logo

ఉత్తమ రైతులకు ప్రోత్సాహకాలు

రాణిపేట కలెక్టర్‌ కార్యాలయంలో పట్టు అభివృద్ధి శాఖ తరఫున 2022-23 ఏడాదికిగాను జిల్లా స్థాయిలో ఉత్తమ పట్టు రైతులుగా ఎంపికైన వారికి బహుమతులు అందజేసే కార్యక్రమం సోమవారం జరిగింది.

Published : 21 Mar 2023 01:14 IST

రైతులకు చెక్కులు అందజేస్తున్న కలెక్టరు వళర్మతి

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట కలెక్టర్‌ కార్యాలయంలో పట్టు అభివృద్ధి శాఖ తరఫున 2022-23 ఏడాదికిగాను జిల్లా స్థాయిలో ఉత్తమ పట్టు రైతులుగా ఎంపికైన వారికి బహుమతులు అందజేసే కార్యక్రమం సోమవారం జరిగింది. కలెక్టర్‌ వళర్మతి పాల్గొని మొదటి, రెండో, మూడో బహుమతుల కింద రూ.25, రూ.20, రూ.15 వేల బ్యాంకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పథకం అమలు అధికారిణి లోగనాయకీ, పయనీర్‌ బ్యాంక్‌ మేనేజర్‌ అల్లియమ్మా అబ్రహం, పట్టు అభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని