అరాచక పాలనపై పోరాడే సమయమిది
రాష్ట్రంలో అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలని తెదేపా పొలిట్బ్యారో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎలమంచిలిలో కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్కు మద్దతుగా శనివారం ఎన్నికల ప్రచార సభలో బాలయ్య పాల్గొని ప్రసంగించారు.
నందమూరి బాలకృష్ణ
సభలో మాట్లాడుతున్న బాలయ్య
ఎలమంచిలి, అచ్యుతాపురం, న్యూస్టుడే: రాష్ట్రంలో అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలని తెదేపా పొలిట్బ్యారో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎలమంచిలిలో కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్కు మద్దతుగా శనివారం ఎన్నికల ప్రచార సభలో బాలయ్య పాల్గొని ప్రసంగించారు. వైకాపా నాయకుల అక్రమార్జనకు ఖనిజాలు, సముద్రాలు సైతం సరిపోవడం లేదన్నారు. సీఎం జగన్ రుషికొండకు గుండుగీసి గ్రావెల్ దోచుకున్నారన్నారు. నవరత్నాలతో ప్రజలకు నవగొయ్యిలు తీశాడని విమర్శించారు. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, ఇప్పుడు ఆయనే మద్యం వ్యాపారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. జగన్ సీఎంలా కాకుండా సైకోలా పరిపాలన సాగిస్తున్నాడని, మాస్కు అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్ను పొట్టన పెట్టుకున్నాడని గుర్తు చేశారు. జగన్ అరాచకాలను ఐదేళ్లు ఓపిగ్గా భరించామని, ఇప్పుడు ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. వైకాపా ప్రభుత్వం మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసిందని, ఎదిరించిన వారిపై తప్పుడు కేసులు, ఎస్సీ, ఎస్టీ చట్టం కేసులు నమోదు చేసి భయాందోళన సృష్టించిందన్నారు.
మత్స్యకారులు, నిర్వాసితులను ఆదుకుంటాం
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్లుగా అన్యాయానికి గురైన పూడిమడక మత్స్యకారులను ఆదుకుంటామని బాలయ్య హామీ ఇచ్చారు. గ్రామంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) నిర్వాసితులకు తెదేపా న్యాయం చేస్తే, వైకాపా అన్యాయం చేసిందన్నారు. నిర్వాసితులకు ఉపాధి కల్పనతోపాటు వారి పెండింగ్ సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. చంద్రబాబు అనుభవమంత వయసు లేని మంత్రి అమర్నాథ్ ఆయన్నే విమర్శిస్తున్నాడని బాలయ్య మండిపడ్డారు. విశాఖ సదస్సు ద్వారా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, వచ్చిన పెట్టుబడులు ఎంత, యువతకు దక్కిన ఉపాధి ఎంత అనే విషయం అడిగితే పరిశ్రమల శాఖ మంత్రిగా సమాధానం చెప్పాల్సిన అమర్నాథ్ కోడిగుడ్డు పెట్టింది, అది పిల్లలు పెడుతుందని సామెతలు చెప్పాడన్నారు. వైకాపా నాయకుల అవినీతి వల్ల కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి వెనక్కి పోయాయన్నారు. ఆడ, మగ తేడాలేకుండా దూషించడమే ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు విధానమన్నారు. ప్రజల ఆస్తులు కబ్జా చేయడం, అక్రమ లేఅవుట్లు వేయడం ఆయన దినచర్యని పేర్కొన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షులు తాతయ్యబాబు, ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్కుమార్, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, సీఎం రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
రావికమతం, న్యూస్టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమిని ఆశీర్వదించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని సినీ హీరో నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. కొత్తకోటలో శనివారం రాత్రి రోడ్డుషో నిర్వహించారు. ఆయన ప్రసంగిస్తూ.. వైకాపా ప్రభుత్వం కొత్తగా పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్న వాటిని వెళ్లగొట్టి యువతకు ఉద్యోగాల్లేకుండా చేసిందన్నారు. ఒక రాక్షసుడి పాలనను అంతం చేసేందుకు అందరూ చేతులు కలపాలని కోరారు. చోడవరం తెదేపా అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు, తెదేపా జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
వైకాపా గూండాలకు రోజులు ముగిశాయి
[ 18-05-2024]
వైకాపా గూండాలకు రోజులు ముగిశాయని ఉత్తర నియోజకవర్గం భాజపా (కూటమి) ఎమ్మెల్యే అభ్యర్థి పి.విష్ణుకుమార్ రాజు హెచ్చరించారు. బర్మాక్యాంపు ప్రాంతంలో ఓ కుటుంబంపై దాడి ఘటనపై శుక్రవారం సీతమ్మధారలోని పార్టీ కార్యాలయంలో బాధితులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
5,56,819 మంది పోలింగ్కు దూరం
[ 18-05-2024]
విశాఖ పార్లమెంట్ పరిధిలో 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. కానీ అయిదేళ్లకోసారి వచ్చే అవకాశాన్ని 5 లక్షలకు పైగా ఓటర్లు జారవిడుచుకున్నారు. సమర్థులైన నాయకులను ఎన్నుకునేందుకు ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించుకోలేదు. -
కోడికత్తి కేసు వాయిదా
[ 18-05-2024]
కోడికత్తి కేసు విశాఖలోని ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం విచారణకు వచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు. -
వేసవి క్రీడా శిబిరాలు ఉన్నట్టా.. లేనట్టా..!
[ 18-05-2024]
పాఠశాల స్థాయి విద్యార్థులకు వేసవి క్రీడా శిబిరాల నిర్వహణపై ఈ ఏడాది మహా విశాఖ నగరపాలక సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు శిబిరాలు ఉంటాయా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. -
నేడు నిర్మాల్య చందనం విక్రయాలకు విరామం
[ 18-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి నిర్మాల్య చందనం విక్రయానికి శనివారం విరామం ఇస్తున్నట్లు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
దాడి పూర్వాపరాలపై డీసీపీ ఆరా
[ 18-05-2024]
తెదేపాకు ఓటు వేయలేదన్న కక్షతో కంచరపాలెం బర్మాక్యాంప్లో నూకాంబిక ఆలయం వద్ద గురువారం ఒక కుటుంబంపై జరిగిన దాడి కేసుకు సంబంధించి రాజకీయ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం డీసీపీ-2 ఎం.సత్తిబాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. -
వేడి నీటిలోకి జారిపడ్డ ఉక్కు కార్మికుడు
[ 18-05-2024]
విశాఖ ఉక్కు కర్మాగారంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఒప్పంద కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్టీల్ప్లాంట్ పోలీసులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... కర్మాగారంలోని కోకోవెన్ బ్యాటరీ-3లో సెమీ స్కిల్డ్ వర్కర్గా పని చేస్తున్న జె.సాంబయ్య (55) ఉదయం జనరల్ షిఫ్ట్కు వెళ్లాడు. -
వైజాగ్ కన్వెన్షన్లో మెగా కన్జ్యూమర్ ఎక్స్పో
[ 18-05-2024]
పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్లో ఇండియా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఫెయిర్(ఐఐసీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మెగా కన్జ్యూమర్ ఎక్స్పో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈనెల 20వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో ఇంటీరియర్, ఫర్నీచర్, దుస్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ తదితర వందకు పైగా స్టాళ్ల ద్వారా విక్రయిస్తున్నారు. -
ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తన్వి రిషిక
[ 18-05-2024]
ఇటీవల కేరళలో జరిగిన జూనియర్ మోడల్స్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విన్నర్గా నిలిచిన నగరానికి చెందిన తన్వి రిషికను విశాఖ పౌరగ్రంథాలయంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. -
అమ్మవారి పండగపై పోలీసుల ఆంక్షలు
[ 18-05-2024]
కొమరవోలు గ్రామదేవత అయిన కొమరవోలు తల్లి పండగ ఈసారి పోలీసు ఆంక్షలతో సాదాసీదాగా సాగింది. ఈ పండగ మూడేళ్లకోసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంటారు. -
పాడేరు మోదకొండమ్మ జాతర 9 నుంచి
[ 18-05-2024]
ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. -
నాలుగు రోజులు చిరుజల్లులు
[ 18-05-2024]
జిల్లాలో మరో నాలుగు రోజులు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రవారం వాతావరణ అధారిత సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. -
వాహన లైటింగ్తో వేగాన్ని తేల్చేలా..
[ 18-05-2024]
టెలి కమ్యూనికేషన్ డే సందర్భంగా అనకాపల్లిలోని డైట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు నూతన టెక్నాలజీ లైఫై ప్రాజెక్టును రూపొందించారు. కాంతి మార్గం ద్వారా మనం అందించే సిగ్నల్స్ రిసీవ్ చేసుకునేలా దీన్ని తయారుచేశారు. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
-
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
-
ఎప్సెట్ ఫలితాలు నేడే
-
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!