3 రోజులే అమృత్ ఘడియలు
కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమృత్ జలధార, యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అనే రెండు పథకాలను ఇటీవల తీసుకువచ్చింది.
దళిత రైతుల రుణాల దరఖాస్తుకు అతికొద్ది గడువు
నిరుద్యోగులకూ ఇదే సమస్య
ఈనాడు డిజిటల్, అనకాపల్లి
గత ప్రభుత్వహయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించిన ట్రాక్టర్ (పాతచిత్రం)
కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమృత్ జలధార, యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అనే రెండు పథకాలను ఇటీవల తీసుకువచ్చింది. దళిత రైతులు, నిరుద్యోగులు జీవితంలో నిలదొక్కుకునేలా రూ. 50 వేల నుంచి రూ. 60 వేల రాయితీతో రుణాలివ్వడానికి ముందుకొచ్చింది. అయితే ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే ఇప్పుడు సమస్యగా మారింది.
ఈనెల మొదటి వారంలోనే పథకాలు అందుబాటులోకి వచ్చినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఈనెల 20న ఈ పథకాల గురించి జిల్లా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. వీటికి ఈనెల 27లోగా దరఖాస్తు చేసుకుంటేనే అర్హులని ప్రకటించారు. నాలుగేళ్ల తర్వాత రాయితీ రుణాలిస్తున్నారనే సంతోషం కంటే వాటికి దరఖాస్తు చేసుకోవడానికి అమృత కాలం దాటిపోతుండడంతో రైతులు, నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అన్నదాతల సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జలసిరి పథకం పేరుతో బోర్లు తవ్వి.. సౌర విద్యుత్తుతో మోటార్లు అందించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని వైఎస్ఆర్ జలకళగా మార్చి అమలులోకి తెచ్చారు. అయితే ఈ నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా ఒక్క రైతు కూడా లబ్ధి పొందలేదు. బోరు వేస్తే, విద్యుత్తు కనెక్షన్ ఇవ్వలేదు.. విద్యుత్తు ఇస్తే మోటార్లు ఇవ్వలేదు.. దీంతో ఏ రైతు కూడా జలకళ ద్వారా నీటిని పంటకు పెట్టుకోలేకపోయారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమృత్ జలధార పథకం ద్వారా ఎస్సీ రైతులకు రూ. లక్ష రుణంతో బోరు వేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అందులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. 50 వేలు రాయితీ కాగా, మిగతా రూ. 50 వేలు బ్యాంకు రుణంగా ఇప్పించనున్నారు. కనీసం 2.5 ఎకరాలున్న రైతులే అర్హులు. వైఎస్ఆర్ జలకళతో విసిగిపోయిన రైతులకు అమృత్ జలధార కొంత ఊరడింపుగానే ఉంది. కాకపోతే ఈ పథకం గురించి 20వ తేదీన చెప్పి 27లోగా దరఖాస్తు చేసుకోవాలని గడువుపెట్టడం రైతులను కలవరపెడుతోంది.
పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా నెంబర్ వంటి వివరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అధికారులు చెప్పిన వారం రోజుల గడువులో ఒకరోజు ఉగాది, మరో రోజు ఆదివారం సెలవులున్నాయి. అంటే దరఖాస్తుకు కేవలం అయిదు రోజులే అవకాశం ఇవ్వడం వల్ల ఈ అమృత్ జలధారను అందుకోవడం కష్టమేనని సంబంధిత శాఖలోనే చర్చనీయాంశం అవుతోంది.
ఆటోలు, ట్రాక్టర్లు, కిరాణా దుకాణాలు, ఫొటో స్టూడియో, టెంట్ హౌస్, మెడికల్ క్లినికల్ ల్యాబ్, ఫ్యాన్సీ దుకాణం వంటి వాటితో స్వయం ఉపాధిని పొందడానికి వీలుగా రూ.3 లక్షల వరకు బ్యాంకు రుణం ఇవ్వనున్నారు. ఇందులో రూ. 60 వేల రాయితీ సదుపాయం కల్పించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈనెల 27నే గడువుగా పేర్కొన్నారు.
సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోండి
ఈ విషయమై ఎస్సీ కార్పొరేషన్
ఈడీ రమణమూర్తి వద్ద ప్రస్తావించగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా పథకం ప్రకటించడంలో ఆలస్యమైందన్నారు..దరఖాస్తు గడువు పొడిగింపుపై ఎలా సమాచారం లేదన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించినట్లు చెప్పారు.
అంతా అయిదారు రోజుల్లోనే...
రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలేవీ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు యంగ్ ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ (వైఈఎస్-యస్) పేరుతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 21 ఏళ్ల నుంచి 48 ఏళ్లలోపు నిరుద్యోగ యువతకు రాయితీ రుణాలను అందించాలని నిర్ణయించింది.
చాలా కాలంగా రుణాల కోసం
ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ పథకం ఓ సదవకాశమే అయినా దరఖాస్తు చేసుకోవడానికి తగినంత సమయం ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. అవసరమైన ధ్రువపత్రాలతో, బ్యాంకర్లను కలిసి రుణాలకు ఒప్పించడం అయిదారు రోజుల్లో జరిగే పని కాదని నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!