కాశీపురంలో ఉపాధి మేత..!
ఉపాధి హామీ పథకంలో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శించి నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. నచ్చిన పేర్లతో వాడుకుని పనికి రాకున్నా వచ్చినట్లు చూపి వేతదారుల కష్టాన్ని జేబులో వేసుకుంటున్నారు.
క్షేత్ర సహాయకుడి చేతివాటం, పక్కదారి పట్టిన నిధులు
న్యూస్టుడే, టెక్కలి, సంతబొమ్మాళి
ఆరోపిస్తున్న గ్రామస్థులు
ఉపాధి హామీ పథకంలో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శించి నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. నచ్చిన పేర్లతో వాడుకుని పనికి రాకున్నా వచ్చినట్లు చూపి వేతదారుల కష్టాన్ని జేబులో వేసుకుంటున్నారు. సంతబొమ్మాళి మండలంలోని కోటపాడు పంచాయతీ కాశీపురంలో వెలుగులోకి వచ్చిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ.
వెళ్లకున్నా..: కోటపాడు పంచాయతీ పరిధిలో 596 జాబ్కార్డులున్నాయి. 2019-20లో రూ.82.82 లక్షల విలువైన పనులు జరిగాయి. 2020-21లో రూ.89.44 లక్షలు, 2021-22లో రూ.74.49 లక్షలు వేతనాల రూపంలో చెల్లించారు. పనికి వెళ్లని.. గ్రామం వెలుపల ఉన్న వారి పేరిట మస్తర్లు నమోదవుతున్నాయి. దీంతో పనికి వెళ్తున్నవారి వేతనాలు తగ్గిపోతున్నాయి. పనిలోకి రాని వారికి కొంత సొమ్ము ఇచ్చి మిగిలిన మొత్తాన్ని క్షేత్ర సహాయకుడు తీసుకుంటున్నాడని వేతనదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పని కల్పించాలంటే వేతనదారుల నుంచి వారానికి రూ.200 ప్రతి శనివారం మధ్యాహ్నం క్షేత్రసహాయకుడి అనుచరుడు వసూలు చేస్తారని, అలా ఇచ్చినవారికే మస్తర్లు నమోదవుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం క్షేత్ర సహాయకుడిగా పని చేస్తున్న వ్యక్తి గతంలో రెండుసార్లు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యాడని, మళ్లీ అతనికే అధికారులు అవకాశం కల్పించడంతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు.
లమ్మత కృష్ణారావు మూడేళ్లుగా పనికిరాకపోయినా వెళ్లినట్లు మస్తర్లో నమోదైన దృశ్యం
నా పేరు లమ్మత కృష్ణారావు. మాది కాశీపురం. మూడేళ్ల కిందట ప్రమాదవశాత్తు పడిపోవడంతో మక్క జారిపోయింది. మంచం నుంచి కిందకు దిగాలంటే మరొకరి సాయం అవసరం. నేను ఉపాధి హామీ పనికి వెళ్తున్నట్లు మస్తర్ వేస్తున్నారు. వచ్చిన వేతనాన్ని వసూలు చేసుకొనే పద్ధతిలో ఇప్పటివరకు రూ.రెండు వేలు ఇచ్చారు. మిగిలిన సొమ్ము ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడే తీసుకున్నాడు.
నా పేరు అట్టాడ అప్పమ్మ. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నా. మూడేళ్లుగా ఉపాధి హామీ పనులకు వెళ్లడం లేదు. మస్తర్లో మాత్రం నా పేరు రాస్తున్నారు. నావద్దకు వచ్చి వేలిముద్ర వేయించుకునేటప్పుడు ప్రతిసారీ రూ.50 ఇస్తున్నారు.
నా పేరు లమ్మత నాగరత్నం. మా ఇద్దరు కుమారుల్లో ఒకరు అమెరికాలో స్థిరపడ్డారు. మరొకరు హైదరాబాద్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నారు. కుమార్తె కూడా అక్కడే స్థిరపడ్డారు. గ్రామంలో 12 ఎకరాల వరకు పొలం ఉంది. భార్యాభర్తలం ఏరోజూ సొంత పొలానికే పనికివెళ్లం. మేమిద్దరం ఉపాధి పనికి వెళ్తున్నామని మస్తర్లో మా పేర్లు రాస్తున్నారు. ఇటీవల నా భర్త పేరిట రూ.10 వేలు, నా పేరిట రూ.6 వేలు వచ్చాయి. ఆ మొత్తం మస్తర్లు వేసిన వారికే చేరింది.
గ్రామానికి చెందిన మురపాల అప్పారావు నెల రోజుల క్రితం వరకు దుబాయిలో ఉండేవారు. రెండేళ్లుగా ఆయన పేరు మస్తర్లో నమోదైంది.
విచారించి చర్యలు: కాశీపురంలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై పంచాయతీ కేంద్రం కోటపాడులో గ్రామసభ నిర్వహిస్తే కాశీపురం గ్రామస్థులెవరూ హాజరుకాలేదు. కాశీపురంలో గ్రామసభ నిర్వహించాలని కోరారు. అక్కడ విచారించి చర్యలు తీసుకుంటాం.
జి.ఉమాసుందరి, ఎంపీడీవో, సంతబొమ్మాళి
పనికి వెళ్లలేదు: నా కుమారుడు రాజాంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య కూడా అక్కడే ఉంటోంది. మార్చి 19 వరకు వారిద్దరి పేర్లు మస్తర్లో నమోదయ్యాయి.
మార్పు అప్పారావు, గ్రామస్థుడు
ప్రజాధనం దుర్వినియోగం: 2022లో ఒక్కరోజూ నేను పనికి వెళ్లలేదు. వారానికి రూ.200 ఇస్తే రూ.ఎనిమిది వేల వరకు నా పేరిట వేతనం మంజూరైంది.
మార్పు భీమారావు, గ్రామస్థుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!