కాలం చెల్లిన బస్సులతోనే కాలయాపన
ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది.
కొత్తవి రావు.. అద్దెవే దిక్కు
జిల్లాలోని ఆర్టీసీ తీరు
కాలం తీరినా ఇంకా తిప్పుతున్న బస్సు
న్యూస్టుడే, అరసవల్లి: ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది. ఏ క్షణాన ఏ చోట బస్సు నిలిచిపోతుందో తెలియని పరిస్థితి. అయినా సరే వాటిని రోడ్లపైనే తిప్పుతున్నారు. 15 లక్షల కిలోమీటర్లు తిరిగితే నిలిపివేయాల్సి ఉంది. జిల్లాలో నాలుగు డిపోల పరిధిలో అలాంటివి చాలావరకు ఉండగా వినియోగంలోనే ఉంచుతున్నారు. ఇటీవల కాలంలో పల్లెవెలుగు పేరుతో గ్రామీణ ప్రాంతాలకు తిప్పుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సొంతవి సమకూర్చుకోలేక అద్దె బస్సులతో గడిపేస్తున్నారు.
వేధిస్తున్న మెకానిక్ల కొరత..
కొత్త బస్సులు అందుబాటులో లేవు సరికదా ఉన్నవాటిని మెరుగైన కండీషన్లో ఉంచేందుకు మెకానిక్లు అవసరం. కాని జిల్లాలో పరిధిలో ఉన్న డిపోల్లో ఎక్కడా సరిపడా మెకానిక్లు లేరు. పొరుగుసేవల విధానంలో తీసుకున్నప్పటికీ చాలావరకు ఖాళీలున్నాయి. వాహనాలకు మరమ్మతులు చేసినప్పటికీ కాలం చెల్లిపోవడంతో ఎక్కడికక్కడే మొరాయిస్తూనే ఉన్నాయి. ఒక మెకానిక్ రోజుకు 4 బస్సుల వరకు కండీషన్ను పరిశీలించి మరమ్మతులు చేయాలి. ఆరింటికి పైగా మరమ్మతులు చేయడంతో ఒత్తిడికు గురవుతున్నారు. నిపుణులైన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. సిబ్బంది పనిచేసేందుకు అవసరమైన పనిముట్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. కొన్ని బస్సులకు ఆకస్మికంగా మరమ్మతులకు గురైతే వాటి స్థానంలో కొత్త పరికరం వేయాల్సి ఉంటుంది. ఇవి స్థానికంగా లభ్యంకాకపోవడం మరో సమస్యగా మారింది.
ఇటీవల జరిగిన ఘటనలిలా..
ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. విశాఖ నగర పరిధిలో శ్రీకాకుళం - విశాఖ నాన్స్టాప్ బస్సు నిలిచిపోయింది. ప్రయాణికులు అసహనం వ్యక్తం చేయడంతో వేరే బస్సులో వారందరినీ శ్రీకాకుళం తీసుకొచ్చారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్లే నాన్స్టాప్ బస్సు ఎచ్చెర్ల దాటాక ఆకస్మికంగా ఆగిపోయింది. పల్లెవెలుగు బస్సులు చాలాచోట్ల మొరాయిస్తూనే ఉన్నాయి.
కండీషన్లో ఉండే బస్సులే నడుపుతున్నాం..
జిల్లాలో ప్రతి డిపోకు పదిచొప్పున కొత్త బస్సుల కోసం ప్రతిపాదనలు పంపారు. ఇంకా మంజూరు కాలేదు. ప్రస్తుతానికి మంచి కండీషన్లో ఉన్నవాటినే డ్రైవర్లకు ఇస్తున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
ఎ.విజయ్కుమార్, జిల్లా ప్రజారవాణాధికారి, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నొచ్చాడు.. అడ్డంగా బాదేశాడు..!
[ 28-04-2024]
‘అన్నొస్తున్నాడని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పిండి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్తు ఛార్జీలు తగ్గించేస్తామని కూడా గట్టిగా చెప్పండి’ అని సీఎం జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఊరూరా ఊదరగొట్టారు. -
మీరేం అభివృద్ధి చేశారు..?
[ 28-04-2024]
సంతబొమ్మాళి మండలం కూర్మనాథపురంలో గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన యువకులపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శనివారం సాయంత్రం కూర్మనాథపురంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. -
ఉప్పుగెడ్డపై వంతెన.. ఉత్తమాటేనా?
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా హయాంలో ప్రారంభించిన పనులను ఎలాగో గాలికొదిలేసింది. కనీసం వారి పాలనలో చేపట్టిన పనులను సైతం పూర్తి చేయలేకపోయారు. -
మాకొద్దీ వైకాపా..!
[ 28-04-2024]
జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ మంచివారు.. సౌమ్యులు.. బాగా పనిచేస్తారు.. అంటూ కితాబిచ్చినా, మెచ్చుకున్నా ఆ పార్టీ శ్రేణుల్లో మాత్రం వారిపట్ల విశ్వసనీయత కనిపించడం లేదు.. -
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ
[ 28-04-2024]
పలాస నియోజకవర్గంలోని కొండలు, చెరువులను మింగేస్తున్న మంత్రి అప్పలరాజును ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. -
తెదేపాలోకి జోరుగా చేరికలు
[ 28-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పొందూరు మేజర్ పంచాయతీ పరిధిలో లక్ష్మిపేటలో 50 కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ సమక్షంలో తేదేపాలో చేరాయి. -
సమన్వయంతో పని చేయండి
[ 28-04-2024]
జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రానున్న రెండు వారాల పాటు సమన్వయంతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి సూచించారు. -
సామూహిక నిర్లక్ష్యం
[ 28-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులతో గ్రామాల్లో ఆరుబయట మలవిసర్జన నిర్మూలించేందుకు రూ.కోట్ల వ్యయంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. -
కన్నీటి శోకం..
[ 28-04-2024]
గార మండలం తూలుగు కూడలి సమీపంలో సీఎస్పీ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గార గ్రామానికి చెందిన మార్పు రమణమూర్తి కుమారుడు ఓందత్తకుమార్ (19) ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి కొర్ని వస్తున్న మినీ లగేజి వాహనం బలంగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై కాళ్లు, చేతులు విరిగిపోయాయి. -
ఛార్జీల పోటు.. అదే జగనన్న రూటు
[ 28-04-2024]
ఛార్జీల పేరిట జగనన్న ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటోంది. నిత్యావసరాలు, బస్సు ఛార్జీల పెరుగుదల ఇలా ఏది తీసుకున్నా.. ప్రజలకు షాక్ తప్పడం లేదు. విద్యుత్తు ఛార్జీల విషయంలోనూ అంతే. -
తెదేపాతోనే అభివృద్ధి
[ 28-04-2024]
ప్రజలు ఆలోచించి ఓటేయాలని తెదేపా నాయకులు ప్రజలకు సూచించారు. తెదేపా అధికారంలోకి వస్తే రాష్ట్రం బంగారుమయం అవుతుందన్నారు. అభివృద్ధి పరుగులు తీస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్