కాంగ్రెస్పై కమల్హాసన్ కినుక?
కాంగ్రెస్ను మినహాయించి డీఎంకే కూటమి పార్టీల అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం చేసేలా కమల్హాసన్ షెడ్యూల్ రూపొందడం చర్చనీయాంశమైంది.
చెన్నై, న్యూస్టుడే: కాంగ్రెస్ను మినహాయించి డీఎంకే కూటమి పార్టీల అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం చేసేలా కమల్హాసన్ షెడ్యూల్ రూపొందడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్పై ఆయన కినుక వహించారని ప్రచారం జరుగుతోంది. డీఎంకే కూటమికి మద్దతు తెలిపిన మక్కళ్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్కు ఒక రాజ్యసభ సీటు కేటాయించిన విషయం తెలిసిందే. కూటమికి మద్దతుగా తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రచారం చేపడతారని ప్రకటించారు. ఆ మేరకు 29న ఈరోడులో ప్రారంభించి ఏప్రిల్ 16 పొల్లాచ్చిలో ముగించనున్నారు. మొత్తం 11 రోజులు షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. కూటమిలోని డీఎంకే, ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం ఆయన ఓట్లు అభ్యర్థించనున్నారు. షెడ్యూల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాలు లేకపోవడం చర్చగా మారింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్ఠానంతో కమల్ మంతనాలు జరిపారని, ఆ సమయంలో ఆయన్ను దిల్లీ పెద్దలు విస్మరించి ఉండొచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాలిచ్చినా వనితల ఓటు పడలేదు!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తలపడిన మూడు ప్రధాన కూటములు ప్రత్యేకించి మహిళా ఓటర్ల మీద పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. -
గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదు
[ 29-04-2024]
రాష్ట్రానికి చెందిన భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదును ముఖ్యమంత్రి అందించారు. -
తాగునీటి సమస్య తలెత్తదు
[ 29-04-2024]
చెన్నై మహానగరంలో సెప్టెంబర్ వరకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేదని చెన్నై తాగునీటి బోర్డు తెలిపింది. -
ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలి
[ 29-04-2024]
ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పోలైన ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ తెలిపారు. -
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
[ 29-04-2024]
నెల్లై జిల్లా కల్లిడైకురిచ్చికి చెందిన వేల్మురుగన్ టీ దుకాణం నడుపుతున్నాడు. ఇతని కుమారుడు పేచ్చి ఇటీవల విడుదలైన యూపీఎస్సీ పరీక్షల ఫలితాల్లో 567వ స్థానంలో నిలిచి ప్రతిభ కనబర్చాడు. -
పనిలేక పస్తులు
[ 29-04-2024]
జాలర్లు సంద్రంలోకి వెళ్లి చేపలు పట్టడంపై ప్రస్తుతం ప్రభుత్వం నిషేధం విధించింది. -
విజయ్ పుట్టినరోజున గోట్ రెండో సింగిల్
[ 29-04-2024]
విజయ్ 68వ చిత్రంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) రూపొందుతున్న విషయం తెలిసిందే. -
ఐఎస్ఐ మద్దతుదారుడి అరెస్టుకు ప్రతీకారంగానే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర
[ 29-04-2024]
ఐఎస్ఐ మద్దతుదారుడిని అరెస్టు చేసినందుకే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిసింది. -
వాహనాలపై స్టిక్కర్లు అంటించడంపై నిషేధం
[ 29-04-2024]
ప్రజలు తమ వాహనాలపై మీడియా, పోలీసు, న్యాయశాఖ, ఆర్మీ అని పలు శాఖలు, సంస్థల పేర్లను అతికించడానికి గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు నిషేధం విధించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!