విళవంకోడు ఉప ఎన్నికలో విజయమెవరిది?
లోక్సభ ఎన్నికలతోపాటు కన్నియాకుమరి జిల్లాలోని విళవంకోడు శాసనసభ నియోజకవర్గానికి కూడా 19న ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి పార్టీ నుంచి తప్పుకొని భాజపాలో చేరారు.
న్యూస్టుడే, ప్యారిస్
తారగై కత్బర్ట్, నందిని, రాణి, జెమిని
లోక్సభ ఎన్నికలతోపాటు కన్నియాకుమరి జిల్లాలోని విళవంకోడు శాసనసభ నియోజకవర్గానికి కూడా 19న ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి పార్టీ నుంచి తప్పుకొని భాజపాలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ నియోజకవర్గం ఖాళీ అయినట్లు ప్రకటించారు. ఉప ఎన్నికలో అన్నాడీఎంకే, కాంగ్రెస్, భాజపా, నామ్ తమిళర్ కట్చి అని నాలుగు పార్టీల నుంచి నలుగురు మహిళా అభ్యర్థులు పోటీపడుతున్నారు.
కాంగ్రెస్దే ఆధిక్యం..
విళవంకోడులో కాంగ్రెస్ ఎక్కువసార్లు విజయం దక్కించుకుంది. కన్నియాకుమరి, కేరళ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో మలయాళం మాట్లాడేవారు అధికంగా ఉన్నారు. ఇప్పటి వరకు 17సార్లు ఎన్నికలు జరగ్గా 12 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 2011, 2016, 2021 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన విజయధరణి వరుసగా హ్యాట్రిక్ గెలుపు సాధించారు. 2021 ఎన్నికల్లో విజయధరణి 87,473 ఓట్లతో జయకేతనం ఎగురవేశారు. ఆమెకు 52.12 శాతం ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి జయశీలన్కు 35.04 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ప్రస్తుత ఉప ఎన్నికల్లో నలుగురు మహిళ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఉన్నత విద్యావంతురాలు..
కాంగ్రెస్ తరఫున తారగై కత్బర్ట్ బరిలో నిలిచారు. ఆమె దివంగత మాజీ మంత్రి లూర్థమ్మాళ్ సైమన్ మనవరాలు. ఆమె తండ్రి కత్బర్ట్ కాంగ్రెస్ నాయకుడు. 1976లో జన్మించిన ఆమె మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు. ఎంఏ, ఎంఫిల్, ఎంబీఏ, పీహెచ్డీ చదివారు. తమిళం, మలయాళం, ఇంగ్లీషు భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. టీఎన్సీసీ సభ్యురాలిగా, తమిళనాడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జిల్లా మాజీ అధ్యక్షురాలిగా, యువజన విభాగ ఉపాధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. ఆమెకు వివాహమై ఓ కుమారుడు ఉన్నారు.
ఎలాంటి సిఫారసు లేకుండా..
భాజపా నుంచి నందిని పోటీచేస్తున్నారు. 42 ఏళ్ల వయసున్న ఆమె భాజపా జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2019 స్థానిక ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఉప ఎన్నికలో పోటీకి వినతి లేదా ఎలాంటి సిఫారసు లేకుండానే ఆమె పేరు ప్రకటించారు. ఇది భాజపాలోని ముఖ్య నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
సేవా కార్యక్రమాలతో..
అన్నాడీఎంకే అభ్యర్థిగా రాణి బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం డిప్యూటీ కార్యదర్శిగా ఉన్నారు. నాగర్కోవిల్లో ఉంటున్న ఆమె మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా వృత్తి శిక్షణ ఇస్తున్నారు. విళవంకోడు నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేకపోయినా ఆమె నిర్వహించే స్వచ్ఛంద సంస్థ, సేవల ద్వారా ఇక్కడి ప్రజలకు దగ్గరయ్యారు.
ఉపాధ్యాయ వృత్తి నుంచి..
నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా జెమిని పోటీచేస్తున్నారు. ఉపాధ్యాయిని అయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పదేళ్లుగా నామ్ తమిళర్ కట్చి మహిళా విభాగం నిర్వాకురాలిగా ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండటంతో రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు గతంలో తెలిసింది. భర్త హత్యకు గురికావడంతో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు.
కాలువ సమస్య..
విళవంకోడు నియోజకవర్గంలో నొయ్యారు కాలువ పెద్ద సమస్యగా ఉంది. 2004లో కేరళ ప్రభుత్వం నొయ్యారు ఎడమ కాలువ నుంచి నీటి విడుదల నిలిపేసింది. అప్పటి నుంచి సమస్య పరిష్కారం కాలేదు. అన్ని పార్టీల నేతలు విజయం కోసం ఈ స్థానంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సముద్రగర్భంలోకి కార్బన్ డయాక్సైడ్
[ 30-04-2024]
భూమిపై పేరుకుపోతున్న కార్బన్ డయాక్సైడ్ (ద్ని2) ముప్పు నుంచి తప్పించుకునే దారులపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు భిన్న మార్గాల్లో అన్వేషిస్తుండగా..ఐఐటీ మద్రాస్ ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది. -
ఉత్తర తమిళనాడులో 1న తీవ్రమైన వేడి గాలులు
[ 30-04-2024]
ఉత్తర తమిళనాడులో బుధవారం అత్యంత తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. -
ప్రకాశ్రాజ్కు అంబేడ్కర్ చుడర్ అవార్డు: వీసీకే
[ 30-04-2024]
ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్కు 2024 ఏడాదికి అంబేడ్కర్ చుడర్ అవార్డు ఇవ్వనున్నట్లు వీసీకే అధ్యక్షుడు తిరుమాళన్ తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం
[ 30-04-2024]
విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర శిక్ష సమీకృత పథకం (ఇంటిగ్రేటడ్ స్కీం) కింద చెన్నై నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు -
కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు సీఎం
[ 30-04-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ ఐదు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు వెళ్లారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనతో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. -
హోటల్ టమోటా సాస్లో పురుగులు
[ 30-04-2024]
నీలగిరి జిల్లా కున్నూర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో సప్లై చేసిన టమోటా సాస్లో పురుగులు ఉండటం చూసి నటుడు విజయ్ విశ్వ దిగ్భ్రాంతి చెందారు. -
మరో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన లారెన్స్
[ 30-04-2024]
నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ పలు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘మాట్రం’ అనే సంస్థనూ ఏర్పాటు చేశారు. దాని ద్వారా నిస్సహాయకులకు సాయం అందించనున్నట్టు ప్రకటించారు. -
పెళ్లి చేసుకోలేదని మహిళపై హత్యాయత్నం
[ 30-04-2024]
విరుదునగర్ జిల్లా రాజపాళయానికి చెందిన పెరుమాళ్సామి, జ్యోతి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కుమార్తె పాండిసెల్వి వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. -
రీ రిలీజ్కు సిద్ధంగా విజయ్ సేతుపతి సినిమాలు
[ 30-04-2024]
కోలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ‘వారణం ఆయిరం’, ‘వేట్టైయాడు విళైయాడు’, ‘3’, ‘విణ్ణైతాండి వరువాయా’ తదితర చిత్రాలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!