నటుడు ధనుష్, ఐశ్వర్యకు కోర్టు ఉత్తర్వులు
నటుడు ధనుష్, ఐశ్వర్య కోర్టులో హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నటుడు ధనుష్, రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యలకు గత 2004లో ప్రేమ వివాహం అయిన విషయం తెలిసిందే.
ఐశ్వర్య, ధనుష్
ప్యారిస్, న్యూస్టుడే: నటుడు ధనుష్, ఐశ్వర్య కోర్టులో హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నటుడు ధనుష్, రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యలకు గత 2004లో ప్రేమ వివాహం అయిన విషయం తెలిసిందే. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరు గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కాని వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు కోరి చెన్నై ఫ్యామిలీ కోర్టులో గత వారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి సుభాదేవీ ముందు సోమవారం విచారణకు వచ్చింది. అప్పుడు నటుడు ధనుష్, ఐశ్వర్యలు అక్టోబరు 7న కోర్టులో హాజరవ్వాలని ఉత్తర్వులు ఇచ్చి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తర తమిళనాడులో 1న తీవ్రమైన వేడి గాలులు
[ 30-04-2024]
ఉత్తర తమిళనాడులో బుధవారం అత్యంత తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. -
ప్రకాశ్రాజ్కు అంబేడ్కర్ చుడర్ అవార్డు: వీసీకే
[ 30-04-2024]
ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్కు 2024 ఏడాదికి అంబేడ్కర్ చుడర్ అవార్డు ఇవ్వనున్నట్లు వీసీకే అధ్యక్షుడు తిరుమాళన్ తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం
[ 30-04-2024]
-
కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు సీఎం
[ 30-04-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ ఐదు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు వెళ్లారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనతో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. -
హోటల్ టమోటా సాస్లో పురుగులు
[ 30-04-2024]
నీలగిరి జిల్లా కున్నూర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో సప్లై చేసిన టమోటా సాస్లో పురుగులు ఉండటం చూసి నటుడు విజయ్ విశ్వ దిగ్భ్రాంతి చెందారు. -
మరో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన లారెన్స్
[ 30-04-2024]
నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ పలు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘మాట్రం’ అనే సంస్థనూ ఏర్పాటు చేశారు. దాని ద్వారా నిస్సహాయకులకు సాయం అందించనున్నట్టు ప్రకటించారు. -
పెళ్లి చేసుకోలేదని మహిళపై హత్యాయత్నం
[ 30-04-2024]
విరుదునగర్ జిల్లా రాజపాళయానికి చెందిన పెరుమాళ్సామి, జ్యోతి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కుమార్తె పాండిసెల్వి వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. -
రీ రిలీజ్కు సిద్ధంగా విజయ్ సేతుపతి సినిమాలు
[ 30-04-2024]
కోలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ‘వారణం ఆయిరం’, ‘వేట్టైయాడు విళైయాడు’, ‘3’, ‘విణ్ణైతాండి వరువాయా’ తదితర చిత్రాలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!