‘కెవి’ ఫస్ట్లుక్ విడుదల
ఆద్యత్ ప్రొడక్షన్స్ బ్యానరుపై గౌతం చొక్కలిగం నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కెవి’. తమిళ్ దయాళన్ దర్శకత్వం వహించారు.
షీలా రాజ్కుమార్
కోడంబాక్కం, న్యూస్టుడే: ఆద్యత్ ప్రొడక్షన్స్ బ్యానరుపై గౌతం చొక్కలిగం నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కెవి’. తమిళ్ దయాళన్ దర్శకత్వం వహించారు. మండేలా, పేట్టైక్కాళి ఫేమ్ షీలా రాజ్కుమార్, విజయ్టీవీ ఫేమ్ జాక్లిన్ హీరోయిన్లుగా నటించారు. ఆదవన్ హీరోగా పరిచయమవుతున్నారు. చార్లస్ వినోద్, జీవాలు ఇతర తారాగణం. బాలసుబ్రమణ్యం సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమా ఫస్ట్లుక్ను నటుడు యోగిబాబు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ 800 ఏళ్ల చరిత్రలో తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాం. కెవి అంటే పునాది అని అర్థం. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. చాలా విషయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ గిరిజన ప్రాంత ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదు. ఈ విషయాలన్నీ చిత్రంలో ప్రస్తావించామని’’ పేర్కొన్నారు.
ఆదవన్
వేసవిలో వస్తున్న ‘ఎన్ ఇనియ తనిమయే’
‘ఎన్ ఇనియ తనిమయే’లో ఓ దృశ్యం
కోడంబాక్కం, న్యూస్టుడే: సగు పాండియన్ దరక్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎన్ ఇనియ తనిమయే’. జేమ్స్ వసంతన్ సంగీతం సమకూర్చారు. శ్రీపతి, రీషా ప్రధాన తారాగణం. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ ఇది థ్రిల్లర్ కథా చిత్రం. సమాజానికి ఉపయోగపడే ఓ ముఖ్యమైన విషయంతో చిత్రీకరించాం. ఈ ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తంగర్బచ్చన్ చిత్రాలకు పనిచేసిన శివభాస్కరన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి. చిత్రంలో అమ్మ సెంటిమెంట్ కూడా ఉంటుంది. జేమ్స్ వసంతన్ సంగీతం సినిమాకు మరింత ప్లస్పాయింట్గా ఉంటుంది. తాజాగా తొలి పాటను కూడా విడుదల చేశాం. మంచి స్పందన లభిస్తోందని’’ పేర్కొన్నారు.
నా తొలి థ్రిల్లర్ చిత్రమిది
ఆర్జే బాలాజీ
కోడంబాక్కం, న్యూస్టుడే: రేడియో జాకీ నుంచి కథానాయకుడి స్థాయికి ఎదిగి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న నటుడు ఆర్జే బాలాజీ. ఇప్పటికే తన స్వీయ దర్శకత్వంలో మూడు చిత్రాల్లో నటించి హిట్లను అందుకున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘రన్ బేబీ రన్’. జైన్ కృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 3న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘ రేడియో జాకీ నుంచి రచయిత, దర్శకుడు, హీరోగా ఒక్కో అడుగు దాటుకుంటూ వస్తున్నా. దేవుని కృపతో కొంత అభిమానగణం వచ్చింది. ‘రన్ బేబి రన్’ నా కెరీర్లో ముఖ్యమైన చిత్రం. ఇందులో ఇషా తల్వార్ హీరోయిన్గా నటించారు. ఐశ్వర్యారాజేష్ కీలక పాత్ర పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతం సినిమాకు హైలెట్. ఇది నా తొలి థ్రిల్లర్ సినిమా. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇక ఈ మధ్య నటుడు విజయ్కి ఓ కథ వినిపించా. ఆయనకు కూడా బాగా నచ్చింది. అందులోని హాస్య ఎలిమెంట్స్ను బాగా ఎంజాయ్ చేశారు. రెండు నెలల్లో స్క్రిప్ట్ పూర్తి చేయమని చెప్పారు. కానీ ఆయన స్థాయికి స్క్రిప్ట్ సిద్ధం చేయాలంటే కనీసం ఏడాది సమయం కావాలి. అందుకే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తప్పకుండా ఆయన నాకు మరో అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నట్లు ’’ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
[ 07-05-2024]
కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్పేట సమీపం సిరుత్తనూర్ గ్రామానికి చెందిన గోవిందస్వామి ఏసు కుమార్తె రోస్లిన్ మేరీ (25) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు. -
అమ్మాయిలు అదరగొట్టారు
[ 07-05-2024]
ప్లస్టూ పబ్లిక్ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. అబ్బాయిల కన్నా ఎక్కువ ఉత్తీర్ణతశాతం సాధించారు. -
చిన్నారిపై పెంపుడు కుక్కల దాడి
[ 07-05-2024]
పార్కులో ఐదేళ్ల చిన్నారిపై రెండు పెంపుడు కుక్కలు దారుణంగా దాడిచేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. -
ఠారెత్తిస్తున్న ఎండలు!
[ 07-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు బాగా పెరిగాయి. చాలా జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలూ జారీ చేసింది. -
అంధ పాఠకులకు ప్రత్యేక యాప్
[ 07-05-2024]
సభ్యత్వం ఉన్న వారికి పుస్తకాలను అద్దెకిచ్చే పద్ధతిని ఇటీవల అన్నా సెంటినరీ గ్రంథాలయం ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ప్లస్టూ ఫలితాల విడుదల
[ 07-05-2024]
మహానగర చెన్నై కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులు 12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 87.13 శాతం ఉత్తీర్ణత సాధించారని కమిషనర్ డాక్టర్ జె.రాధాకృష్ణన్ వెల్లడించారు. -
చర్చనీయంగా ఏ.ఆర్.రెహమాన్ పోస్టు
[ 07-05-2024]
దివంగత హాస్యనటుడు కుమరిముత్తు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. -
వైద్య విద్యార్థుల మృతికి సీఎం సంతాపం
[ 07-05-2024]
కన్నియాకుమరి జిల్లా రాజాక్కమంగలంలోని సముద్రంలో మునిగి మృతి చెందిన వైద్య విద్యార్థుల ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
విక్రవాండి ఉప ఎన్నికకు రంగం సిద్ధం!
[ 07-05-2024]
విళుపురం జిల్లా విక్రవాండి ఎమ్మెల్యే (డీఎంకే) మృతితో ఆ నియోజకవర్గం ఖాళీగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. -
ఇండియా కూటమిలో డీఎంకే ఉండి ప్రయోజనమేంటి?
[ 07-05-2024]
డీఎంకే ఇండియా కూటమిలో ఉన్నా రాష్ట్రానికి ప్రయోజనమేమి లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి అన్నారు. -
జయకుమార్ మృతిపై దర్యాప్తు ముమ్మరం
[ 07-05-2024]
తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మృతి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి