సెంజి మస్తాన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్
కల్తీ మద్యం విక్రయాలకు మంత్రి సెంజి మస్తాన్ సహకరిస్తున్నారని, ఆయనను పదవి నుంచి తప్పించాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్ చేశారు.
సైదాపేట, న్యూస్టుడే: కల్తీ మద్యం విక్రయాలకు మంత్రి సెంజి మస్తాన్ సహకరిస్తున్నారని, ఆయనను పదవి నుంచి తప్పించాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... ప్రజలు తమకు ఏదైనా కష్టం అంటే ప్రభుత్వం దగ్గరో, పాలకుల దగ్గరో మొరపెట్టుకుంటారని, అయితే ప్రభుత్వం నిర్వహించే సంస్థలోనే తప్పులు జరుగుతుంటే ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. రెండేళ్ల డీఎంకే పాలనలో టాస్మాక్ సంస్థలో దుకాణాలు, బార్లలో జరిగే అవినీతి ప్రజలకు బాగా తెలుసన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజలను అన్ని విధాలా డీఎంకే ప్రభుత్వం వంచిస్తోందని ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువుల ధర పెరుగుదల, పన్నుల పెంపు, విద్యుత్ తదితర ఛార్జీల పెంపు .. ఇలా డీఎంకే పాలనలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల కల్తీ మద్యం తాగి రాష్ట్రంలో పలువురు మృతి చెందారన్నారు. ఇలా ఎంత మంది మృతి చెందినా వారి కుటుంబాలకు కొన్ని లక్షలు ఇచ్చి సరిపెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు. కల్తీ మద్యం విక్రయానికి మంత్రి సెంజి మస్తాన్ సహకరిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. కల్తీ మద్యం అమ్మేవారికి, చట్ట విరుద్ధంగా బార్లు నిర్వహించే వారికి మంత్రి అండగా ఉంటున్నట్లు తెలుస్తోందన్నారు. మంత్రి సెంజి మస్తాన్ను సీఎం స్టాలిన్ వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందన్నారు. చట్ట విరుద్ధ బార్లు మాత్రమే కాకుండా టాస్మాక్ దుకాణాల్లో అక్రమంగా మద్యం విక్రయం జరుగుతోందా? లేదా? అనేది గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్