
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలై ఈ నెల 25 వరకు కొనసాగింది. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి 32 మంది 61 సెట్లు దాఖలు చేశారు. -
ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 30-04-2024]
రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. -
తనిఖీల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు
[ 30-04-2024]
ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల ప్రత్యేక సాధారణ పరిశీలకుడు శ్రీరామ్ మోహన్ మిశ్రా సూచించారు. -
చెల్లని చెక్కు కేసులో నిందితుడికి జైలు
[ 30-04-2024]
చెల్లని చెక్కు కేసులో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. సీఎస్పురం మండలం అరివేముల గ్రామానికి చెందిన అన్నపురెడ్డి పరమేశ్వరరెడ్డి వెలిగండ్ల మండలం
తాజా వార్తలు (Latest News)
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత