పసికందును చంపిన కసాయి తల్లి
పసికందును బావిలో పడేసి చంపిన కసాయి తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. రెడ్హిల్స్ సమీప విజయనల్లూరు విజయాగార్డెన్కు చెందిన రమేష్ పెయింటర్.
నిందితురాలు సత్య
రెడ్హిల్స్, న్యూస్టుడే: పసికందును బావిలో పడేసి చంపిన కసాయి తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. రెడ్హిల్స్ సమీప విజయనల్లూరు విజయాగార్డెన్కు చెందిన రమేష్ పెయింటర్. ఇతని భార్య సత్య. ఈమె నెల రోజుల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చింది. రమేష్ సోమవారం ఉదయం పనికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి రాగా బిడ్డ కనిపించలేదు. అతను భార్యను ప్రశ్నించగా... తాను స్నానానికి వెళ్లి వచ్చేలోగా కనిపించలేదని చెప్పింది. దీంతో రమేష్ ఇంటి వెనుక ఉన్న బావిలోకి చూడగా పసికందు తేలుతుండడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బిడ్డ అంగవిహీనంగా పుట్టడంతో బావిలో పడేసినట్లు సత్య అంగీకరించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
భార్యను హత్య చేసిన భర్త అరెస్టు
వేళచ్చేరి, న్యూస్టుడే: కడలూర్ జిల్లా భువనగిరి సమీపంలోని కస్పా ఆలంబట్టి గ్రామానికి చెందిన మామలై వాసన్ పొక్లెయినర్ ఆపరేటర్. ఆయన భార్య అభినయ. తిట్టక్కుడి గ్రామానికి చెందిన ఈమెను మామలై వాసన్ ప్రేమించి వివాహం చేసుకొన్నాడు. గతేడాది ఆగస్టు 19న అభినయ ఇంట్లో రక్తగాయాలతో శవంగా పడి ఉండటంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పారిపోయిన మామలై వాసన్ కోసం గాలిస్తూ వచ్చారు. ఏడు నెలల తర్వాత సొంతూరికి రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశారు. మద్యం తాగి ఇంటికొచ్చిన సమయంలో అభినయతో గొడవ జరిగిందని, కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందిందని వాంగ్మూలం ఇచ్చాడు.
వ్యాను బోల్తా: నలుగురు విద్యార్థులకు గాయాలు
కోయంబత్తూరు, న్యూస్టుడే: కోవై శూలూర్ సమీప నీలాంబూర్లో ఓ ప్రైవేటు పాఠశాల ఉంది. మంగళవారం ఉదయం పాఠశాలకు చెందిన వ్యాను నలుగురు విద్యార్థులతో నాగమ్మ నాయకన్పాళ్యం మార్గం గుండా జేజేనగర్కు వెళుతుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుంతలో పడింది. స్థానికులు గాయపడిన విద్యార్థులను సింగానల్లూర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శూలూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలను అక్కడి సీసీటీవీ ఫుటీజీ ఆ్వరా పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంగ నాన్తాన్ కింగు ట్రైలర్ విడుదల
[ 28-04-2024]
ఆనంద్ నారాయణన్ దర్శకత్వంలో సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. ప్రియాలయ, మనోబాలా, తంబి రామయ్య, మునీశ్కాంత్, బాల శరవణన్ తదితరులు ఇతర తారాగణం. -
తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలి
[ 28-04-2024]
వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. -
రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు కేసు చెన్నైలో ఎన్ఐఏ దర్యాప్తు
[ 28-04-2024]
బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు దాడి వ్యవహారానికి సంబంధించి చెన్నైలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో గత నెల బాంబు పేలుడు సంభవించింది. -
కరవులో ఆదుకోనున్న క్వారీలు
[ 28-04-2024]
చెంగల్పట్టు జిల్లా పరిధిలోని గ్రామాలకు వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా రాళ్ల క్వారీల నుంచి నీటిని సేకరించేందుకు చెంగల్పట్టు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. -
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు
[ 28-04-2024]
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి అన్యాయం
[ 28-04-2024]
కేంద్రంలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ తమిళనాడుకు నిధులు అందించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు. -
స్పీడ్ పోస్ట్ ద్వారా 2.5 లక్షల ఎల్ఎల్ఆర్లు
[ 28-04-2024]
‘లెర్నర్స్ లైసెన్స్’ (ఎల్ఎల్ఆర్), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను స్పీడ్ పోస్టు ద్వారా పంపడంలో విజయం సాధించినట్టు ‘ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ సేఫ్టీ’ విభాగం పేర్కొంది. -
శ్రీవారిని దర్శించుకున్న దుర్గా స్టాలిన్
[ 28-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల వేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. -
నిరంతర కృషితో ఉన్నత పదవులకు..
[ 28-04-2024]
టీఎన్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో తిరుప్పూర్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగినులు ఉత్తీర్ణత సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!