ఎంత పనిచేసినా అంతే..!
రోజంతా మండుటెండలో కష్టపడి పనిచేస్తున్న ఉపాధి పథక కూలీలకు సరైన వేతనం దక్కడం లేదు. చేతులు బొబ్బలెక్కేలా పనిచేస్తున్నా వివరాల నమోదులో తేడానో లేక పనికిరాని వారికీ మస్టర్ల కారణంగానో రోజురోజుకూ కూలీ తగ్గిపోతోందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి పథకంలో దక్కని శ్రమకు తగ్గ ఫలితం
జిల్లా సరాసరి వేతనం రూ.151
ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం
ఎచ్చెర్లకు చెందిన ఉపాధి వేతనదారు ఎస్.రమణమ్మ పదేళ్లుగా పనులకు వెళ్తున్నారు. గతంలో వారానికి రూ.1300-1500 వరకూ వచ్చేది. ఇప్పుడు వారమంతా కష్టపడినా కనీసం రూ.1000 కూడా రావడం లేదు. ఎప్పుడూ చేసినట్టే చేస్తున్నా ఎందుకు తగ్గుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలాసకు సి.చిన్నంనాయుడు గతంలో హైదరాబాద్లో పనిచేసేవారు. కొవిడ్ తర్వాత స్వగ్రామానికి వచ్చి ఉపాధి పనులకు వెళుతున్నారు. కొత్తలో వారానికి కనీసం రూ.1400 వచ్చేది. ఇప్పుడు రూ.900 కూడా రావడం లేదని వాపోతున్నారు.
రోజంతా మండుటెండలో కష్టపడి పనిచేస్తున్న ఉపాధి పథక కూలీలకు సరైన వేతనం దక్కడం లేదు. చేతులు బొబ్బలెక్కేలా పనిచేస్తున్నా వివరాల నమోదులో తేడానో లేక పనికిరాని వారికీ మస్టర్ల కారణంగానో రోజురోజుకూ కూలీ తగ్గిపోతోందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత పనిచేస్తే ఎంత వస్తుందనే విషయం వివరించే వారే కరవయ్యారని వాపోతున్నారు. క్షేత్ర సహాయకుడు చూపించిన పని పూర్తిచేసి వెళ్లడం తప్ప తమకేమీ తెలియడం లేదని వివరిస్తున్నారు.
ఒక్కో శ్రమశక్తి సంఘంలో 30-40 మంది వేతనదారులు, ఒక మేట్ ఉంటారు. జిల్లాలో మొత్తం 5 లక్షల జాబ్ కార్డులుండగా 10 లక్షలకు పైగా కూలీలు నమోదై ఉన్నారు. ఏప్రిల్ రెండో వారం వరకూ రోజుకు 70-80 వేల మంది రోజు పనికి వచ్చేవారు. ఆ సంఖ్య మూడు వారాలుగా పెరుగుతూ ప్రస్తుతం 2.56 లక్షలకు చేరుకుంది. జిల్లాలో ఉన్న వేతనదారులు, అందుబాటులో ఉన్నపని బేరీజు వేస్తే రోజుకు కనీసం 3 లక్షల మందికి పని కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గరిష్ఠం అందేదెప్పుడో..!
వేతనదారులు పొందే వేతనంలో 40 శాతాన్ని మెటీరియల్ కాంపొనెంట్ నిధులుగా కేంద్ర ప్రభుత్వం అదనంగా మంజూరు చేస్తుంది. వాటితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఆస్కారం ఉంది. గతేడాది మొత్తం రూ.425.48 కోట్లు వేతనంగా వేతనదారులు అందుకున్నారు. ఆ ఏడాదికి రోజువారీ సగటు వేతనం రూ.197 ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అది ఇప్పుడు ఏకంగా రూ.151కి పడిపోయింది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికీ రోజువారీగా గరిష్ఠంగా రూ.257 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా జిల్లాలో ఒక్కరంటే ఒక్కరికి ఈస్థాయిలో లేదు.
అవగాహన లేకనే..
క్షేత్రసహాయకులు నాలుగైదు చోట్ల జరుగుతున్న పనులను సమన్వయం చేసుకుంటూ మస్తర్లు తీసుకోవడంలోనే సమయం గడిచిపోతోంది. పనిపై దృష్టిపెట్టే అవకాశం ఉండట్లేదు. వేతనదారులు, మేట్లకు అవగాహన కల్పించేందుకు ఆస్కారం లేదు. రోజువారీ వేతనం భారీగా తగ్గేందుకు ఇదే ప్రధాన కారణం. ఈ అంశంపై అధికారులెవరూ దృష్టి సారించడం లేదు. గతంలో మేట్లు అందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు.
సగటు వేతనం పెంచేలా చర్యలు
రోజువారీ సగటు వేతనం తక్కువగా ఉన్న విషయం వాస్తవమే. దాన్ని ముందుగా రూ.230కి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తున్నాం.
- ఎం.రోజారాణి, పీడీ, డ్వామా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.