యువకలల సాకారానికి.. వజ్రసంకల్పమే...లక్ష్యం కావాలి
తన బిడ్డలందరికీ ఉపాధి కల్పించగల సత్తా జిల్లాకుంది. అందుకు అవసరమైన వనరులూ ఇక్కడున్నాయి. వినియోగించుకోవడమే కావాల్సింది. స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 75 ఏళ్ల కాలంలో అందుకు కొంత ప్రయత్నం జరిగినా చేయాల్సింది చాలానే ఉంది.
న్యూస్టుడే, పాతశ్రీకాకుళం, సోంపేట
తన బిడ్డలందరికీ ఉపాధి కల్పించగల సత్తా జిల్లాకుంది. అందుకు అవసరమైన వనరులూ ఇక్కడున్నాయి. వినియోగించుకోవడమే కావాల్సింది. స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 75 ఏళ్ల కాలంలో అందుకు కొంత ప్రయత్నం జరిగినా చేయాల్సింది చాలానే ఉంది. జిల్లా నుంచి ఉపాధి వలసలను ఆపాలంటే.. ముఖ్యంగా తమశక్తిని సద్వినియోగం చేసుకోవాలంటే వజ్రోత్సవ వేళ నాయకులు ఈ విషయాలపై ఆలోచించాల్సిన అవసరముందని జిల్లా యువత కోరుకుంటోంది.
పర్యాటకం.. అవకాశాలు పుష్కలం..
జిల్లాలో 193 కిలోమీటర్ల మేర తీర ప్రాంతముంది. బారువ, బావనపాడు, కళింగపట్నం తదితర ఆరు పెద్ద బీచ్లు, 30కిపైగా చిన్నాచితకా బీచ్లో ఉన్నాయి. రోజుకు సుమారు 15 వేల మంది సందర్శిస్తున్నా.. ఎక్కడా తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా ఇక్కడ లభ్యంకాదు. ఆయా ప్రాంతాల్లో ఆహారపదార్థాల విక్రయాలు, బస చేసేందుకు అవసరమైన లాడ్జిలు, హోటళ్లు, ఉల్లాసం పంచే సాధనాలు ఏర్పాటు చేస్తే కనీసం 5 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుంది. వంశధార జలాశయం, సోంపేట బీల ప్రాంతాలను కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశముంది.
అదనపు ఉపాధికి అవకాశం..
జిల్లాలో రెండు లక్షల మంది మత్స్యకారుల్లో యాభైవేల మంది వేటపైనే ఆధారపడుతున్నారు. వీరిలో ఇక్కడ ఉపాధి లభించక 30 వేల మంది వలస వెళుతున్న పరిస్థితి. బుడగట్లపాలెం, భావనపాడు, నువ్వలరేవు జెట్టీలు ఏర్పాటుచేసి, అధునిక వేట పద్ధతుల్లో శిక్షణ ఇచ్చి పరికరాలు సమకూర్చితే మన మత్స్యకారులు వలసవెళ్లే పరిస్థితే ఉండదు. అదనంగా మత్స్య ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతి చేయగలిగితే సుమారు 5 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు.
సాంకేతికతతో కూడిన నైపుణ్యం
జిల్లాకు సాంకేతిక నైపుణ్య శిక్షణా సంస్థలు ఒక్కటీ లేవు. ఏటా సుమారు 15 వేల మంది పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కోర్సుల చేసి నైపుణ్య శిక్షణకు వేర్వేరు ప్రాంతాలకు వలస వెళుతున్న పరిస్థితి ఉంది. ఇంతేమంది గ్రాడ్యుయేట్లు ఏటా తయారవుతున్నారు. ఇక్కడే శిక్షణ ఇప్పించగలిగే వారి ఉపాధి అవకాశాలను మరింత పెంపొందే అవకాశముంది. దీనికి ప్రభుత్వపరమైన తోడ్పాటు కూడా అవసరం. అప్పుడే మన యువకులు ఎక్కడైనా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు.
ప్రోత్సాహం అవసరం..
జిల్లాలో 30 భారీ, రెండు వేలకుపైగా చిన్నాచితకా పరిశ్రమలు లక్షమందికిపైగా ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇందులో సగం మంది జిల్లావాసులు ఉపాధి పొందుతున్నారు. కాగా జిల్లాకు చెందిన యువత ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు కల్పిస్తున్న అవకాశాలు, ప్రోత్సాహం పెరగాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం నుంచి సాంకేతిక సహకారం అందాలి. అనుమతుల జారీ సులభతరం చేయాలి. ఉపాధి ఆధారిత కోర్సులు అందించే విద్యాసంస్థల ఏర్పాటును పెంచాలి.
మనమే ఎగుమతి చేయాలి...
జిల్లాలో 4.90 లక్షల ఎకరాల్లో వరి పండుతోంది. ఉద్దానం ప్రాంతంలో 52 వేల ఎకరాల్లో కొబ్బరి పండుతోంది. ఇంకా పప్పుదినుసులు, కూరగాయలు, పనస, అనాస విరివిగా పండిస్తున్నారు. వీటికి సంబంధించి ఎలాంటి ప్రాసెసింగ్, అనుబంధ పరిశ్రమలు జిల్లాలో లేవు. వీటిని అవసరం ఉంది. ఏర్పాటైతే వేల మందికి ఉపాధి కల్పించవచ్చు. గ్రానైట్ పరిశ్రమ ఉంది. పొందూరు ఖాదీ ఉత్పత్తులున్నాయి. బుడితిలో ఇత్తడి పరిశ్రమ ఉంది. వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే ఉపాధికి కొదవుండదు.
సద్వినియోగం చేసుకోండి..
జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను పాలకులు, ఉన్నతాధికారులు సద్వినియోగం చేసుకుని యువతను ప్రోత్సహించాలి. అప్పుడే వారికి మెరుగైన ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురాగలం. పోర్టుల అభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాట్లు, జిల్లా ప్రత్యేక ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి పెట్టాలి. జిల్లా యువతలో నెల జీతానికి పనిచేద్దామనే ధోరణిని పారదోలి పారిశ్రామికవేత్తల స్థాయి ఆలోచనలు తీసుకురాగలగాలి. - తమ్మినేని కామరాజు, మాజీ రిజిస్ట్రార్, బీఆర్ఏయూ
ఇదీ మా అంతరంగం
సర్వేలో జిల్లా యువత మనోగతం
- ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, న్యూస్టుడే, బృందం
అభివృద్ధి అథమస్థాయికి చేరువకావాలి... పరిశ్రమల స్థాపనకు ఊతమివ్వాలి... పార్టీలూ మా ప్రాధాన్యతను పూర్తిస్థాయిలో గుర్తించాలి... ఉద్యోగావకాశాలు పెరగాలి... మారుతున్న సాంకేతిక మాకు సత్వరం అందుబాటులోకి రావాలి... వీటిని సమకూర్చండి.. మా సత్తా చాటుతాం అంటున్నారు.. ఈ వజ్రోత్సవాన మా ఆలోచనలకు మెరుగుపెట్టే అవకాశాలు మాకు కల్పించండి అంటున్నారు. ఈ విషయం ‘న్యూస్టుడే’ ఈ నెల 13న నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 100 మంది చొప్పున మొత్తం 800 మంది యువతతో సర్వే నిర్వహించగా వచ్చిన ఫలితాలిలా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.