logo

నటుడు ధనుష్‌, ఐశ్వర్యకు కోర్టు ఉత్తర్వులు

నటుడు ధనుష్‌, ఐశ్వర్య కోర్టులో హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నటుడు ధనుష్‌, రజనీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్యలకు గత 2004లో ప్రేమ వివాహం అయిన విషయం తెలిసిందే.

Published : 16 Apr 2024 05:20 IST

ఐశ్వర్య, ధనుష్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: నటుడు ధనుష్‌, ఐశ్వర్య కోర్టులో హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నటుడు ధనుష్‌, రజనీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్యలకు గత 2004లో ప్రేమ వివాహం అయిన విషయం తెలిసిందే. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరు గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్‌ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కాని వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు కోరి చెన్నై ఫ్యామిలీ కోర్టులో గత వారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ న్యాయమూర్తి సుభాదేవీ ముందు సోమవారం విచారణకు వచ్చింది. అప్పుడు నటుడు ధనుష్‌, ఐశ్వర్యలు అక్టోబరు 7న కోర్టులో హాజరవ్వాలని ఉత్తర్వులు ఇచ్చి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని