తెదేపాలోకి జోరుగా చేరికలు
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పొందూరు మేజర్ పంచాయతీ పరిధిలో లక్ష్మిపేటలో 50 కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ సమక్షంలో తేదేపాలో చేరాయి.
పొందూరు: లక్ష్మిపేటలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా శ్రేణులు
పొందూరు, గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్టుడే: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పొందూరు మేజర్ పంచాయతీ పరిధిలో లక్ష్మిపేటలో 50 కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ సమక్షంలో తేదేపాలో చేరాయి. అలాగే పొందూరు పట్టణంలో 40 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలోకి చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్-6 పథకాలకు జనంలో ఆదరణ లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రామ్మోహన్, పట్టణ అధ్యక్షుడు చినరంగ, శంకర్భాస్కర్, బాడాన శేషగిరినాయుడు, ఎంపీటీసీ సభ్యులు ఎ.వాణి, బాడాన హారిక, విజయలక్ష్మి, తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.
- శ్రీకాకుళం నగరంలోని 26వ డివిజన్లో శ్రీశయన సామాజిక వర్గం నుంచి సంఘ నేత రాయిపిల్లి అర్జున్ నాయకత్వంలో పలువురు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. స్థానిక రామమందిరం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో శ్రీకాకుళం అసెంబ్లీ కూటమి ఎమ్యెల్యే అభ్యర్థి గొండు శంకరరావు సమక్షంలో 400 మంది తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. డివిజన్ ఇన్ఛార్జి ఉంగటి వెంకటరమణ పాల్గొన్నారు.
- శ్రీకాకుళం పురపాలిక మాజీ ఛైర్మన్ దివంగత అంధవరపు వరహా నరసింహం కుటుంబం ఆదివారం వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకోనుంది. ఈ విషయాన్ని వరం తనయుడు అంధవరపు ప్రసాద్ తెలిపారు. 2000 నుంచి 2005 వరకు తన సోదరి పైడిశెట్టి జయంతి తెదేపా హయాంలో మున్సిపల్ ఛైర్పర్సన్గా సేవలందించారని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్- 6 పథకాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని విశ్వసిస్తూ తెదేపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. నాన్న అభిమానులు, సన్నిహితులు అభిప్రాయం మేరకు ఆదివారం ఉదయం 9 గంటలకు ఎంపీ రామ్మోహన్నాయుడు, శ్రీకాకుళం అసెంబ్లీ కూటమి అభ్యర్థి గొండు శంకరరావు సమక్షంలో తనతో పాటు జయంతి, సోదరుడు సంతోష్ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ భక్షకులు
[ 10-05-2024]
అయిదేళ్లపాటు అవినీతి లేని పాలన అందించామంటూ సీఎం జగన్, వైకాపా నాయకులు ప్రచారాల్లో గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో కొందరు ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల దందాలు సాగించారు. -
అధ్యక్షా.. ఆమదాలవలసకు ఏం చేశారు?
[ 10-05-2024]
శాసనసభ సభాపతి అంటే ముఖ్యమంత్రి సైతం అధ్యక్షా అని పిలిచే పదవి. అంతటి హోదాలో ఉన్న వ్యక్తి నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలి. ఐదేళ్ల పాలనలో స్వలాభం పైనే ధ్యాస పెట్టారు.. అభివృద్ధి ఊసే మరిచిపోయారు. -
ఐటీడీఏను వెళ్లగొట్టారు..!
[ 10-05-2024]
‘నా ఎస్సీలు..నా ఎస్టీలు..నా బీసీలు’ అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రసంగాల్లో ప్రేమ కురిపిస్తారు. వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నట్లు నమ్మిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి కనీస భరోసా దక్కడం లేదు. -
ఇంటింటిపై జగన్ బాదుడు
[ 10-05-2024]
శ్రీకాకుళం నగరం ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న విజయ్భాస్కర్ దంపతులు ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నారు. నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తున్నారు. వృద్ధురాలైన తల్లి, కుమార్తెతో కలిసి సొంతింటిలో జీవనం సాగిస్తున్నారు. -
పోలింగ్కు 48 గంటల ముందు కీలకం
[ 10-05-2024]
పోలింగ్ ప్రక్రియకు 48 గంటల ముందు అత్యంత కీలకమని, ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను అనుసరించి సిబ్బంది పని చేయాలని ఎన్నికల పరిశీలకుడు శేఖర్ విద్యార్థి పేర్కొన్నారు. -
త్వరలోనే రామరాజ్యం
[ 10-05-2024]
రాష్ట్రానికి పట్టిన పీడ మరికొన్ని రోజుల్లో విరగడ కానుందని, త్వరలోనే రామరాజ్యం రాబోతోందని ఎంపీ రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. మొన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఇక వార్ వన్సైడ్ అయిపోయినట్లు తెలుస్తోందన్నారు. -
నెలకు రూ.4,000 పింఛను
[ 10-05-2024]
తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్సిక్స్ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని పలాస, ఇచ్ఛాపురం అభ్యర్థులు శిరీష, అశోక్ తెలిపారు. రెండు నియోజక వర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. -
మేము రాలేం.. మీరు వెళ్లండి..!
[ 10-05-2024]
శ్రీకాకుళం నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ప్రచార కార్యక్రమాలకు ఆదరణ తగ్గుతోంది. నిత్యం ఆయన వెంట తిరిగే భజన బృందాలే ప్రచారాల్లో కనిపిస్తున్నాయి. స్థానిక ప్రజలు మాత్రం దూరంగా ఉంటున్నారు. -
నెమలి పింఛంపై అప్పన్న నిజ రూపం
[ 10-05-2024]
అరసవల్లికి చెందిన ప్రముఖ సూక్ష్మ చిత్రకారుడు వాడాడ రాహుల్ పట్నాయిక్ నెమలి పింఛంపై గీసిన సింహాద్రి అప్పన్న నిజరూపం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. -
అరసవల్లిలో ద్విశతావధానం
[ 10-05-2024]
తెలుగు భాష, సాహిత్యం, అవధానం వంటి ప్రక్రియల పట్ల యువతకు ఆసక్తి కలిగించేందుకు అరసవల్లిలో ద్విశతావధానం నిర్వహించనున్నట్లు సుమిత్ర కళాసమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్