logo

చంద్రబాబుతోనే సంక్షేమ పాలన: ఎంపీ

చంద్రబాబుతోనే సంక్షేమ పాలన సాధ్యమని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం గ్రామంలో బుధవారం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌తో కలిసి ప్రచార ర్యాలీ నిర్వహించారు.

Published : 18 Apr 2024 05:59 IST

ప్రజలకు అభివాదం చేస్తున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు, చిత్రంలో తెదేపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌, తదితరులు
కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: చంద్రబాబుతోనే సంక్షేమ పాలన సాధ్యమని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం గ్రామంలో బుధవారం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌తో కలిసి ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైకాపా పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం చేయలేని దుస్థితిలో మంత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు. కనీసం వీధి దీపాలు కూడా వేయించలేని వారు జిల్లాను ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అయిదేళ్లలో శ్రీకాకుళం- ఆమదాలవలస రహదారి వేయలేకపోయారని దుయ్యబట్టారు. ఆ రహదారిలో ఎంతో మంది ప్రాణాలు పోయినా పట్టించుకోలేదన్నారు. సీఎం రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారన్నారు. అంతకుముందు సింగుపురం సర్పంచి గుండ ఆదిత్యనాయుడుతో పాటు పలువురు వార్డు సభ్యులు, వంద కుటుంబాలు వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నాయి.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని