కీలక ఘట్టం ఆరంభం
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు.
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టరేట్లోని ఛాంబర్లో కలెక్టర్ దినేష్ కుమార్., అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒంగోలు, కనిగిరి ఆర్డీవో కార్యాలయాలు; మార్కాపురం ఉప కలెక్టర్ కార్యాలయం, సంతనూతలపాడుకు చీమకుర్తిలోని తహసీల్దార్ కార్యాలయం, యర్రగొండపాలెంలో స్త్రీశక్తి భవన్, దర్శి, గిద్దలూరు, కొండపి నియోజకవర్గాలకు సంబంధించి ఆయా మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో స్వీకరిస్తారు. జిల్లా వ్యాప్తంగా 2,183 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనుండగా, అందుకు అవసరమైన పీవో, ఏపీవో, ఓపీవోలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.
32 వేల పోస్టల్ బ్యాలెట్లు...: ఎన్నికల విధులకు సంబంధించిన పోలింగ్ సిబ్బందిని ఇప్పటికే గుర్తించి వారికి శిక్షణ పూర్తి చేశారు. వీరందరికీ ఓటు హక్కు నిమిత్తం పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. 14,500 మంది పోలింగ్ సిబ్బంది, అయిదు వేల మంది పోలీసులు, ఇతర ఉద్యోగులు; 6,802 సర్వీసు ఓటర్లు, 5,698 విభిన్న ప్రతిభావంతులు, 85 సంవత్సరాల పైబడిన ఓటర్లు ఉండనున్నట్లు అధికారుల అంచనా. ఈ సారి ఎన్నికల విధుల్లో పాల్గొనున్న పాత్రికేయులకు(ఈసీ గుర్తింపు) కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వనున్నారు.
ఇంటి వద్దకే రానున్న ఓటు...: పోలింగ్ సిబ్బందికి మే 3 నుంచి 5 వరకు; విభిన్న ప్రతిభావంతులు, వృద్ధులకు 4 నుంచి 9వ తేదీలోపు ఇంటి వద్దనే ఓటింగ్ కార్యక్రమం అమలు చేసేలా ముందస్తు ప్రణాళిక చేశారు. పోస్టల్ బ్యాలెట్ కావాలనుకునేవారు ఈ నెల 22వ తేదీలోపు ఫారం-12డీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తేదీల్లోనే ఎక్కువ..!: షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 18, 19, 24, 25 తేదీల్లోనే ప్రధాన పార్టీలతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 19న కొండపి తెదేపా అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, 24న ఒంగోలు అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. 25న మరోసారి భారీ ర్యాలీతో దాఖలు చేసేలా ప్రణాళిక చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న కళ్లలో ఆనందం.. పొద్దంతా ఏడిపింఛను కుతంత్రం
[ 30-04-2024]
మీ బిడ్డనంటూ జగన్ నటిస్తూ కపట మాటలు చెబుతారు. చేతల్లో అబద్ధాలని జనానికి తెలియగానే అస్మదీయ అధికార గణం రంగంలోకి దిగుతుంది. మరో జగన్నాటకానికి తెర లేపుతుంది. అన్న కళ్లలో ఆనందం కోసం పరితపిస్తుంది. -
అబద్ధాల అన్నొస్తున్నాహో!
[ 30-04-2024]
జగన్నాటకం మళ్లీ మొదలైంది. ఎన్నికలకు పక్షం రోజులే ఉండటంతో ఓటర్ల కళ్లకు గంతలు కట్టేందుకు ఆయన జనం చెంతకు వస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీలు గుప్పించి అధికార పీఠమెక్కి..ఆ తర్వాత ఒక్కటీ నెరవేర్చలేదు. -
‘మహిళా భేరి’ మోగిద్దాం.. అరాచక పాలన తరుముదాం
[ 30-04-2024]
‘పాలకులను నిర్ణయించేది మహిళలే.. వారి చేతుల్లోనే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఉంది. అభివృద్ధికి ఓటేసి.. అరాచకాన్ని తరమాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెదేపా కొండపి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు. -
హవ్వ.. భావి పౌరుల భుజాలపై జెండాలా!
[ 30-04-2024]
అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మానవత్వం మరణించింది !
[ 30-04-2024]
వందలాది మంది సాక్షిగా మానవత్వం మరణించింది. రక్తమోడుతున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడి మృతి
[ 30-04-2024]
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. -
సార్వత్రిక రణం.. హోరెత్తనున్న ప్రచార పర్వం
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలై ఈ నెల 25 వరకు కొనసాగింది. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి 32 మంది 61 సెట్లు దాఖలు చేశారు. -
ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 30-04-2024]
రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. -
తనిఖీల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు
[ 30-04-2024]
ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల ప్రత్యేక సాధారణ పరిశీలకుడు శ్రీరామ్ మోహన్ మిశ్రా సూచించారు. -
చెల్లని చెక్కు కేసులో నిందితుడికి జైలు
[ 30-04-2024]
చెల్లని చెక్కు కేసులో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. సీఎస్పురం మండలం అరివేముల గ్రామానికి చెందిన అన్నపురెడ్డి పరమేశ్వరరెడ్డి వెలిగండ్ల మండలం
తాజా వార్తలు (Latest News)
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!