logo

ప్రతి ఇంటికీ పథకాలు అందించాం: బెల్లాన

ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. రామభద్రపురం వైకాపా కార్యాలయంలో ఆదివారం గృహసారథులు, సచివాలయ కన్వీనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శంబంగి చినఅప్పలనాయుడుతో కలసి పాల్గొన్నారు.

Published : 06 Feb 2023 04:31 IST

చీపురుపల్లిలో కిట్లు పంపిణీ చేస్తున్న ఎంపీ చంద్రశేఖర్‌

రామభద్రపురం, చీపురుపల్లి, న్యూస్‌ టుడే: ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. రామభద్రపురం వైకాపా కార్యాలయంలో ఆదివారం గృహసారథులు, సచివాలయ కన్వీనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శంబంగి చినఅప్పలనాయుడుతో కలసి పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నీ వంద శాతం అమలు చేశారన్నారు. అంతా అండగా నిలవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా గృహసారథులు పనిచేయాలని కోరారు.  ఎంపీపీ లక్ష్మణరావు, జడ్పీటీసీ సభ్యురాలు సరస్వతి, ఏఎంసీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, శంబంగి వేణుగోపాల్‌నాయుడు, ఇంటి గోపాలరావు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టరు రాయల్‌, సింహాచలంనాయుడు పాల్గొన్నారు. బీ చీపురుపల్లిలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో గృహ సారథులకు ఎంపీ చంద్రశేఖర్‌ ఆదివారం కిట్లు పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని