ఇనిమేల్ పాట విడుదల
నటుడు కమల్హాసన్కు చెందిన రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో రూపొందిన ఆల్బం పాట ‘ఇనిమేల్’. కమల్హాసన్ రాసిన ఈ పాట సన్నివేశాల్లో దర్శకుడు లోకేశ్ కనకరాజ్, శృతిహాసన్ జంటగా నటించారు. పాటకు శృతిహాసన్ సంగీతం సమకూర్చారు.
పాటలో ఓ సన్నివేశం
చెన్నై, న్యూస్టుడే: నటుడు కమల్హాసన్కు చెందిన రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో రూపొందిన ఆల్బం పాట ‘ఇనిమేల్’. కమల్హాసన్ రాసిన ఈ పాట సన్నివేశాల్లో దర్శకుడు లోకేశ్ కనకరాజ్, శృతిహాసన్ జంటగా నటించారు. పాటకు శృతిహాసన్ సంగీతం సమకూర్చారు. ఈ ఆల్బం ద్వారా లోకేశ్ కనకరాజ్ నటుడిగా కొత్త అవతారమెత్తారు. టీజర్ 21న విడుదలైన నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆల్బం పూర్తి పాట విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో దీని గురించి లోకేశ్ కనకరాజ్, శృతిహాసన్ మాట్లాడారు.
విఘ్నేశ్ శివన్ భావోద్వేగ పోస్టు
చెన్నై: నటి నయనతార భర్త, దర్శకుడైన విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లవ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్’ (ఎల్ఐసీ). ప్రేమ, హాస్యభరిత సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, కీర్తి శెట్టి, ఎస్జే సూర్య, యోగిబాబు తదితరులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కొన్ని రోజులుగా మలేషియా, సింగపూర్ దేశాల్లో చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలను నయనతార హత్తుకున్న, తనతో ఇద్దరు పిల్లలు ఉన్న ఫొటోలను విఘ్నేశ్ శివన్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. చిత్రీకరణ పనుల కారణంగా వారాలు తరబడి కుటుంబానికి దూరంగా ఉన్నానని, తన ప్రియమైన పిల్లలు, భార్యను హత్తుకోవడానికి నిరీక్షిస్తున్నానని పేర్కొన్నారు.
మళ్లీ మెగాఫోన్ పడుతున్న శశికుమార్
చెన్నై: సందేశాత్మక చిత్రాలను అందించడంలో దిట్టగా పేరొందిన దర్శకుడు శశికుమార్. నటనవైపు మొగ్గుచూపిన ఆయన ఆ దిశగా కూడా తన ముద్ర వేశారు. ఆయన నటించిన ఇటీవలి చిత్రం ‘అయోద్ది’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చాలా సంవత్సరాల విరామం తర్వాత శశికుమార్ మళ్లీ మెగాఫోన్ పట్టుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీని కోసం మహిళా ప్రాధాన్యతతో కూడిన కథను సిద్ధం చేసుకున్నారని, ఈ చిత్రంలో నయనతార ప్రధాన పాత్ర పోషించనున్నారని కోలివుడ్ సమాచారం. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
హాస్యనటుడు శేషు కన్నుమూత
చెన్నై: హాస్యనటుడు శేషు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో మంగళవారం కన్నుమూశారు. గుండెపోటుతో 15వ తేదీ ఆళ్వార్పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్సలు అందించారు. కొన్ని రోజులుగా వెంటిలేటర్పై ఉంచారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం క్షీణించి మంగళవారం తుదిశ్వాస విడిచారు. పళ్లికరణైలోని నివాసంలో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుల్లితెరలో కామెడీ షో ‘లొల్లు సభ’ ద్వారా గుర్తింపు పొందిన ఆయన ఆ షో పేరుతోనే లొల్లు సభ శేషుగా ప్రసిద్ధి గాంచారు. సినీ రంగానికి పరిచయమైన ఆయన సంతానం నటించిన ‘ప్యారీస్ జయరాజ్’, ‘డిక్కిలోనా’, ‘ఏ1’, ‘కులు కులు’ తదితర పలు చిత్రాల్లో నటించారు. ఇటీవల విడుదలైన ‘వడక్కుపట్టి రామసామి’ చిత్రంలో ఆయన నటన పలువురి ప్రశంసలు పొందింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంగ నాన్తాన్ కింగు ట్రైలర్ విడుదల
[ 28-04-2024]
ఆనంద్ నారాయణన్ దర్శకత్వంలో సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. ప్రియాలయ, మనోబాలా, తంబి రామయ్య, మునీశ్కాంత్, బాల శరవణన్ తదితరులు ఇతర తారాగణం. -
తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలి
[ 28-04-2024]
వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. -
రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు కేసు చెన్నైలో ఎన్ఐఏ దర్యాప్తు
[ 28-04-2024]
బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు దాడి వ్యవహారానికి సంబంధించి చెన్నైలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో గత నెల బాంబు పేలుడు సంభవించింది. -
కరవులో ఆదుకోనున్న క్వారీలు
[ 28-04-2024]
చెంగల్పట్టు జిల్లా పరిధిలోని గ్రామాలకు వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా రాళ్ల క్వారీల నుంచి నీటిని సేకరించేందుకు చెంగల్పట్టు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. -
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు
[ 28-04-2024]
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి అన్యాయం
[ 28-04-2024]
కేంద్రంలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ తమిళనాడుకు నిధులు అందించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు. -
స్పీడ్ పోస్ట్ ద్వారా 2.5 లక్షల ఎల్ఎల్ఆర్లు
[ 28-04-2024]
‘లెర్నర్స్ లైసెన్స్’ (ఎల్ఎల్ఆర్), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను స్పీడ్ పోస్టు ద్వారా పంపడంలో విజయం సాధించినట్టు ‘ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ సేఫ్టీ’ విభాగం పేర్కొంది. -
శ్రీవారిని దర్శించుకున్న దుర్గా స్టాలిన్
[ 28-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల వేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. -
నిరంతర కృషితో ఉన్నత పదవులకు..
[ 28-04-2024]
టీఎన్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో తిరుప్పూర్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగినులు ఉత్తీర్ణత సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!