దారులా.. డంపింగ్ యార్డులా?
పంచాయతీల్లో పారిశుద్ధ్యం పడకేస్తోంది. పచ్చదనం, పరిశుభ్రతతో స్వాగతం పలకాల్సిన పలు గ్రామీణ దారులు చెత్తతో దర్శనమిస్తున్నాయి. డంపింగ్యార్డులను తలపిస్తున్నాయి. చెత్త ఎక్కడ వేయాలో తెలియక ప్రజలు రహదారులనే ఎంచు కుంటున్నారు. ఈ సమస్య పరిష్కరించాల్సిన పంచాయతీలు పట్టించుకోవడం లేదు.
కాలుష్య కోరల్లో గ్రామాలు
పొంచి ఉన్న అంటువ్యాధులు
- న్యూస్టుడే, పొందూరు, సరుబుజ్జిలి
సారవకోట: జాతీయ రహదారి పక్కన చెత్త నిల్వలు
పంచాయతీల్లో పారిశుద్ధ్యం పడకేస్తోంది. పచ్చదనం, పరిశుభ్రతతో స్వాగతం పలకాల్సిన పలు గ్రామీణ దారులు చెత్తతో దర్శనమిస్తున్నాయి. డంపింగ్యార్డులను తలపిస్తున్నాయి. చెత్త ఎక్కడ వేయాలో తెలియక ప్రజలు రహదారులనే ఎంచు కుంటున్నారు. ఈ సమస్య పరిష్కరించాల్సిన పంచాయతీలు పట్టించుకోవడం లేదు. గ్రామ ముఖ ద్వారంలోనే చెత్త నిల్వలు పేరుకుపోతున్నాయి. దీనికితోడు రహదారుల పక్కన నాటిన మొక్కలు కనిపించడం లేదు. ఫలితంగా కాలుష్యమూ పెరిగిపోతోంది.
అలంకారప్రాయంగా చెత్త సంపద కేంద్రాలు..
పారిశుద్ధ్యం మెరుగు, చెత్త సమస్య పరిష్కారం కోసమని 912 చెత్త సంపద కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం ఉపాధి నిధులు మంజూరు చేసింది. కొన్నిచోట్ల నిర్మాణం పూర్తిచేయలేదు. ఫలితంగా ఇంటింటా సేకరించిన చెత్తను ప్రధాన రహదారుల పక్కనే పడేస్తున్నారు. ఇక్కడ పందులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో ప్రయాణికులు దుర్గంధం భరించలేకపోతున్నారు.
దోమల వృద్ధికి అవకాశం.. వచ్చేది వర్షాకాలం.. అపరిశుభ్రత ఇలానే ఉంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని వైద్యులు పేర్కొంటు న్నారు. రహదారుల పక్కన చెత్త నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతున్నాయి.
సరుబుజ్జిలి మండలం విజయరాంపురం గ్రామంలో చెత్త నుంచి సంపద కేంద్రం ఇది. 2018లో రూ.2,87,528 నిధులతో నిర్మించారు. అప్పటి నుంచి దీనిని ఉపయోగించకపోవడంతో నిరుపయోగంగా మారింది. దీంతో గ్రామ పరిసరాల్లో రహదారుల పక్కనే చెత్త నిల్వలు దర్శనమిస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుకు పంచాయతీలు రూ.లక్షలు వ్యయం చేస్తున్నా ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. పేరుకుపోయిన చెత్తకుప్పలు, నిలిచిన మురుగు, కంపుకొడుతున్న కాలువలే కనిపిస్తున్నాయి. ఈ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అరకొర పనులతో సరిపెడుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది కొరత, నిధుల లేమి సమస్యలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. గ్రామాల్లో ఇంటి చెత్త, ఇతర వ్యర్థాలు వేసుకునేందుకు సరైన సౌకర్యం ఉండటం లేదు.
కొన్నిచోట్ల పరిశీలన చేయగా..
పొందూరు మండలం: పొందూరు, కింతలి, రాపాక, లోలుగు, దల్లవలస, వి.ఆర్.గూడాం, లచ్చయ్యపేట, తాడివలస, కనిమెట్ట, బురిడికంచరాం, తదితర గ్రామాల్లో రహదారుల పక్కన చెత్త పోస్తున్నారు. స్థానికులు, వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు.
ఆమదాలవలస: కొండంపేట, బొబ్బిలిపేట, శ్రీహరిపురం, వన్నవలస, అక్కులపేట, మెల్లిపర్తి, తురకపేట, పైలాడ, కుమ్మరిపేట, బెలమాం గ్రామాల్లో రోడ్ల పక్కనే పడేస్తున్నారు .
బూర్జ : మామిడివలస, పెద్దలంకాం, పి.డి.ఆర్.రాజుపేట, అన్నంపేట, తోటవాడ, లక్కుపురం, పనుకుపట్ట, డొంకలపర్త, గుత్తావిల్లిలోనూ ఇదే దుస్థితి.
సరుబుజ్జిలి : ఎల్.కె.పల్లి, కూనజమన్నపేట, సుభద్రపురం, కొత్తకోట, గోనుపాడు, యరగాం, సుబ్బపేట, సింధువాడ దారుల పక్కన చెత్త కుప్పలు స్థానికులను ఇబ్బంది పెడుతున్నాయి.
ఎల్.ఎన్.పేట : పూసాం, బొత్తడసింగి, ఎల్.ఎన్.పేట, గొట్టిపల్లి, డొంకలపడవంజా, తురకపేట, సిద్ధాంతం, తదితర గ్రామాల్లో రోడ్ల పక్కనే వేస్తున్నారు.
పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తాం..
గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపడుతున్నాం. దీనిపై మండల అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పూర్తిచేసి రహదారుల పక్కన చెత్త నిల్వలు లేకుండా చూస్తాం.- రవికుమార్, - జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.