logo

తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని  మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు. 

Published : 19 Apr 2024 02:56 IST

పొదిలి గ్రామీణం, తర్లుపాడు, అర్థవీడు, బేస్తవారపేట, కంభం(రాచర్ల)  

పొదిలి గ్రామీణం : ఉప్పలపాడులో ప్రచారం నిర్వహిస్తున్న  కందుల నారాయణరెడ్డి

రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని  మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.  ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి  మాట్లాడుతూ పశ్చిమప్రకాశం అభివృద్ధి చెందాలంటే వెలిగొండ పూర్తి కావడంతో పాటు, మార్కాపురాన్ని జిల్లా చేయాలన్నారు. దీనికి నారా చంద్రబాబు నాయుడు జిల్లా చేస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారని గుర్తు చేశారు.‌

  • తర్లుపాడులో గురువారం కందుల నారాయణరెడ్డి కుమారుడు రోహిత్‌రెడ్డి తెదేపా, జనసేన, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులతో కలిసి ‘ఇంటింటికి కందుల ప్రచారం’ కార్యక్రమాన్ని చేపట్టారు. ‌
  • అర్థవీడు మండల పరిధిలోని వెలగలపాయ నుంచి నాగులవరం వరకు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి తెదేపా, జనసేన శ్రేణులతో కలసి  గురువారం ప్రచారాన్ని నిర్వహించారు. ‌
  • స్తవారపేట మండలంలోని జేసీ అగ్రహారం, వంగపాడు, కొత్తపల్లె, పాత మల్లాపురం, కొత్త మల్లాపురం గ్రామాల్లో అశోక్‌రెడ్డి తనయుడు దివ్యేష్‌ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
  • రాచర్ల ఎస్‌పీజీ కాలనీ, ఏబీఎస్‌ పాలెం, ఫారంలో ముత్తుముల అశోక్‌రెడ్డి సోదరి గీత ప్రచారం నిర్వహించారు.

 

 

రాచర్ల : కరపత్రాలు పంపిణీ చేస్తున్న తెదేపా అభ్యర్థి అశోక్‌రెడ్డి సోదరి గీత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని