logo

పూర్వ విద్యార్థుల సాయం

మండలంలోని పెద్దసీీది జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం సోమవారం ఇక్కడ ఘనంగా జరిగింది. 1996-97లో పదోతరగతి చదివిన వీరు ప్రధానోపాధ్యాయులు బి.రామ్మూర్తి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 18 Jan 2022 06:20 IST


పాతపట్నం: నాటి గురువులతో పూర్వ విద్యార్థులు

పాతపట్నం, ఎల్‌ఎన్‌పేట, న్యూస్‌టుడే: మండలంలోని పెద్దసీీది జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం సోమవారం ఇక్కడ ఘనంగా జరిగింది. 1996-97లో పదోతరగతి చదివిన వీరు ప్రధానోపాధ్యాయులు బి.రామ్మూర్తి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి రూ.15 వేలు ఆర్థికసాయం చేశారు. ఇటీవల మృతిచెందిన తమ తోటి పూర్వ విద్యార్థులైన బి.నారాయణరావు, ఎం.రామారావు, పి.నరసింహారావు కుటుంబాలకు రూ.1.50 లక్షల ఆర్థిక సాయం చేశారు. నాటి ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ● ఎల్‌ఎన్‌పేటలోని లక్ష్మీనర్సుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో 1996-97లో పదోతరగతి చదివిన విద్యార్థులంతా సోమవారం ఎల్‌ఎన్‌పేట మండలకేంద్రంలో ఓ కల్యాణమండపంలో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆప్పటి ఉపాధ్యాయులను సన్మానించారు. ఈసందర్భంగా ఒక మొక్కను నాటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని