logo

డీఎంకేలో పలువురు నాయకుల చేరిక

భాజపా రాష్ట్ర షెడ్యూల్‌ విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్‌.వినాయకమూర్తి ఆధ్వర్యంలో ఆ పార్టీ నిర్వాహకులు పలువురు డీఎంకేలో చేరారు.

Published : 07 Feb 2023 01:33 IST

సీఎం నుంచి సభ్యత్వ పత్రం స్వీకరిస్తున్న వినాయకమూర్తి

చెన్నై, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర షెడ్యూల్‌ విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్‌.వినాయకమూర్తి ఆధ్వర్యంలో ఆ పార్టీ నిర్వాహకులు పలువురు డీఎంకేలో చేరారు. ఆయనతోపాటు భాజపా ఈరోడు జిల్లా యువజన విభాగం కార్యదర్శి వి.వెంకటేశ్‌, మదురైవీరన్‌ మక్కళ్‌ యువజన విభాగం కార్యదర్శి పళ.వీరకుమార్‌ తదితరులు అన్నా అరివాలయంలో సోమవారం సీఎం స్టాలిన్‌ను కలిశారు. వారికి ప్రాథమిక సభ్యత్వ పత్రాలను ముఖ్యమంత్రి అందించారు. వెంట డీఎంకే ప్రధానకార్యదర్శి దురైమురుగన్‌, ఉప ప్రధానకార్యదర్శి పొన్ముడి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.భారతి, అధికార ప్రతినిధి టీకేఎస్‌ ఇళంగోవన్‌, విద్యుత్తుశాఖ మంత్రి సెంథిల్‌బాలాజీ, మాజీ ఎమ్మెల్యే కోవై సెల్వరాజ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని