Shashikala- Vijayashanthi: శశికళతో విజయశాంతి రహస్య భేటీ?
జయలలిత నెచ్చెలి శశికళతో భాజపా నాయకురాలు, ప్రముఖ నటి విజయశాంతి రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా తన తదుపరి రాజకీయ ప్రయాణం గురించి విజయశాంతిలో శశికళ సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది.
సైదాపేట, న్యూస్టుడే: జయలలిత నెచ్చెలి శశికళతో భాజపా నాయకురాలు, ప్రముఖ నటి విజయశాంతి రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా తన తదుపరి రాజకీయ ప్రయాణం గురించి విజయశాంతిలో శశికళ సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల శశికళ తన మద్దతుదారుల ఇంట కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అప్పుడు విలేకర్లను కలిసి మాట్లాడుతున్నారు. కొన్ని నెలల క్రితం ఆధ్యాత్మిక యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాలను సందర్శించారు. పలు చోట్ల మద్దతుదారులను కలిసి ఆ సమయంలో మాట్లాడారు. రాజకీయ ప్రయాణం మళ్లీ ప్రారంభిస్తానని, అన్నాడీఎంకేకు తాను నాయకత్వం వహించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని ఇటీవల ఆమె చెప్పారు. పలువురు అన్నాడీఎంకే నేతలు తనను సంప్రదిస్తున్నారని, కొంత మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో శశికళను విజయశాంతి రహస్యంగా కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. శశికళ జైలు నుంచి వచ్చిన తర్వాత విజయశాంతి కలిశారు. తాజా భేటీలో శశికళ రాజకీయ భవిష్యత్ గురించి చర్చించినట్లు సమాచారం. జయలలిత మృతి అనంతరం అన్నాడీఎంకేను భాజపా నియంత్రిస్తోందనే ఆరోపణలు ఉన్నాయ. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిన వారిని మళ్లీ పార్టీలోకి తెచ్చేందుకు యత్నాలు జరిగాయి. అయితే ఎడప్పాడి పళనిస్వామితో సహా సీనియర్ నేతలు ససేమిరా అనటంతో అవి ఫలించలేదు. ఈ నేపథ్యంలో 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ అన్నాడీఎంకే నుంచి వెళ్లిపోయిన వారిని పార్టీలో చేర్చే యత్నాల్లో భాజపా ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే విజయశాంతి తాజాగా శశికళను కలిసినట్లు రాజకీయ వర్గాల సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీరు అందించనున్న తిరునిండ్రవూరు చెరువు
[ 06-05-2024]
స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండు చేస్తున్న ఆవడి వాసులకు జలమండలి విభాగం శుభవార్త చెప్పింది. తిరునిండ్రవూరు చెరువు నీటిని తాగునీరుగా శుద్ధి చేసి ఆవడి కార్పొరేషన్, చెన్నైకి పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. -
పోలండ్ యువతిని పెళ్లాడిన కృష్ణగిరి యువకుడు
[ 06-05-2024]
కృష్ణగిరి జిల్లా వేప్పన్హళ్లి సమీపం కురియనప్పళ్లి గ్రామానికి చెందిన తిమ్మప్ప, పద్మమ్మ కుమారుడు రమేష్ (33) ఉన్నత విద్య కోసం పోలండ్ వెళ్లాడు. -
ఒకే పాఠశాల పేరుతో రెండు నీట్ కేంద్రాలు
[ 06-05-2024]
తంజావూర్, కుంభకోణంలో ఒకే పేరుతో రెండు పరీక్ష కేంద్రాలు ఉండటంతో గందరగోళానికి గురైన విద్యార్థిని పరీక్ష రాయలేక వెనుదిరిగింది. తంజావూర్ జిల్లాలో తామరై ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో తంజావూర్, కుంభకోణంలో రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. -
‘విలేజ్ కుకింగ్’ తాత ఆరోగ్యంపై రాహుల్గాంధీ ఆరా
[ 06-05-2024]
విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ తాత పెరియతంబి ఆరోగ్యంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు సమాచారం. విలేజ్ కుకింగ్ ఛానల్కు 22 మిలియన్ చందాదారులు ఉన్నారు. -
వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు
[ 06-05-2024]
వర్షం కోసం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తమిళనాడు తౌహీద్ జమాత్ కాంచీపురం జిల్లా శాఖ తరపున ఆదివారం కాంచీపురం వలి ముహమ్మద్పేటలోని మున్సిపల్ కార్పొరేషన్ మిడిల్ పాఠశాల ప్రాంగణంలో సుమారు 500 మందికిపైగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
కాలుష్యం.. కాస్త నయం!
[ 06-05-2024]
వాహనాలు, పరిశ్రమలు, అభివృద్ధి పనులు.. నగరవ్యాప్తంగా కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. ఈ ఇక్కట్లు చెన్నై వాసులు నిత్యం అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోల్చి చూస్తే చెన్నై కొంత నయమన్నట్లుగానే ఉందనే భావన కలుగుతోంది. -
ముగిసిన జయకుమార్ అంత్యక్రియలు
[ 06-05-2024]
అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కాంగ్రెస్ నెల్లై తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ అంత్యక్రియలు సొంతూరు కరైసుత్తుపుదూరులో ఆదివారం జరిగాయి. -
పోలీసుశాఖ వెబ్సైట్ హ్యాక్
[ 06-05-2024]
తమిళనాడు పోలీసుశాఖ వెబ్సైట్ హ్యాక్ అయింది. ఈ విషయమై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు పోలీసులు నిందితులు, ఫిర్యాదుల డేటా నిల్వ చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. -
ప్రదీప్ రంగనాథన్ చిత్రానికి డ్రాగన్గా టైటిల్
[ 06-05-2024]
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఏజీఎస్ సంస్థ గత నెల యూట్యూబ్లో విడుదల చేసింది. -
రాష్ట్రానికి భారీ వర్ష సూచన
[ 06-05-2024]
రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఆదివారం వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... -
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ
[ 06-05-2024]
మద్యం మత్తులో దాడిచేసిన కుమారుడిపై తల్లి, అతని పెద్దమ్మ మరిగిన నూనె పోసి హతమార్చారు. పోలీసుల కథనం మేరకు.. తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపం తెన్నాంగూర్ గ్రామానికి చెందిన సురేష్ (35) మద్యానికి బానిసయ్యాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం