రేషన్లో కోత.. ధరల వాత
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు.
కందిపప్పు పంపిణీపై చేతులేత్తేసిన జగన్
ఈనాడు-అనకాపల్లి, న్యూస్టుడే- పాడేరు
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. కందిపప్పు ఏ నెలా సక్రమంగా సరఫరా చేయడం లేదు. కాగితాల్లో కేటాయింపులు చూపిస్తున్నా గోదాములకు నిల్వలు చేరడం లేదు. పప్పులే కాదు మిగతా సరకులు అరకొరగానే అందిస్తున్నారు. ఒకనెల పంచదార ఇస్తే మరోనెల గోధుమపిండి ఇస్తున్నారు. ఎప్పుడూ పూర్తిస్థాయిలో రేషన్ అందడం లేదు. పైగా వైకాపా సర్కారు వచ్చాక రేషన్ సరకుల ధరలు పెంచేసి పేదలపై భారీగా భారం మోపారు.
ఉమ్మడి జిల్లాలో 12.38 లక్షల కుటుంబాలకు బియ్యం కార్డులున్నాయి. కార్డులో ప్రతి కుటుంబ సభ్యునికి ఐదు కేజీల చొప్పున బియ్యం, ఒక్కో కార్డుకు కేజీ కందిపప్పు, అరకేజీ పంచదార ఇవ్వాలి. తెదేపా హయాంలో కేజీ కందిపప్పు రూ.40 చొప్పున రెండు కేజీలు అందజేసేవారు. వైకాపా సర్కారు వచ్చాక కందిపప్పు పరిమాణం కేజీకి తగ్గించేసి.. ధర రూ.67కు పెంచేశారు. అలాగే రూ.10కు అందజేసే అరకేజీ పంచదారను రూ.17కు పెంచారు. అంటే ఒక్కో కార్డుపై రూ.34 అదనంగా భారం పడుతోంది. ఈ లెక్కన జిల్లా మొత్తం మీద 12.28 లక్షల కార్డుదారులపై నెలకు రూ.4.38 కోట్ల ధరల భారం మోపారు. పోనీ సరకులైనా సక్రమంగా అందిస్తున్నారా అంటే అదీ లేదు. జిల్లాలోని కార్డుదారులందరికీ కేజీ కందిపప్పు చొప్పున అందించాలంటే నెలకు 1,238 మెట్రిక్ టన్నులు అవసరం. ఆ మేరకు నిల్వలు ఏ నెలా రేషన్ దుకాణాలకు చేరడం లేదు. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు కందిపప్పు కనీస నిల్వలు కూడా పంపించలేకపోయారు. బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేయలేక బియ్యం, పంచదారతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గోధుమపిండి ఇస్తున్నా, నాణ్యత బాగోలేక తీసుకోవడానికి కార్డుదారులు ఇష్టపడడం లేదు.
రేషన్ కందిపప్పు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రాయితీపై కేజీ రూ.67 చొప్పున ఇవ్వాల్సి ఉండగా ఈ నెల రాలేదు బయటే కొనుక్కోండి అనే మాటే ఎక్కువ వినిపిస్తోంది. బయట మార్కెట్లో కేజీ రూ.160 నుంచి రూ.170 పలుకుతోంది. అంటే రేషన్ దుకాణాల కంటే బయట కేజికి అదనంగా రూ. 90 నుంచి రూ.100 పైగా ఖర్చుచేయాల్సి వస్తోంది. అంత డబ్బులు పెట్టి పప్పులు కొనలేక పేదలు చింతపండు చారుకే పరిమితం అవుతున్నారు.
కేంద్రం బియ్యంతో జగన్ ప్రచారం..
కొవిడ్ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా బియ్యం పంపిణీ చేస్తుండేవి. కేంద్రం ఉచితంగా ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 చొప్పున ఇస్తుండేది. గత రెండేళ్లుగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన (పీఎంజీకేఏవై) ద్వారా ఉచిత బియ్యం మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కేజీ రూపాయి బియ్యాన్ని నిలిపేసింది. ఆ మేరకు బియ్యంపై చేసే రూ.కోట్ల ఖర్చును ప్రభుత్వం మిగుల్చుకుంది. కందిపప్పు సరఫరాపైనా చేతులేత్తేశారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం అరకేజీ పంచదార మాత్రమే కార్డుదారుకు అందిస్తోంది. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని జగన్ బొమ్మలతో ఎండీయూ వాహనాల్లో చేరవేసి తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ
[ 30-04-2024]
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ట్రాన్సుపోర్టు వ్యాపారి దుర్మరణం
[ 30-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. -
‘కర్కశ జమా’నా!!
[ 30-04-2024]
ఆ వృద్ధులు...కర్రదన్నుగా లేకుంటే నడవలేరు అలా పదడుగులు వేసినా ఆయాసం వచ్చేస్తుంది! చదువురాదు...అక్షరం తెలియదు.. చూపు కనిపించక మరొకరి సాయం తీసుకోవాల్సిందే!! -
పర్యాటక రంగంపై వైకాపా పడగ
[ 30-04-2024]
గమ్య నగరంగా విశాఖకున్న పేరును వైకాపా పాలకులు బంగాళాఖాతంలో కలిపేశారు. జగన్ సర్కారు హయాంలో పర్యాటక రంగం కుదేలైంది. -
అసెంబ్లీ ఎన్నికల బరిలో101 మంది
[ 30-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 101 మంది నిలిచారు. -
ఎర్రమట్టి దిబ్బలకు గండం
[ 30-04-2024]
విశాఖ నగరం, సమీప ప్రాంతాల్లోని భూములపై కన్నేసిన అధికార వైకాపా నేతల కన్ను భీమిలికి సమీపంలోని భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియోహెరిటేజ్ సైట్)గా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలపై పడింది. -
ఏజెంట్ల వివరాలు సమర్పించాలి
[ 30-04-2024]
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్ల వివరాలను మంగళవారం సాయంత్రంలోగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్, ఆర్ఓ మల్లికార్జున కోరారు. -
ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి
[ 30-04-2024]
ముస్లిం ఓటర్లు గత ఎన్నికల్లో తనను ఎంతో ప్రోత్సహించారని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వలసలతో వైకాపా ఖాళీ: అనిత
[ 30-04-2024]
తెదేపాలోకి వలస వస్తున్న వారితో వైకాపా ఖాళీ అవుతోందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
పార్టీ కోసం మెట్టు దిగా: పైలా
[ 30-04-2024]
ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఓ మెట్టు దిగాల్సి వచ్చిందని తెదేపా నాయకుడు పైలా ప్రసాదరావు పేర్కొన్నారు. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
[ 30-04-2024]
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
విశాఖ లోక్సభ బరిలో 33 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
విశాఖ లోక్సభ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారు. 2019 ఎన్నికల్లో కేవలం 14 మంది పోటీ చేశారు. -
ఖాతాల్లో పడకపోతే ఇళ్లకెళ్లి పింఛన్ల పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
అనకాపల్లి లోక్సభ నుంచి15మంది పోటీ!
[ 30-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
[ 30-04-2024]
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
-
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్
-
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్